హైదరాబాద్‌లో దూకుడు


హేష్‌బాబు, సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. హైదరాబాద్‌లో పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో ఇందు కోసం ప్రత్యేకంగా సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఆ తరవాత విదేశాల్లో పాటను చిత్రిస్తారని సమాచారం. ఇటీవలే హైదరాబాద్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మహేష్‌బాబు నేపథ్యంలో వచ్చే యాక్షన్‌ ఘట్టాలను నగరంలోని పాతబస్తీలో చిత్రీకరించారు. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. ''మహేష్‌బాబు శైలికి తగ్గ యాక్షన్‌, వినోదాంశాలతో కూడిన చిత్రమిది. ఆయన హావభావాలు కూడా ఇందులో వైవిధ్యంగా ఉంటాయి. 'నీ దూకుడు సాటెవ్వడు...' అంటూ సాగే టైటిల్‌ పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద''ని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.

ప్రిన్స్ సరసన ప్రియాంక

బాలీవుడ్ ఫ్యాషన్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రంతో మరోసారి కోలీవుడ్‌కు రానుంది. అదీ తెలుగుస్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు సరసన మెరవనుందని కోలీవుడ్ సమాచారం. మణిరత్నం పొన్నియన్ సెల్వన్ నవలను తెరకించనున్న విషయం తెలిసిందే. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్, ఆర్య, తెలుగు స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఎంపికయ్యారు. ఒక హీరోయిన్‌గా అందాల తార అనుష్క ఎంపికైనట్లు తెలుస్తోంది.

మరో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాను ఎంపిక చేసే ప్రయత్నంలో మణిరత్నం ఉన్నారు. ఈ ఫ్యాషన్ క్వీన్‌తో ఇప్పటికే మణిరత్నం మాట్లాడినట్లు ఆమె కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా ప్రియాంక ఇంతకు ముందే విజయ్‌కు జంటగా తమిళన్ అనే చిత్రంలో నటించారు. కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో విజయ్‌కు జంటగా అనుష్క నటించనున్నట్లు, ఆమెకు అన్నగా నటించే మహేష్‌కు ఫెయిర్‌గా ప్రియాంకా చోప్రా నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

ప్రియాంక బాలీవుడ్‌లో యమ బిజీగా ఉన్నా మణిరత్నం చిత్రాన్ని వదులుకోదలచుకోలేదట. త్వరలో ఆమె చెన్నై వచ్చి మణితో చర్చించడానికి సిద్ధం కానున్నారని తెలిసింది.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates