వచ్చేనెల 23న 'దూకుడు'

''ప్రేక్షకుల అంచనాలు అందుకొనేలా ఉంటుంది మా 'దూకుడు' చిత్రం. ఆ సినిమా విడుదలయ్యే రోజు కోసం అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సెప్టెంబరు 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''మహేష్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. అందులో ఆయన పలికిన సంభాషణలు అందరికీ నచ్చుతాయి. 'కళ్లున్నోడు ముందు చూస్తాడు... దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు', 'భయానికి మీనింగే తెలియని బ్లడ్‌రా నాది...' లాంటి పదునైన మాటలున్నాయ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, సంజయ్‌ స్వరూప్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు, మాస్టర్‌ భరత్‌, చంద్రమోహన్‌ తదితరులు నటించారు. సమర్పణ: జి.రమేష్‌బాబు, సంగీతం: తమన్‌.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ‘దూకుడు’

‘ఇటీవల విడుదలైన ‘దూకుడు’ ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. థమన్ అందించిన సంగీతం వైవిధ్యమైన బాణీలతో ఆకట్టుకుంటోంది. మహేష్‌బాబు చిత్రాల్లోనే ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. కళ్లున్నోడు ముందు చూస్తాడు. దిమాక్ వున్నోడు దునియాను చూస్తాడు...లాంటి డైలాగ్స్ ఎన్నో ‘దూకుడు’ చిత్రంలో మహేష్‌బాబు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి’ అన్నారు చిత్ర నిర్మాతలు గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వారిని అన్ని విధాలా సంతృప్తిపరిచే విధంగా ఈ చిత్రం వుంటుంది. కావాల్సినంత వినోదంతో పాటు రోమాంచితమైన యాక్షన్ వుంటుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు చాలా బాగున్నాయని ప్రశంసలు వస్తున్నాయి.

శ్రీనువైట్ల పంచ్‌డైలాగ్‌లకు మహేష్‌బాబు టైమింగ్ కుదిరితే ఎలా వుంటుందో ఈ చిత్రంలో చూస్తారు. శ్రీనువైట్ల, మహేష్‌బాబుల కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తోన్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ కన్నులపండువలా వుంటుంది. నిర్మాణపరంగా కూడా ఎక్కడా రాజీపడలేదు. పరిక్షిశమలో సమ్మెకారణంగా బడ్జెట్ కొంచెం ఎక్కువయింది’ అన్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, షాయాజీషిండే, నాజర్, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సబ్రహ్మణ్యం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: జి.రమేష్‌బాబు.

సెప్టెంబర్ ప్రథమార్ధంలో 'దూకుడు'

హేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. వచ్చేనెల ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ''తమన్‌ హుషారైన బాణీలను అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల్లో ఉన్న దూకుడు కథ, కథనాల్లోనూ కనిపిస్తుంది. మహేష్‌బాబు తరహా యాక్షన్‌ ఘట్టాలు, శ్రీను వైట్ల శైలి వినోదం కలగలిపిన చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, తనికెళ్ల భరణి, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌, రచన: గోపి మోహన్‌, కోన వెంకట్‌, సమర్పణ: జి.రమేష్‌బాబు.

మహేష్ సరసన హన్సిక ?

ముద్దుగుమ్మ హన్సిక మహేష్‌బాబు సరసన ‘ది బిజినెస్‌మేన్’లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్షికమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాజల్ అగర్వాల్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కీలక పాత్రకు ఎంపికయినట్లు తెలిసింది. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలో అస్సలు నటించనని గతంలో ఈ భామ ప్రకటించడం విశేషం.

గత కొంతకాలంగా తెలుగులో సరైన సక్సెస్‌లు లేని హన్సిక ఇటీవల ‘కందిరీగ’ విజయంతో ఉత్సాహంగా వుంది. అంతేకాదు తమిళంలో విజయ్ సరసన ఈ సుందరి నటించిన ‘వేలాయుధం’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్‌బాబు సరసన నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న హన్సికను ఇక మంచి రోజులు వచ్చిన టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

దూకుడు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా : మహేష్

‘శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దూకుడు షూటింగ్ ఒక పిక్నిక్‌లా సాగింది. షూటింగ్ జరిగిన 9నెలలు చాలా ఆనందంగా గడిపాను. శ్రీను వైట్ల నాన్న గారికి పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ‘దూకుడు’ లాంటి మంచి సినిమా నాకు అందించినందుకు శ్రీను వైట్లకు జీవితాంతం రుణపడి వుంటాను’ అన్నారు మహేష్.మహేష్ మాట్లాడుతూ‘ ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లా వుంది. మణిశర్మ దగ్గర థమన్ కీబోర్డ్ ప్లేయర్‌గా వున్నప్పటి నుంచి తెలుసు. థమన్ ‘దూకుడు’ సాంగ్స్ అదరగొట్టాడు. ఇంత వరకు ఇలాంటి నిర్మాతలతో వర్క్ చేయలేదు. ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా చిత్రాన్ని నిర్మించారు. ‘దూకుడు’ విడుదల కోసం అందరి లాగే నేనూ ఎదురు చూస్తున్నా. వచ్చేనెల సినిమా విడుదల కాబోతోంది. ఆరోజు అభిమానులందరికీ పండగే’అన్నారు.

దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ‘ ‘దూకుడు’పై ఎన్నో అంచనాలున్నాయి. వాటన్నింటినీ నూరు శాతం ఈ చిత్రం రీచ్ అవుతుంది. ఊహించింది ఒకటైతే ఊహించని సర్‌ప్రైజ్‌లు ఎన్నో వుంటాయి.

మహేష్ అంటే నాకు ప్రాణం. తను పెద్ద స్టార్ అయినా నేను డైరెక్ట్ చేస్తున్నంత సేపు ఒక తమ్ముడ్ని డైరెక్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యాను. సినిమా ఇంత గొప్పగా రావడానికి కారణం మ హేష్‌బాబే. ‘భయానికి మీనింగే తెలీని బ్లడ్‌రా నాది’ అనే డైలాగ్‌కి కృష్ణ గారి వ్యక్తిత్వమే స్ఫూర్తి’ అన్నారు.

'దూకుడు' గీతాలు

 ''భయానికి మీనింగంటే తెలియని బ్లడ్‌రా నాది " - అని దూకుడులో ఓ డైలాగ్‌ ఉంది. దీనికి స్ఫూర్తి కృష్ణ వ్యక్తిత్వమే. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామ''న్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు, సమంత జంటగా నటించారు. ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించారు. సుకుమార్‌ స్వీకరించారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వంద రోజుల వేడుకలా ఉంది. తమన్‌ చక్కటి బాణీలు అందించాడు. శ్రీను వైట్ల నాన్నగారికి పెద్ద అభిమాని. చిత్రీకరణ జరిగిన తొమ్మిది నెలలు ఓ విహార యాత్రలా గడిచింది. దూకుడు విడుదల నా అభిమానులకు పండగే'' అని చెప్పారు. ''ప్రేక్షకులు దూకుడు పై పెట్టుకున్న అంచనాలను కచ్చితంగా చేరుకుంటామ''న్నారు చిత్ర దర్శకుడు. సమంత మాట్లాడుతూ ''మహేష్‌బాబుకి పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. నాకిదో ప్రత్యేకమైన చిత్రం'' అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌, నమ్రత, బ్రహ్మానందం, తమన్‌, జి.ఆదిశేషగిరిరావు, భోగవల్లి ప్రసాద్‌, దిల్‌ రాజులతోపాటు చిత్ర నిర్మాతలు రామ్‌, గోపీ, అనిల్‌ పాల్గొన్నారు. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.

'దూకుడు' ఆడియో విడుదల

ప్రిన్స్‌ మహేష్‌బాబు, సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్రంలోని పాటలను శిల్పాకళావేదికగా జరిగిన ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మహేష్‌బాబు, నమ్రత, హీరోయిన్‌ సమంత, దర్శకులు శ్రీనువైట్ల, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత అనిల్‌, సంగీత దర్శకుడు థమన్‌ తదితరులు పాల్గొన్నారు.

మహేష్‌బాబు, పూరీలబిజినెస్‌మేన్ మొదలైంది

అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులకు ‘దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’ అయ్యేలా చేసిన సినిమా మహేష్-పూరి జగన్నాథ్‌ల ‘పోకిరి’. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఆ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ రూపొందుతోన్న చిత్రమే ‘బిజినెస్ మేన్’. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య సోమవారం మొదలైంది. దేవుని పటాలపై ముహూర్తపు దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళుతుందా అని ఆతృతతో ఎదురుచూశాను. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని అంతగొప్పగా తీర్చిదిద్దారు పూరి. మళ్లీ ‘పోకిరి’ లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది.

మా కాంబినేషన్ అంటే.. ఎక్స్‌పెక్టేషన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు. ‘‘బిజినెస్‌మేన్’ కోసం అభిమానులతో పాటు నేను కూడా ఎప్పుడెప్పుడా అని ఎదరుచూస్తున్నాను. అంటే... ఈ కథపై నేను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నా డెరైక్షన్‌లో వచ్చిన సినిమాల్లోని హీరో పాత్రలతో పోలిస్తే... ఇందులోని హీరో క్యారెక్టరైజేషన్ బెస్ట్. అది రేపు తెరపై మీరే చూస్తారు. లవ్, యాక్షన్ ప్రధానంగా సాగే సినిమా. వెంకట్‌గారు లాంటి డైనమిక్ ప్రొడ్యూసర్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 1న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ -‘‘బిజినెస్‌మేన్’ స్టోరీలైన్ సూపర్బ్. మహేష్‌ని ప్రేక్షకులు, అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఇందులో మహేష్ కనిపిస్తారు. అత్యున్నత సాంకేతిక విలువలతో స్టైలిష్‌గా ఈ సినిమా నిర్మిస్తున్నాం. జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. కాజల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-డెరైక్టర్: విజయ్‌రామ్‌ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి.

'ది బిజినెస్‌ మేన్‌' ప్రారంభం

హేష్‌బాబుని 'పోకిరి'గా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన చిత్రమది. మహేష్‌-పూరి కలయికలోమరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే... 'ది బిజినెస్‌ మేన్‌'. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''జగన్‌ నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరి అంచనాలను అందుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంద''న్నారు. ''పోకిరి తరవాత మళ్లీ మహేష్‌తో చేయడం ఆనందంగా ఉంది. నా సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రీకరణ బాగుంటుందని అందరూ చెబుతారు. నాకు నచ్చిన హీరో 'ది బిజినెస్‌ మేన్‌'లో కనిపిస్తాడ''ని చెప్పారు. ''మహేష్‌ని ఎలా చూడాలని అభిమానులు ఆశిస్తారో... అలానే తీర్చిదిద్దుతున్న చిత్రమిది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, కళ: చిన్నా, కూర్పు: ఎన్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: తమన్‌.

18న 'దూకుడు' పాటలు

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. 'దూకుడు' పాటల్ని ఆగస్టు 18న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో తెలిపారు. ''దూకుడు పాటలు బాగా వచ్చాయి. తమన్‌ మంచి సంగీతాన్ని అందించారు. 18న పాటలు విడుదల చేస్తాం. మీలాగే నేను కూడా ఆరోజు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొన్నారు. ఇటీవల 'దూకుడు' ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. దేనికీ తలవంచని ఓ యువకుని కథ ఇది. అతని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా అందుకొన్నాడు? అనే విషయాల్ని ఆసక్తిగా చూపిస్తున్నాం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

మహేష్‌తో పార్వతీ మెల్టన్ ఐటెమ్‌సాంగ్

పవన్‌కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మహేష్ ఖలేజా’. ఈచివూతంలో మహేష్‌కు జోడీగా పార్వతీమెల్టన్ నటించాల్సింది... కానీ ఆ అవకాశాన్ని అనుష్క ఎగరేసుకుపోవడంతో ‘ఖలేజా’ చిత్రంలో నటించే ఛాన్స్ కోల్పోయిన పార్వతీమెల్టన్ మరోసారి రెట్టించిన ఉత్సాహంతో తెలుగులో తన సత్తాను చాటుకోవడానికి రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి చిందులేయబోతోంది. దర్శకుడు శ్రీనువైట్ల ప్రత్యేకంగా కోరడంతో ఆ పాటలో నటించడానికి పార్వతీ మెల్టన్ అంగీకరించిందట.‘ఖలేజా’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆమె మళ్ళీ మహేష్ నటిస్తున్న ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆయనతో చిందులేసే అవకాశం పొందడం విశేషం.

ఒక్కసారి ఫిక్స్ అయితే అంతే


‘అతడు’ ఓ అంతర్ముఖుడు... నిండు గాంభీర్యంగా కనిపించే నెమ్మదస్తుడు’ ఇది మహేష్‌పై చాలామంది అభిప్రాయం. కానీ ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే అంతే... బ్లయిండ్‌గా వెళ్లిపోయే మొండితనం, ఆయన సొంతం అని చాలా తక్కువ మందికి తెలుసు. ‘దూకుడు’గా సినిమాలు చేయాలని మహేష్ నిశ్చయించుకున్న తర్వాత రోజుకు 12 గంటల పాటు షూటింగ్ స్పాట్‌లోనే ఉంటున్నారాయన. ఈ నెల చివరిలో కానీ, వచ్చేనెల ప్రథమార్ధంలో కానీ ‘దూకుడు’ విడుదల కానుంది.

‘పోకిరి’గా బాక్సాఫీస్ వసూళ్లకు కొత్త అర్థం చెప్పిన మహేష్... రాబోతున్న ‘దూకుడు’తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అని ఆయన అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను మరింత పెంచడానికి ఈ నెల 13న ‘దూకుడు’ పాటలు విడుదలవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత బోయపాటి శ్రీను, రాజమౌళి, క్రిష్... సినిమాలు ఆయన చేస్తారని ఫిలింనగర్ సమాచారం. సో... ఇది మహేష్ అభిమానులకే కాదు... తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా ఓ మంచి వార్త అని చెప్పొచ్చు. నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు. నేటితో 37వ పడిలోకి అడుగుపెడుతున్నారాయన. రాష్టవ్య్రాప్తంగా ఉన్న ‘సూపర్‌స్టార్’ అభిమానులకు ఈ రోజు నిజంగా ఓ పండుగే.

అడుగుజాడల్లో...


'మీ నాన్నగారిలా వేగంగా సినిమాలు తీయరెందుకు..?' - మహేష్‌బాబు ఎప్పుడు ఎదురైనా చాలామంది సంధించే ప్రశ్న ఇదే. అందుకు ఆయన చిరునవ్వే సమాధానం. ఏడాదికి పద్దెనిమిది సినిమాల్లో నటించిన ఘనత ఘట్టమనేని కృష్ణది. మహేష్‌ పదకొండు సంవత్సరాల్లో చేసిన సినిమాల సంఖ్య... 16. నాణ్యత కూడా కావాలనేది మహేష్‌ వాదన. అందులోనూ నిజం కనిపిస్తుంది. 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి'... ఇలాంటి సినిమాలకు రెండేళ్లు తీసుకొన్నా తప్పేం లేదనిపిస్తుంది. కథతోపాటు సాంకేతికాంశాల మీద కూడా శ్రద్ధ పెట్టే కథానాయకుడు మహేష్‌. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది..? అని అడిగితే మళ్లీ కృష్ణ కనిపిస్తారు. స్కోప్‌, కలర్‌, 70ఎమ్‌.ఎమ్‌... ఇలా తెలుగు సినిమా సాంకేతిక హంగులు అద్దుకొన్న ప్రతి దశలోనూ కృష్ణ అడుగులు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే.. మహేష్‌ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. ఇక దూకుడే!
'అతిథి', 'ఖలేజా' సినిమాలు మహేష్‌ అభిమానుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. వాళ్లెప్పుడూ 'పోకిరి' అంచనాలతోనే థియేటర్లకు వస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న మహేష్‌ మరోసారి పోకిరి ఫార్ములానే నమ్ముకొన్నారు. ఆ సినిమానే 'దూకుడు'. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మహేష్‌తో సమంత జోడీ కట్టింది. 'ఖలేజా'తో పోలిస్తే 'దూకుడు'... వేగంగానే సిద్ధమైంది. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఈ నెల 13న పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో 'ది బిజినెస్‌మేన్‌' త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఓ మల్టీస్టారర్‌ సినిమాలో నటించేందుకు మహేష్‌ ఒప్పుకొన్నారు. సుకుమార్‌ కూడా మహేష్‌ కోసం ఓ కథ సిద్ధం చేసుకొంటున్నారు. మంగళవారం మహేష్‌బాబు జన్మదినం. ఆడంబరాలకు దూరంగా పుట్టిన రోజు జరుపుకోవాలనుకొంటున్నారు మహేష్‌.

రామోజీ ఫిల్‌సిటీలో దూకుడు

రోజు ఖాళీగా కూర్చుని... పదేళ్ల తరవాత నా పరిస్థితి ఏమిటో..? అని గాల్లో మేడలు కట్టే మనస్తత్వం కాదతనిది. ఇప్పుడు చేసిన పని వందేళ్లు గడిచినా గర్వంగా చెప్పుకోవాలి అనుకొంటాడు. ప్రతి అడుగూ చరిత్రగా మారాలని భావిస్తాడు. సాహసమే సోపానంగా చేసుకొని ముందడుగు వేసిన ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా సాధించాడు? ఈ విషయాలు తెలియాలంటే 'దూకుడు' సినిమా చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. యాక్షన్‌, వినోదం, సంగీతం.... ఈమూడూ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. కథ, కథనాలు ఎవరూ ఊహహంచని విధంగా ఉంటాయి. మహేష్‌బాబు పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది. తమన్‌ సంగీతం అందించారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates