మహేష్‌తో పూరి చిత్రం

డచిన దశాబ్దంలో తెలుగు సినిమా వసూళ్ల స్థాయిని చాటిన చిత్రం 'పోకిరి'. కొత్త దశాబ్దం ప్రారంభంలో 'పోకిరి' జోడీ నుంచి ఓ చిత్రం రూపొందబోతోంది. ఆ సినిమా పేరు చెప్పగానే మహేష్‌బాబు, దర్శకుడు పూరి జగన్నాథ్‌లే గుర్తుకొస్తారు. మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తుంది. మే మాసంలో ఈ చిత్రం మొదలవుతుంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''పూరి చెప్పిన కథ నచ్చింది. కొత్తదనంతో ఉందా కథ. 'పోకిరి' తరవాత మా నుంచి వచ్చే ఆ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద''న్నారు. ''నేను వినిపించిన కథ మహేష్‌ని ఆకట్టుకుంది.  
ఇది మా ఇద్దరి కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుంద''న్నారు దర్శకుడు. నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ''2011లో మా సంస్థ చేయబోయే భారీ చిత్రమిది. నటీనటుల, సాంకేతిక నిపుణులను త్వరలోనే ప్రకటిస్తామ''న్నారు.

మహేష్‌తో అనుష్క ‘వేట’

ఇటీవల విడుదలైన ‘మహేష్ ఖలేజా’ చిత్రాన్ని చూశారా... ఆ చిత్రంలో జంటగా నటించిన అల్లూరి సీతారామరాజు, సుభాషిణిల జంట ఎలా వుంది..! వారిద్దరి మధ్య నడిచిన సన్నివేశాలు మిమ్ములను నాన్‌స్టాప్‌గా నవ్వించాయి కదూ..? ఆ చిత్రంలో సీతారామరాజు, సుభాషిణిలుగా నటించిన మహేష్‌బాబు, అనుష్క జంట త్వరలో మరో చిత్రంలో కూడా కలిసి నటించనున్నారని సమాచారమ్.

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్న మహేష్ త్వరలో లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ‘వేట’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాలో అనుష్క కథానాయికగా ఎంపికయ్యారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయకుడు మాధవన్‌తో పాటు నాయిక సమీరారెడ్డి కూడా కీలక పాత్రలను పోషించనున్నారట.

ఇంకో విషయం ఏమంటే- ఈ చిత్రంలో తెలుగులో మహేష్ చేస్తున్న పాత్రను తమిళంలో ఆర్య చేస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్‌తో వెంటనే మరో చిత్రం చేసే అవకాశం రావటం పట్ల స్వీటీ (అనుష్క ముద్దుపేరు) ఆనందంగా వున్నారని సమాచారమ్.

దుబాయ్‌లో దూకుడు


 
'ఖలేజా'లో సరికొత్త హావభావాలతో అభిమానుల్ని ఆకట్టుకొన్నారు మహేష్‌బాబు. ఆయన మాట తీరులో, నటనలో ఇంతకు ముందు లేని 'దూకుడు' కనిపించింది. ఇప్పుడు ఆయన కొత్త సినిమా పేరు కూడా అదే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ కొన్ని పాటల్ని తెరకెక్కిస్తారు. ఇది వరకు టర్కీలో కొంత భాగం చిత్రీకరించారు. వినోదం, యాక్షన్‌ తగుపాళ్లలో మేళవించిన కథ ఇదని, ఇందులో మహేష్‌ మరింత కొత్తగా కనిపిస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: తమన్‌.|

తెలుగులో 'త్రీ ఇడియట్స్‌'

బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన చిత్రం 'త్రీ ఇడియట్స్‌'. శంకర్‌ ఈ కథని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. 'రోబో' తరవాత శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిదే. ఆయన ఓ రీమేక్‌ కథను ఎంచుకోవడం కూడా ఇదే తొలిసారి. తెలుగులో మహేష్‌బాబు, తమిళంలో విజయ్‌ కథానాయకులు. రెండు భాషల్లోనూ ఇలియానా నాయికగా నటించబోతోంది. ఇటీవలే ఆమెతో శంకర్‌ చర్చించారు. డిసెంబరు 26 నుంచి చిత్రీకరణ మొదలవుతుందని చెన్నై సమాచారం. మాధవన్‌, శర్మాన్‌ జోషి పాత్రల్ని తమిళ నటులు ఆర్య, జీవా పోషిస్తారు. ప్రిన్సిపాల్‌గా సత్యరాజ్‌ నటిస్తారు. కథకు మూలం 'త్రీ ఇడియట్స్‌' సినిమానే అయినప్పటికీ దక్షిణాది ప్రేక్షకుల అభిరుచులు, కథానాయకుల శైలిని బట్టి కొన్ని మార్పులు చేసినట్లు తెలిసింది. హారిస్‌ జైరాజ్‌ స్వరాలు, మనోజ్‌ పరమహంస ఛాయాగ్రహణం అందిస్తారు.

టర్కీలో మహేష్‌ 'దూకుడు'


హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. తమన్‌.ఎస్‌ సంగీతం సమకూరుస్తున్నారు. నీ దూకుడు సాటెవ్వడు... అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం టర్కీలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రేమ, వినోదం, యాక్షన్‌ మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెరపై మహేష్‌ కొత్త తరహా హావభావాలతో వినోదాన్ని పండిస్తారని దర్శకుడు అంటున్నారు. టర్కీలో మహేష్‌, సమంతలపై ఒక పాటతో పాటు, కొన్ని పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. త్వరలో గుజరాత్‌, దుబాయ్‌లో చిత్రీకరణ జరుపనున్నట్టు సమాచారం. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. సమర్పణ: కృష్ణా ప్రొడక్షన్స్‌ ప్రై.లి.

మణిరత్నం దర్శకత్వం లో మహేష్, విక్రమ్..!


 ఖలేజా కుర్రాడు మహేష్‌..సంచలన దర్శకుడు మణిరత్నం రూపకల్పనలోని చిత్రంలో నటించనున్నాడా? అంటే..అవుననే వినిపిస్తోంది ఫిలింనగర్‌లో! ఈ చిత్రాన్ని ‘రోబో’ నిర్మాత కళానిధి మారన్‌ సన్‌పిక్చర్స్‌ పతాకంపై నిర్మించనున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళ్‌ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరెక్కే ఈ చిత్రంలో హీరో విక్రమ్‌ కూడా మరో కీలక పాత్రలో నటించనున్నాడు. ఇటీవల ‘విలన్‌’ను అభిషేక్‌, విక్రమ్‌లతో రూపొందించిన మణి..ఈ చిత్రాన్ని కూడా ప్రయో గాత్మకంగా తనదైన శైలిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చారిత్రక కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో మహేష్‌ పల్లవ రాజుగా చోళరాజు (రాజరాజు)గా దర్శనమిస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఏదేమైనా..నాగార్జున, అరవింద్‌ స్వామిలతో అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరించిన మణి ఈసారి మహేష్‌తో ఇంకెలాంటి వండర్‌ను ఆవిష్కరిస్తారో అనే ఉత్సుకత అభిమానుల్లో ఉంది.

‘ఖలేజా’ ది బెస్ట్ - మహేష్‌బాబు

‘‘నేను ఊహించినదానికన్నా ఈ చిత్రానికి ఎక్కువ స్పందన లభించింది. చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నా అభిమానులు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు’’ అని మహేష్‌బాబు అంటున్నారు. ఆయన హీరోగా, అనుష్క హీరోయిన్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శింగనమల రమేష్, సి.కళ్యాణ్ కలిసి నిర్మించిన ‘మహేష్ ఖలేజా’ గత గురువారం విడుదలైన విషయం విదితమే. ఈ చిత్రం తాము ఊహించినట్లుగానే ప్రేక్షకాదరణ పొందిందని ఆదివారం ఏర్పాటు చేసిన ‘సక్సెస్ మీట్’లో మహేష్‌బాబు తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ‘‘పది సినిమాలకు చేసే నటనను మహేష్‌బాబు ఈ ఒక్క సినిమాకే చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా యూఎస్‌లో కూడా ఈ చిత్రం భారీ వసూళ్లు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేయనంత చేస్తోంది ‘ఖలేజా’’’ అన్నారు.

‘‘మహేష్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’కి పూర్తి భిన్నంగా ఈ చిత్రంలోని పాత్ర ఉండాలనుకున్నాను. ‘అతడు’లో మహేష్ తక్కువ మాట్లాడతారు. ఇందులో అందుకు భిన్నంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మేమందరం మా శక్తి మేరకు మంచి సినిమా ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేశాం, అది ఫలించింది’’అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్‌బాబు సమాధానాలు చెప్పారు. వాటిల్లో సంక్షిప్తంగా కొన్ని... ‘‘మొదటిసారి నేను చాలా ఓపెన్ అయ్యి యాక్ట్ చేసిన సినిమా ఇది. మాములుగా తక్కువగా మాట్లాడే నేను ఈ సినిమాలో ఎక్కువగా మాట్లాడాను. వ్యక్తిగతంగా కూడా ఇప్పుడు ఫ్రీగా మాట్లాడుతున్నాను. ఈ చిత్రాన్ని నాన్నగారు చూసి అద్భుతంగా చేశావు, సినిమా బాగుంది అని అభినందించారు.

మా అబ్బాయి గౌతమ్ ఇంకా సినిమా చూడలేదు. కానీ, ఈ సినిమాలోని ‘సదా శివ..., కురిసే పెదవుల పైన.., ఇంకో పాట.. గౌతమ్ పూర్తిగా పాడతాడు. వాడు ఏ పాట అయినా ఇష్టంగా పాడాడంటే అది హిట్ కిందే లెక్క. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పాలంటే.. ఈ రెండేళ్లల్లో మేమిద్దరం బాగా చర్చించుకుని ఈ సినిమా చేశాం. మా అబ్బాయి రోజూ సాయంత్రం జూబ్లీ హిల్స్ క్లబ్‌కి వెళ్లి ఆడుకుంటాడు. వాడు అలా వెళ్లగానే త్రివికమ్ మా ఇంటికొచ్చేసి నాతో ఆడుకునేవాడు (నవ్వుతూ).

నాకు నేనుగా చెప్పుకోకూడదు కానీ, ఇప్పటివరకు ఏ సినిమాలోనూ చేయనంత అత్యద్భుతంగా నేను ఇందులో యాక్ట్ చేశా. ఈ చిత్రంలో నన్ను పాలి గ్రామస్తులు దేవుడిలా భావిస్తారు. ఆపదలో ఉన్నవారికి ఎవరైనా సహాయం చేస్తే ఆ వ్యక్తి దేవుడిలా కనిపిస్తాడనేది మా కాన్సెప్ట్. కథపరంగా హైదరాబాద్, రాజస్తాన్‌లలో నేను మామూలు టాక్సీ డ్రైవర్‌ని. కానీ పాలీ ప్రజలకు మాత్రం నేను దేవుడిలా కనిపిస్తాను. ఈ పాత్ర బాగా పండటం కోసం నా పరిధి దాటి యాక్ట్ చేశాను’’ అని చెప్పారు మహేష్‌బాబు.

రాజస్తాన్‌లో ఏం జరిగింది?

క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే ఓ ఉపాధ్యాయుడి మనవడు టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్ళిపోయే ఆ యువకుడు అనుకోని పరిస్థితుల్లో రాజస్థాన్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఓ అందమైన భామ పరిచయం అవుతుంది..? ఇక ఆ తర్వాత ఆ యువకుడికి ఎదురైన పరిస్థితులేమిటి? వాటిని అతను ఎలా చక్కదిద్దాడు..? అనేది మిగతా కథాంశం. ఇది టూకీగా మహేష్ ‘ఖలేజా’ కథ.

మూడేళ్ళ విరామం తర్వాత ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన ఈ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క నాయికగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. కనకరత్న మూవీస్ పతాకంపై శింగనమల రమేష్‌బాబు, సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాతలో ఒకరైన సి.కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు మంచి స్పందన వస్తోంది. మహేష్ కెరీర్‌లో అన్ని విధాలుగా ఇది నంబర్‌వన్ సినిమా అవుతుంది.


ఆయన అభినయం చిత్రానికి మొదటి హైలైట్‌గా నిలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ఎంతో స్టయిలిష్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. తప్పకుండా ‘ఖలేజా’ అన్ని వర్గాల ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ప్రకాష్‌రాజ్, డా.బ్రహ్మానందం, సునీల్, వేణుమాధవ్, అలీ, నాజర్, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, సమర్పణ: ఎస్.సత్యరామమూర్తి.

'ఖలేజా' చూపించడానికి మహేష్‌ సిద్ధమయ్యారు

హేష్‌బాబు తెలుగు తెరపై కనిపించి మూడేళ్లయింది. తమ అభిమాన కథానాయకుని సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 'ఖలేజా' చూపించడానికి మహేష్‌ సిద్ధమయ్యారు. ఈ చిత్రం 7న విడుదలవుతోంది. దైవమ్‌ మానుష్య రూపేణా అనే సిద్ధాంతంతో త్రివిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మహేష్‌ బాబు ట్యాక్సీ డ్రైవర్‌ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మహేష్‌ సరసన అనుష్క నటించింది. శింగనమల రమేష్‌, సి.కల్యాణ్‌లు నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. నిర్మాతల్లో ఒకరైన సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మహేష్‌, త్రివిక్రమ్‌ల కలయిక అనేసరికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటిని తప్పక అందుకొంటాం. ఇటీవలే విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంద''న్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, సునీల్‌, వేణుమాధవ్‌, అలీ, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, షపీ, సునీల్‌ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు నటించారు. ఛాయాగ్రహణం: ఎస్‌.భట్‌, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్‌, కళ: ఆనంద్‌సాయి, సమర్పణ: ఎస్‌.సత్యరామ్మూర్తి.

ఖలేజా పాటలు

హేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'ఖలేజా'. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. శింగనమల రమేష్‌, సి.కల్యాణ్‌ నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందించారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాటలు విడుదలయ్యాయి. మహేష్‌బాబు తనయుడు గౌతమ్‌కృష్ణ చేతుల మీదుగా పాటలను ఆవిష్కరింపజేశారు. అనంతరం మహేష్‌ మాట్లాడుతూ ''అందరి అంచనాలను అందుకొనే చిత్రమిది. త్రివిక్రమ్‌ తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకొంటుంది. మణిశర్మ చక్కటి సంగీతం అందించారు. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నాకైతే సదాశివ, పిలిచే పెదవులపైన.. అనే పాటలు బాగా నచ్చాయి. కథానాయకుడిని పరిచయం చేసే పాట ఇంకా వైవిధ్యంగా ఉంటుంది. నేను ట్విట్టర్‌లో కొన్ని పాటల్ని ఉంచాను. అభిమానుల స్పందన బాగుంద''న్నారు. ''మహేష్‌-త్రివిక్రమ్‌ కలయిక స్థాయిని చెప్పే చిత్రమిది. మణిశర్మ అందించిన స్వరాలు బాగున్నాయి. పెద్ద విజయాన్ని సాధిస్తుందీ చిత్రం'' అన్నారు అనుష్క. మణిశర్మ మాట్లాడుతూ ''మహేష్‌తో కలిసి చేసిన 'రాజకుమారుడు', 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' చిత్రాలు నాకు మంచి పేరును తీసుకొచ్చాయి. వాటిని మించి ఉంటాయి ఇందులోని పాటలు. సదాశివ.. అనే పాటకు చక్కటి స్పందన లభించింద''న్నారు. ''కేవలం పాటలే కాదు, నేపథ్య సంగీతానికి కూడా ప్రాధాన్యం ఉంది. మణిశర్మ సంగీతం ఓ ఆకర్షణ. చిత్రాన్ని వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు నిర్మాత సి.కల్యాణ్‌. ఈ కార్యక్రమంలో మహేష్‌ భార్య నమత్ర, నిర్మాత శింగనమల రమేష్‌, గీత రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సోనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

‘జూనియర్ ప్రిన్స్’ హల్‌చల్

ప్రిన్స్ మహేష్‌బాబు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్- ‘ట్విట్టర్’లోకి వెళితే.. ఆయన తనయుడు ‘జూనియర్ ప్రిన్స్’ గురించి ఎక్కువ కబుర్లు కనిపిస్తాయి. జూనియర్ ప్రిన్స్ అంటే అర్థమై వుంటుంది... మహేష్‌బాబు తనయుడు ‘గౌతమ్’ అని. షూటింగ్ లేని సమయంలో కొడుకుతో ఎక్కువ సమయం గడపడం, ఆ చిన్నారితో ఆడుకోవడం, అతని ముద్దు ముద్దు మాటలు వినడం మహేష్‌కు చాలా సరదా.

అంతేకాదు- కొడుకుని అప్పుడప్పుడు సరదాగా షూటింగ్‌కు తీసుకెళ్ళడం.. షాట్ గ్యాప్‌లో గౌతమ్ చెప్పే కబుర్లు వినడం గౌతమ్ చెప్పే ఆ మాటలతో తను ఉప్పొంగిపోవడం మహేష్‌కు మహా ఆనందం. ఇక అసలు విషయానికొస్తే - ఇక్కడి ఫొటోలో చేతిలో గిఫ్ట్‌ప్యాక్‌తో ఆనందంగా, ఉత్సాహంగా అడుగులేస్తున్న ఈ లిటిల్ ప్రిన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్‌దెక్కన్ హోటల్‌లో హల్ చల్ చేశాడు.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కూతురు ‘అహనా’ పుట్టినరోజు వేడుక సందర్భంగా తల్లి నమ్రతా మహేష్‌తో కలిసి వచ్చిన గౌతమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆ వేడుకలో అక్కడి వారిని తన ముద్దు ముద్దు మాటలతో అలరించాడు గౌతమ్.


నమ్రతతో నా ప్రేమ ఇలా మొదలైనది..!

ఆమె సింప్లిసిటీ నాకిష్టం. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు అంటూ ప్రిన్స్ మహేష్ బాబు   తన భార్య నమితతో ప్రేమలో పడిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ..వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే అన్నారు. అలాగే నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను. అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు..నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంటూ ముగించారు. అమృంతాంజనం ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో ఈ విషయాలను సరదాగా చర్చించారు.

అక్టోబరు 7న ఖలేజా


అక్టోబర్ 7... సూపర్‌స్టార్ మహేష్‌బాబు అభిమానులకు పండగ రోజే అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజునే ‘మహేష్ ఖలేజా’ చిత్రం విడుదల కానుంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రిన్స్ బాక్సాఫీస్ వద్ద తన ‘ఖలేజా’ చూపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ గతంలో చేసిన ‘అతడు’ ఆయన కెరీర్‌లోనే అందరి మన్ననలు అందుకున్న చిత్రంగా నిలిచింది. ఆ చిత్రాన్ని అధిగమించే స్థాయిలో ‘ఖలేజా’ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు అంటున్నారు.

అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ సినిమా గురించి మరో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ -‘‘బడ్జెట్ పరంగా, క్వాలిటీ పరంగా, రెవిన్యూ పరంగా, పెర్‌ఫార్మెన్స్ పరంగా... ‘మహేష్ ఖలేజా’ నంబర్‌వన్‌గా నిలుస్తుంది. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. మహేష్ తప్ప ఎవరూ ఈ పాత్రను ఆ స్థాయిలో పోషించలేరు అనిపించే స్థాయిలో ఇందులో ఆయన నటన సాగింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మించిన ఈ చిత్రం అందరి అంచనాలనూ అందుకుంటుందని నమ్మకంతో ఉన్నాం. మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం ఇచ్చారు.

ఇప్పటివరకూ మహేష్-మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఆడియోలన్నింటికంటే బెటర్‌గా ఈ చిత్రానికి మణిశర్మ పాటలు అందించారు. ఈ నెల 27న పాటలను, అక్టోబర్ 7న సినిమాను విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, నాజర్, డా.బ్రహ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, సుధ, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.భట్, ఆర్ట్: ఆనంద్‌సాయి, సమర్పణ: సత్యరామమూర్తి.


మహేష్ బాబుతొ సంభాషన

రెండేళ్లుగా నిర్మాణంలో ఉండి, ఏడాది కాలంగా ఊరిస్తూ వస్తున్న "మహేష్ ఖలేజా" మూడేళ్ల విరామం తర్వాత విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 24న ఈ చిత్రం ఆడియోను మార్కెట్లో విడుదల చేయనున్నారు. వచ్చే నెల 6న సినిమా విడుదల కానున్నదని సమాచారం. అయితే మహేష్ బాబు పలు యాడ్‌లలో బిజీగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాదులో అమృతాంజన్ ప్రకటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు చెప్పారు. అవి మీకోసం...

ఖలేజా అంటే ఏమిటి..? ఎలా ఉంటుంది..? 
టైటిల్‌కు తగినట్లే పవర్‌ఫుల్‌గా ఉంటుంది. నా కెరీర్‌లో ఇప్పటివరకూ నేను చేయని అత్యంత వైవిధ్యభరిత చిత్రంగా ఖలేజాను వర్ణిస్తాను. ఇంతకుముందు నేను చేసిన పాత్రలకు భిన్నంగా చాలా పెద్దదిగా, ఫన్నీగా మాట్లాడుతుండే టాక్సీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాను ఈ చిత్రంలో. 

ఇదొక పూర్తి నిడివి వ్యాపారాత్మక చిత్రం. ఇందులో సందేశాలుండవు, స్పీచ్ లుండవు. పైట్స్ కోసం ఫైట్లు అన్నట్లుగా కాకుండా ఈ చిత్రంలోని ఫైట్స్ అన్నీ స్టోరీని సెపరేట్ చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ఆస్వాదించే అన్ని అంశాలు సమపాళ్లలో కలగలిసిన చిత్రం ఖలేజా.

గ్యాప్‌లో మీరు నేర్చుకున్నదేమిటి...? 
నేను నటించిన చిత్రం మూడేళ్ల గ్యాప్‌తో విడుదల కావడం నా అభిమానులుకి కొంత నిరాశకు గురి చేస్తుండవచ్చు. కానీ.. ఒక నటుడిగా, వ్యక్తిగా నేను ఇది నాకు ఆనందన్నిచ్చే విషయమైతే.. నాకు అమితంగా బాధ కలిగించిన విషయం నేను ప్రాణప్రదంగా ప్రేమించే మా అమ్మమ్మను పోగొట్టుకోవడం. 

అలాగే మా అత్తమామలను( నమ్రత తల్లిదండ్రులు) కోల్పోవడం నన్నెంతగానో బాధించింది. ఈ పరిణామాలన్నీ నా మీద ఎంతగానో ప్రభావం చూపాయి. అయినా సరే నేను నిబ్బరంగా ఉండగలిగానంటే అందుక్కారణం మా నాన్నే. నాకు ఊహ తెలిసేనాటికి ఆయన చాలా పెద్ద హీరో. 

ఫ్యాన్స్ చూపే అభిమానం, ఆదరణ అపూర్వం. తను అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఇంట్లో ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండేవారు. అలాగే ఈరోజున నేను హీరోనయ్యానంటే అది కేవలం మా నాన్న చలవే. నా చదువు పాడవకుండా ప్రతి వేసవిలో నాతో ఒక సినిమా చేయిస్తూ వచ్చారు. నేను హీరోనయ్యానన్నా, బాగా నటిస్తానని పేరుతెచ్చుకుంటున్నా.. వాటన్నిటికీ నానే కారణం.

గౌతమ్‌ను సినిమాల్లోకి తెచ్చే ఆలోచన ఉందా.. 
భవిష్యత్‌లో ఏమవుతాడో ఎవరూ చెప్పలేం. ప్రస్తుతం ఇంకా చిన్నపిల్లవాడే. నాలుగేళ్ల వయసుకే భవిష్యత్‌లో పెద్ద హీరో అయ్యే లక్షణాలు కనబరుస్తూ ఉంటాడు. గౌతమ్ పుట్టాకే నా జీవితానికో అర్థం, పరమార్థం లభించిందని నేను భావిస్తాను. నాకు లభించిన వెలకట్టలేని ఒక గొప్ప బహుమతి గౌతమ్.. వాడు నా బిడ్డ మాత్రమే కాదు... నా సర్వస్వం. అసలు నా దృష్టిలో పితృత్వం పొందని పురుషుడు పరిపూర్ణుడ కాలేరు.

మీ ముందున్న ప్రధాన లక్ష్యాలు..? 
ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం జాతీయ అర్డును సాధించడం. నేషనల్ అవార్డ్ అందుకోవాలన్నది నా కోరిక. నా కల. అవి ఎప్పటికి నెరవేరుతాయో నాకు తెలీదు. అయితే కలగనడంలో తప్పు లేదు కదా..

మీకు ఇష్టం లేనివి ఏమిటి...? 
అబద్ధాలాడేవారంటే నాకు అసహ్యం. నేను ఎలాంటి వారినైనా భరిస్తాను కానీ, అబద్ధాలాడేవారిని మాత్రం అస్సలు సహించలేను. అటువంటి వాళ్లంటే నాకు పరమ అసహ్యం. అబద్ధాలాడే పరిశ్రమ, మోసం చేసేవాళ్లను నా దరిదాపులకు కూడా రానీయను. నాతో కలిసి పనిచేసే వాళ్లంతే నిజాయితీ, నిబద్ధత కలిగి నిపుణులై ఉండాలని కోరుకుంటాను. 

మీ జీవిత భాగస్వామిలో నచ్చిన అంశమేమిటి..? 
వంశీ సినిమా షూటింగ్ కోసం మేము 40 రోజులపాటు ఫారిన్ షెడ్యూల్ చేశాం. ఆ షెడ్యూల్ ముగిసే చివరి రోజున కానీ, ఈ 40 రోజుల్లో మా మధ్య విడదీయలేనంతగా అనుబంధం ఏర్పడిపోయిందని గుర్తించలేకపోయాం. నమ్రతతో నేను ప్రేమలో పడిన క్షణాలు మరువలేనివి. అయితే దీనిపై నన్నెవరైనా అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అదలా జరిగిపోయిందంతే.


ఆమె సింప్లిసిటీ నాకిష్ట. ఆమెలోని స్వచ్ఛత అంటే మరీమరీ ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం పెళ్లిచేసుకుందాం అని నేనెప్పుడూ నమ్రతకు చెప్పలేదు. నాన్న, అమ్మల అంగీకారం తీసుకోవడం కోసం నమ్మతను నేనిష్టపడుతున్నాననీ, ఆమెతో నా జీవితం పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాను. 

అప్పుడు నమ్రత గురించి నాన్న వాకబు చేశారు. ఆ తర్వాత 2005 ఫిబ్రవరిలో నేనూ నమ్రత పెళ్లి చేసుకున్నాం. ఆమె నా జీవిత భాగస్వామి కావడం నిజంగా నా అదృష్టం. అయిదేళ్లపాటు డేటింగ్ చేశాక మా ఇద్దరి పెళ్లి జరిగింది. పెళ్లై అయిదేళ్లయింది. మేమిద్దరం గడిపే ప్రతి క్షణం మా బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. నమ్రత నాకు భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా.

పూర్వజన్మల గురించి నమ్ముతారా.. 
దేవుడిని ఎలా నమ్ముతామో.. పూర్వజన్మలున్నాయనీ నమ్ముతాను. మా నాన్నను నేను ప్రేమించడం మాత్రమే కాదు ఎంతో గొప్పగా ఆరాధిస్తాను. ఆయన వ్యక్తిత్వం, నిరాడంబరత్వం అలవచుకునేందుకు నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. కృష్ణగారబ్బాయిగా జన్మించడం పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యఫలంగా నేను భావిస్తాను

ఖలేజా



'అతడు' తరువాత మహేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఖలేజా'. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కుతోంది. మహేష్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా కనిపిస్తారని సమాచారం. ఆయన హావభావాలు, పోరాటాలతోపాటు... అనుష్క అందాలు... మణిశర్మ సంగీతం ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని చిత్ర బృందం చెబుతోంది. వీటికి తోడు త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు అదనపు బలం. త్వరలోనే పాటల్ని ఆవిష్కరించి 'ఖలేజా' విడుదల తేదీని ఖరారు చేస్తారు.

మహేష్‌ 'ఖలేజా'

‘‘మహేష్ ‘ఖలేజా’ ఏంటో తెలిపే సినిమా ఇది. మహేష్ మాత్రమే చేయగలరు అనిపించే స్థాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన పాత్రను తీర్చిదిద్దారు.

మహేష్ అభిమానులనే కాక, అందరినీ అలరించే సినిమా ఇది’’ అంటున్నారు నిర్మాతల్లో ఒకరైన సింగనమల రమేష్‌బాబు.

సి.కళ్యాణ్‌తో కలిసి ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటోంది.

త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ ఇవి...

రామోజీ ఫిల్మ్‌సిటీలో మహేష్‌ 'ఖలేజా'


'ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో... వాడే పండుగాడు..' ఇలాంటి పదునైన మాటలు మహేష్‌బాబు నోటి నుంచి విని చాలాకాలం అయ్యింది. 'అతిథి' తర్వాత ఈ కథానాయకుడిని వెండి తెర మీద చూసే భాగ్యం అభిమానులకు ఇంకా కలగలేదు. ఆ లోటు తీర్చడానికి మహేష్‌- 'ఖలేజా' ఇప్పుడు శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్‌తో అనుష్క జోడీ కట్టింది. శింగనమల రమేష్‌, సి.కల్యాణ్‌ నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. ''మహేష్‌ పరిచయ సన్నివేశాల్లో వచ్చే గీతమిది. ప్రేమ్‌రక్షిత్‌ నృత్యరీతుల్ని సమకూరుస్తున్న ఈ గీతం మాస్‌ని ఆకట్టుకొంటుంది. మరోపాట చిత్రీకరించాల్సివుంది. త్రివిక్రమ్‌ శైలికి ఈ చిత్రం మరోసారి అద్దం పడుతుంది. మహేష్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలతో పాటు వాణిజ్య విలువలు పుష్కలంగా ఉన్నాయి. అనుష్క కేవలం గ్లామర్‌కే పరిమితం కాదు. ఆమె పాత్ర కూడా కీలకం. మహేష్‌బాబు- ప్రకాష్‌రాజ్‌ల మధ్య నడిచే సన్నివేశాలు ఆసక్తిగా ఉంటాయి. సెప్టెంబరు చివరికల్లా సినిమాని సిద్ధం చేస్తామ''న్నారు నిర్మాతలు. సంగీతం: మణిశర్మ

రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌బాబు

లాంటి పాత్రనైనా అలవోకగా పోషించడం మహేష్‌బాబు పద్ధతి. హీరోయిజాన్ని హిమాలయ పర్వమంత ఎత్తులో చూపించడం ఎస్‌.ఎస్‌.రాజమౌళి శైలి. వీళ్లిద్దరూ కలిస్తే యాక్షన్‌ సినిమా ప్రియులకు పండగే! త్వరలో మహేష్‌ - రాజమౌళి కలయికలో ఓ చిత్రం రాబోతున్నట్లు తెలుగు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మహేష్‌ ఇంటికి వెళ్లారు రాజమౌళి. ఆ సందర్భంలో ఆయన ఓ కథాంశాన్ని వినిపించారు. మహేష్‌ కూడా దీనిపై ఎంతో ఆసక్తిని కనబరిచారు. వీరిద్దరి నుంచి వచ్చే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టొచ్చు. ప్రస్తుతం రాజమౌళి 'మర్యాద రామన్న'కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆయన తరహాకి భిన్నంగా దీన్ని రొమాంటిక్‌ కామెడీగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం పూర్తి కావచ్చింది. సంక్రాంతికి వచ్చేలా శ్రీను వైట్ల చిత్రం ఉంటుంది.

మహేష్‌ చిత్రం ప్రారంభం

హేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రం లాంఛనంగా సోమవారం ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు శ్రీను మాట్లాడుతూ ''మహేష్‌బాబుని ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో ఆవిష్కరిస్తాం. సరదాగా... హృదయాన్ని హత్తుకొనేలా ఉండే ప్రేమ కథ ఇది. యాక్షన్‌ అంశాలు పుష్కలంగా ఉంటాయి. సాంకేతికంగానూ ఉన్నత విలువలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతామ''న్నారు. ''నమో వెంకటేశ తరవాత మా సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. మాకిది ప్రతిష్ఠాత్మకమైన చిత్రం. వచ్చే నెల 15 నుంచి షూటింగ్‌ ఉంటుంది. సంక్రాంతికి విడుదల చేస్తామ''ని నిర్మాతల్లో ఒకరైన గోపీచంద్‌ తెలిపారు. సమర్పణ: కృష్ణ ప్రొడక్షన్స్‌ ప్రై.లిమిటెడ్‌.

హేష్‌బాబు ట్విట్టర్‌లో అడుగుపెట్టిన తర్వాత తన సినిమాల గురించి ఎప్పటి కప్పుడు సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క కథానాయిక. ప్రస్తుతం పుణెలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా గురించి మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో రాసుకున్నారు. ''షూటింగ్‌ జరుగుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు తెరకెక్కిస్తున్న పతాక సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. ఇందులో ప్రకాష్‌రాజ్‌ నటన అందరికీ నచ్చుతుంది. 'అతడు' తర్వాత త్రివిక్రమ్‌తో పని చేయడం మరింత ఆనందంగా ఉంది. అతి తొందర్లోనే మంచి సినిమాతో అభిమానుల ముందుకొస్తాను'' అని ట్విట్టర్‌లో రాసుకున్నారు. అన్నట్టు మహేష్‌బాబుకి దైవం మీద గాలి మళ్లింది. ఓ పక్క షూటింగ్‌లో పాల్గొంటూనే పుణె చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాల్ని కూడా దర్శించుకుంటున్నారు.

శ్రీను వైట్లతో మహేష్‌బాబు 'పవర్‌'



హేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుంది.

ఈ సినిమాకి 'పవర్‌' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

కథకి శ్రీను తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలిసింది.

త్వరలోనే ఇది సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలున్నాయి.

లింగు స్వామి దర్శకత్వంలో లింగు స్వామి దర్శకత్వంలో మహేష్‌బాబు

హేష్‌బాబు నటించబోయే మరో చిత్రం ఖరారైనట్లు ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆయనతో తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రాన్ని రూపొందిస్తారు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్నారు. ఆ తరవాత శ్రీను వైట్ల సినిమా ఉంది. ఈ వరుసలోనే లింగుస్వామి చిత్రం ఉండొచ్చు.

ఆగస్టులో మహేష్‌ చిత్రం


నకరత్న మూవీస్‌ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకుడు. శింగనమల రమేష్‌బాబు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గతంలో రాజస్థాన్‌, కేరళల్లో కొంత భాగాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రిస్తున్నారు. ఈ నెల 29 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది. జూన్‌ వరకు నిర్విరామంగా చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

ట్విట్టర్‌లో ప్రిన్స్‌

మహేష్‌బాబు తన అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ట్విట్టర్‌ని వేదికగా చేసుకున్నారు. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ద్వారా తన భావాలను వెల్లడిస్తూ ప్రస్తుతం చేస్తున్న సినిమా కబుర్లని పంచుకొంటున్నారు. బ్లాగ్‌లు, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్ల సాయంతో అందరికీ అందుబాటులో ఉండే సంస్కృతి టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర తారలు ట్విట్టర్‌, ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌ల్లో చాట్‌ చేస్తున్నారు. సొంత బ్లాగులు కూడా నిర్వహిస్తున్నారు.ఇటీవలే తనని కలిసిన అభిమానులతో మహేష్‌ ట్విట్టర్‌ విశేషాల్ని వెల్లడించారు. అందులో మహేష్‌ తన కుమారుడు గౌతమ్‌తో ఉన్న ఫొటోల్ని కూడా ఉంచారు.

మహేష్‌ - త్రివిక్రమ్‌ల చిత్రo యొక్క పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు




నకరత్న మూవీస్‌ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శింగనమల రమేష్‌బాబు నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసరాల్లో సాగుతోంది. మహేష్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో 'అతడు' తరవాత సిద్ధమవుతున్న చిత్రమిదే. త్వరలో మహేష్‌పై పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వినోదం, యాక్షన్‌ అంశాలు మేళవించిన కథ అని సమాచారం. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, తనికెళ్ళ భరణి, షఫి, సుశీల్‌ శర్మ, సుధ, శ్రీరంజని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Mahesh Babu's 'Kaleja' to release either on May 28 or June 3.

Director Trivikram Srinivas' much-delayed Mahesh Babu-Anushka starrer Kaleja, produced by Singanamala Ramesh under the banner of Kanakarathna Movies, is racing ahead for a summer release. According to sources, the film would be released either on May 28 or June 3, keeping in view the various competitive examinations, particularly the EAMCET 2010.

Mahesh Babu plays the role of a taxi driver and Anushka appears as a rich brat. Prakashraj is the villain. Sunil and Brahmanandam have key roles in this movie, being cinematographed by ace Bollywood cameraman Sunil Patel. Mani Sharma scores the music. After the tremendous success of Athadu (2005), this is the second time Mahesh Babu teams up with Trivikram Srinivas.
Reply With Quote

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates