రికార్డు కలెక్షన్ల ‘దుకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘దూకుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమాకి వస్తోన్న కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ ‘మొదటి వారం రోజుల్లోనే 50 కోట్ల 7లక్షలకుపైగా గ్రాస్, 35 కోట్ల 1లక్ష షేర్ సాధించి ఎనభై సంవత్సరాల తెలుగు చలన చిత్ర రికార్డును తిరగరాసింది.



నైజాంలో మొదటివారం 12 కోట్ల 51లక్షలు, ఆంధ్రలో 13 కోట్ల 10లక్షలు, సీడెడ్‌లో 6కోట్ల 30 లక్షలు, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో 6 కోట్ల 50 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది. విదేశాల్లో 11 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ‘దూకుడు’ చిత్ర విజయంపై పత్రికల్లో ప్రత్యేక కథనాలు వెలువడడం చూస్తుంటే మా చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలుస్తోంది’ అన్నారు.

శ్రీను వైట్ల మాటల్లో మహేష్‌బాబు

సాధారణంగా ప్రతి సినిమాలో కథానాయకుడు ఒక్కడే ఉంటాడు. కథంతా అతని చుట్టే తిరుగుతుంది కాబట్టి... థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి దృష్టి అతని మీదే ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లేటప్పుడు ఈ అభిప్రాయాన్ని చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే... సన్నివేశం ఓ హీరోలా కనిపిస్తుంది. అందులో కనిపించే ప్రతీ పాత్రా వినోదం పండించడానికి పోటీపడుతుంది. ఓ వైపు కథానాయకుడు ఆటాడించేస్తూనే ఉంటాడు. ఎక్కడా మాస్‌, యాక్షన్‌ తగ్గనీయడు. మరో వైపు మెక్‌డొనాల్డ్‌ మూర్తో, చికాగో సుబ్బారావో, బొక్కా వెంకట్రావో... చక్కిలిగింతలు పెట్టేస్తుంటాడు. తాజాగా మహేష్‌బాబు 'దూకుడు'ని తన శైలిలో చూపించి వినోదం పంచారు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఆయనతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా సంభాషించింది.

'దూకుడు' ఫలితం ఎలాంటి అనుభూతినిచ్చింది?
'దూకుడు' విడుదలైన మరునాడే నా పుట్టిన రోజు. ఘన విజయంతో తెలుగు ప్రేక్షకులు నాకు మరచిపోలేని బహుమతిని అందించారు. మూడు రోజుల్లోనే వసూళ్లపరంగా ఎన్నో రికార్డులు సాధించింది 'దూకుడు'. విదేశాల్లోనూ చక్కటి ఆదరణ పొందుతోంది. తరణ్‌ ఆదర్శ్‌లాంటి బాలీవుడ్‌ మార్కెట్‌ విశ్లేషకులు సైతం 'దూకుడు' హిందీ సినిమాలతో పోటీపడి విదేశాల్లో వసూళ్లు దక్కించుకొందని ట్విట్టర్‌లో రాశారు. ఇంతటి విజయాన్ని సాధించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది.
మహేష్‌బాబుతో సినిమా అనగానే మీకేమనిపించింది?
చాలా రోజులుగా మహేష్‌బాబుతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్నా. ఆ అవకాశం నాకు దొరికింది. ఎలాగైనా ఒక మంచి సినిమా తియ్యాలని మనసులో బలంగా అనుకొన్నాను. మహేష్‌కి నేను అనుకొన్న ఓ కథ చెప్పాను. ఆయన బాగుందనీ అన్నారు. ఎనభై శాతం స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేశాం. ఇక షూటింగ్‌కి వెళ్లడమే ఆలస్యం అనుకొన్న తరుణంలో ఓ రోజు రాత్రి ఈ కథను మార్చాలని అనిపించింది నాకు. మహేష్‌తో ఘన విజయం ఇచ్చే కథ ఇలా ఉండకూడదనే భావన కలిగింది. ఇంకో మంచి కథ తీసుకొస్తానని మహేష్‌కి చెప్పి వచ్చాను. కానీ... ఏం చేయాలీ? ఎలాంటి కథ చేయాలీ అనే ఒత్తిడి మొదలైంది. ఎలాగైనా మహేష్‌ని కొత్తగా చూపించాలని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు తట్టిన ఆలోచనే యువ ఎమ్మెల్యే పాత్ర. అక్కడ మొదలుపెట్టి అల్లుకొన్న కథే ఇది.
ఐపీఎస్‌ పాత్రకు, ఎమ్మెల్యేకీ ముడి వేసేశారు..?
ఈ ఆలోచనతోపాటు తండ్రీకొడుకుల మధ్య అనుబంధం, భావోద్వేగాల గురించి మా రచయిత గోపీమోహన్‌కి చెప్పాను. చాలా బాగుందని చెప్పాడు తను. ఏడు నెలలు అహర్నిశలు కష్టపడి ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాం. ఈ కథ విన్నాక మహేష్‌బాబు 'ఫెంటాస్టిక్‌, మైండ్‌ బ్లోయింగ్‌, అన్‌బిలీవబుల్‌' అనేశారు. ఆ మాటల్నే ఈ సినిమాలో వాడుకొన్నాం. కోన వెంకట్‌ సంభాషణలు, గుహన్‌ ఛాయాగ్రహణం, తమన్‌ సంగీతం మాకు కలిసొచ్చాయి. నిర్మాతలు నా మిత్రులు కావడంతో ఎంతో సహకరించారు.
మహేష్‌బాబు ఒక మాస్‌ కథానాయకుడు. వినోదానికి ప్రాధాన్యమిచ్చే దర్శకులు మీరు. ఈ కథ అనుకొన్నప్పుడు ఇద్దరి శైలికీ వ్యత్యాసముందని అనిపించలేదా?
కొన్నేళ్లుగా మహేష్‌బాబు శైలిని ప్రత్యేకంగా గమనిస్తున్నాను. తెరపై వినోదాన్ని పండించడంలో ఆయన సత్తా ఏమిటో నాకు తెలుసు. పైగా ఈ కథలో హీరో పాత్ర పలు కోణాల్లో కనిపిస్తుంది. ఇది వరకు ఎవ్వరూ కూడా మహేష్‌ని అన్ని కోణాల్లో చూపించకపోవటం మాకు కలిసొచ్చింది. అన్ని విషయాలు సమపాళ్లల్లో కుదరటంతో ఏ మాత్రం ఆలోచించకుండా ముందుకెళ్లాం. మా ప్రయత్నం చక్కటి ఫలితాన్నివ్వటం ఆనందాన్నిస్తోంది.
ఈ సినిమాలో భావోద్వేగాల పాళ్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి...
తెలుగులో గొప్ప విజయాన్ని సాధించిన సినిమాలను తీసుకొంటే అందులో వినోదం, భావోద్వేగాలు, ఉత్కంఠ.. ఈ మూడు సమపాళ్లల్లో ఉంటాయి. అప్పుడే మన ప్రేక్షకులకు చేరువవుతుంది సినిమా. అందుకే నవరసాల్లో నేను కరుణ రసానికీ తగిన ప్రాధాన్యమిస్తాను. నా సినిమాలు పరిశీలిస్తే కుటుంబ వాతావరణం తప్పకుండా ఉంటుంది. తండ్రీకొడుకుల చుట్టూ తిరిగే కథ కాబట్టే 'దూకుడు' సెంటిమెంట్‌ కూడా బాగా పండింది.
నటుడిగా కాదు... వ్యక్తిగతంగా మహేష్‌బాబుపై మీ అభిప్రాయం ఏమిటి?
ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గుతుంది. కానీ మహేష్‌ విషయంలో అది విరుద్ధంగా జరుగుతోంది. ఆయన అలా ఉండటానికి ఓ కారణం ఉంది. ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ఉంటారాయన. ఆయన నవ్వడానికి ఒక చిన్న కారణం కావాలంతే. మహేష్‌ అందం మాకు కొన్ని సంభాషణలు రాసుకొనేందుకూ పనికొచ్చింది.
తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిపై సర్వహక్కులు కథానాయకుడికే ఉంటాయి. కానీ ఈ సినిమా పతాక సన్నివేశాలను అందుకు భిన్నంగా చూపించడానికి కారణమేమిటి?
ఈ కథ ప్రత్యేకతే అది. 'దూకుడు' విజయానికి ప్రధానమైన ఓ కారణం కూడా పతాక సన్నివేశాలే. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పతాక సన్నివేశాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఎక్కడా కూడా రక్తపాతంతో కూడిన సన్నివేశాలు లేకపోవటంతో అన్ని వయసుల ప్రేక్షకులు ఆనందంగా చూస్తున్నారు.
మీ సినిమాలంటే తెర నిండా పాత్రలు, అడుగడుగునా మలుపులు తప్పనిసరిగా ఉండాల్సిందేనా?
నిజం చెప్పాలంటే... నాలుగైదు పాత్రలతో నేను సినిమా తియ్యలేను. సెట్‌కి వెళితే నాకు సందడి కనిపించాలి. మొదట్నుంచీ అలాగే అలవాటైంది. అయితే ఈ తరహా కథలను తెరపైకి తీసుకురావటంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం తూకం చెడినా ఫలితాలు మారిపోతాయి. ఇది కష్టమైన పనైనా నేను చాలా ఇష్టంగా చేస్తుంటాను.
రెఢీ, ఢీ... మీ సినిమాలు హిందీలోకి వెళ్తున్నాయి. మీరూ హిందీకి వెళ్లే ఆలోచనేమైనా ఉందా?
నా చిత్రాలు బాలీవుడ్‌కి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది. హిందీలో టాప్‌ త్రీ సినిమాల్లో 'రెడీ' ఒకటిగా నిలిచింది. 'ఢీ' సినిమాకి దర్శకత్వం వహించమని అడిగారు. కానీ నాకు తీరిక లేకపోవటంతో ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు 'దూకుడు' సినిమాని హిందీలో తీయాలనే ఆలోచన ఉంది. సల్మాన్‌ఖాన్‌ అయితే దీనికి బాగుంటాడని అనుకొంటున్నా. త్వరలోనే ఆ వివరాలు తెలుస్తాయి.
తదుపరి చిత్రం ఎప్పుడు?
ప్రస్తుతం దూకుడు విజయానందంలో ఉన్నాను. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా సినిమా ఉంటుంది. అలాగే వచ్చే యేడాది మహేష్‌బాబుతో మరో చిత్రం చేస్తాను.

అభిమానుల మధ్య మహేష్‌బాబు 'దూకుడు'

హేష్‌బాబు 'దూకుడు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన రోజునే ఆయన తన అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.
మహేష్‌, నమ్రత దంపతులు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి శుక్రవారం ఉదయం వచ్చారు. జి.ఆదిశేషగిరిరావు, శ్రీను వైట్ల, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట తదితరులు కథానాయకుడితో కలిసి చిత్రం చూశారు. మహేష్‌తమతో కలిసి చిత్రం చూడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆయన అందరికీ అభివాదం చేశారు. అలాగే కృష్ణ, విజయనిర్మల సినీమాక్స్‌లో చిత్రం వీక్షించారు. ప్రదర్శన అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్‌ నటనను మెచ్చుకొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

దూకుడు

సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నటీనటులు: మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, సాయాజీషిండే, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్‌ భరత్‌ తదితరులు
సంగీతం: తమన్‌
నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర
దర్శకత్వం: శ్రీను వైట్ల
విషయం: అజయ్‌(మహేష్‌బాబు)కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవలసిందే. అలా తీసుకొన్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తరవాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి (సమంత) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీద చూసి తెలుసుకోవలసిందే.
విశేషాలు: నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణ. వృత్తిగత జీవితంలో అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఛేదించిన విధానం ఉత్కంఠపరుస్తాయి. ఆయన నటన అందరికీ నచ్చుతుంది. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా తీర్చిదిద్దారు. బ్రహ్మానందం పాత్ర మరోసారి వినోదం పండిస్తుంద''న్నారు.
విడుదల: శుక్రవారం.

23న ‘దూకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా చిత్రానికి సెన్సార్ పూర్తికాలేదని, ఎప్పుడు విడుదలవుందో తెలియదనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటిని మేము ఖండిస్తున్నాం. చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. ఒక్క నైజాంలోనే దాదాపు 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తొలిసారిగా పైరసీని అరికట్టడానికి కోర్టు ద్వారా ‘జాన్ డో’ ఉత్తర్వులను పొందాము. దీని ప్రకారం మా చిత్ర విజువల్స్‌గానీ, ఆడియోగాని, ఏ రూపంలో అనగా డిజిటల్ ఫార్మెట్‌లోగాని ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం నేరం. ఎవరైనా కోర్టువారి ఉత్తర్వులు ఉల్లంఘించి కాపీరైట్ చౌర్యానికి పాల్పడితే చట్టవూపకారం చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.

ముంబయిలో 'బిజినెస్‌ మేన్‌'

హేష్‌బాబు - పూరి జగన్నాథ్‌... వీరి పేర్లు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం 'పోకిరి'. ఆ తరవాత వీరి నుంచి వస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''మళ్లీ పోకిరి బృందం నుంచి ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన కథతో బిజినెస్‌ మేన్‌ సిద్ధమవుతోంద''న్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. త్వరలో హైదరాబాద్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు నిర్మాత. వచ్చే యేడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: తమన్‌.

‘దూకుడు’లో స్టెప్స్ సూపర్బ్

‘‘టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు ‘దూకుడు’ నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు’’ అని ధీమాగా చెబుతున్నారు అందాలభామ సమంత. త్వరలో విడుదల కానున్న ‘దూకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ సమంత పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు.

ఇక రెండో సినిమా ‘బృందావనం’లో ఆ అవకాశం వచ్చినా... అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ‘దూకుడు’లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు.

డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా ‘దూకుడు’. నా కెరీర్‌లో ఓ మెమరబుల్ హిట్‌గా ఈ సినిమా నిలవడం ఖాయం’’ అని ఎంతో ఉద్వేగంతో చెప్పుకొచ్చారు సమంత.

ఓ వైపు ఆటో సుబ్బారావు..

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, పార్వతీమెల్టన్‌పై 'ఓ వైపు హాయ్‌ అంటాడు ఆటో సుబ్బారావు..' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్‌లో ఫిక్సయితే బ్త్లెండ్‌గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్‌రా నాది..' ఇలా మహేష్‌ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్‌ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. తమన్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పోయ్‌..పోయ్‌ పాట మాస్‌కి బాగా నచ్చుతుంద''న్నారు.

మహేష్ మాస్ మసాలా ‘దూకుడు’

‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’ అంటూ మహేష్ త్వరలో వెండితెర మీదికి ‘దూకుడు’గా రాబోతున్నాడు. ఆయన అభిమానులు ఆయన నుంచి ఎదురుచూస్తున్న మాస్ మసాలా వినోదాన్ని ఈ చిత్రం ద్వారా పంచబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రీతిలో దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ను ‘దూకుడు’లో ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్, పార్వతీమెల్టన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటలో పార్వతీ హాట్ హాట్‌గా కనిపించనుందని యూనిట్ వర్గాలు చెపుకుంటున్నాయి. ఇక ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న దూకుడు గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘మహేష్ కెరీర్‌లో అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా వుంటాయి. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అతి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనుసూద్, సయాజీ షిండే, నాజర్, సంజయ్ తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్‌రాజు బేనరులో వెంకటేష్, మహేష్ నటిస్తున్న

ఇది ఏప్రిల్ ఫూల్ వార్త కాదు. ఇది నిజంగా నిజం. అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్‌బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఈ వార్త అతి త్వరలోనే నిజం కాబోతోంది. నిజమైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా నిలిచే ఈ చిత్రం టైటిల్ కూడా సరికొత్త పంథాలో ఉండబోతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం.

వరుస విజయాల పరుసవేదిగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2008లో ‘కొత్త బంగారులోకం’తో తన సృజనను చాటుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లు శ్రమించి ఈ మల్టీస్టారర్ స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ, వెంకటేష్-పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి.

వెంకటేష్, మహేష్‌లకు స్క్రిప్టు నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపినట్టుగా సమాచారమ్. నవంబర్ నెలాఖరున కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ చిత్రీకరణ మొదలు పెట్టడానికి దిల్‌రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా కనిపిస్తారనేది సమాచారం. ప్రకాశ్‌రాజ్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడవుతాయి.

రామోజీ ఫిలింసిటీలో 'దూకుడు' గీతం

సరా బరిలో సందడి చేసేందుకు మహేష్‌బాబు సిద్ధమవుతున్నారు... 'దూకుడు' చిత్రంతో. ఆ సినిమాకి సంబంధించిన గీతాన్ని ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని సిద్ధం చేశారు. మహేష్‌, సమంతలపై చిత్రిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 'దూకుడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర తెలిపారు. తమన్‌ స్వరపరచిన గీతాలు ఇటీవలే శ్రోతల ముందుకొచ్చాయి.

మహేష్ బిజినెస్ మొదలైంది

మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్ మేన్’ షూటింగ్ సెప్టెంబర్ 2న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ‘ ‘పోకిరి’ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. మా ఇద్దరి కలయికలో అద్భుతమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. మా ఇద్దరి కలయికలో నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద సినిమా కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న స్క్రిస్ట్ ఇది’అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ‘ మహేష్‌తో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన చెప్పే డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి.ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వెంకట్ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నారు’అని తెలిపారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ‘టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ నెల 11 నుంచి డిసెంబర్ 25 వరకు ఒకే షెడ్యూల్లో ముంబాయి, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ జరుపుతాం.

జనవరి 12న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం’అన్నారుపకాష్‌రాజ్, షాయాజీ షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, కెమెరా: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, సహ నిర్మాత: వి. సురేష్ రెడ్డి, నిర్మాత: డా. వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే- దర్శకత్వం: పూరి జగన్నాథ్

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates