Mahesh Singing in Businessman

సినీ పరిక్షిశమలో కథానాయకులు నటిస్తూనే కొత్త శాఖల్లోనూ తమ ప్రతిభని చూపించడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ తరం క్రేజీ హీరోలైన పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌లు తెరపై జిమ్మిక్కులు చేస్తూనే సింగర్లుగానూ తమ గాన కౌశలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. త్వరలోనే మహేష్ వీరి జాబితాలో చేరనున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి మహేష్ ఓ థీమ్‌సాంగ్‌ను ఆలపిస్తున్నాడట. ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం గొంతు సవరించని మహేష్ తొలిసారి ‘బిజినెస్‌మెన్’ చిత్రం కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం.మహేష్ గీతాలాపన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌లో మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారని సమాచారం.

Bussiness Man audio on 23 Dec

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నారు. దినేష్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్‌ చేసి నన్ను కనఫ్యూజ్‌ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.
 


ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తాం. వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌లో మహేష్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు పాల్గొనే సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. డిసెంబరు 23న పాటల్ని విడుదల చేస్తామ''ని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె నాయుడు, సంగీతం: తమన్‌.

Mahesh Pairing with Tamanna

దటీజ్‌ మహాలక్ష్మీ... అంటూ '100% లవ్‌' సినిమాలో తమన్నా పాత్రని తీర్చిదిద్దారు సుకుమార్‌. అందం, తెలివితేటలు కలబోసిన మరదలి పిల్లగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. మరోసారి ఆ భామనే కథానాయికగా ఎంచుకొన్నట్లు తెలిసింది. మహేష్‌బాబు - సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయిక పాత్ర తమన్నాకి దక్కింది.

 
ప్రస్తుతం మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తికాగానే సుకుమార్‌ చిత్రం సెట్స్‌ మీదకు వెళుతుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Mahesh New Movie in Vijayanthi Movies Banner

భారీ చిత్రాలకు చిరునామా... ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ బేనరు నుంచి సినిమా అంటే... సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు అధికంగా ఉంటాయి. అటువంటిది మహేష్‌బాబుతో సినిమా అంటే ఇక చెప్పనవసరంలేదు. అందులోనూ ‘దూకుడు’ వంటి సంచలన విజయం తర్వాత సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపుగా ఉంటాయి.

ఇక ఆ చిత్రానికి క్రియేటివ్ డెరైక్టర్ ‘క్రిష్’ అంటే ‘క్రేజియస్ట్ సినిమా’ అని చెప్పాల్సివస్తుంది. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ఓ భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందనుంది అని తెలిసింది. కృష్ణ కెరీర్‌లో ఓ ‘అల్లూరి సీతారామరాజు’లా మహేష్ కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. మహేష్ ఇప్పటివరకూ చేయని కొత్తరకం ఫీట్ ఈ సినిమాలో చేస్తున్నారట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు చేయబోవడం మరో అదనపు ఆకర్షణ. ఈ సినిమా ద్వారా తొలిసారి మహేష్‌బాబు సినిమాకి కీరవాణి సంగీతం అందించబోవడం మరో విశేషం. ఈ చిత్రానికి ‘తిరు’ ఛాయాగ్రాహణం అందిస్తారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఇది మొదలవుతుంది.

Dookudu 50 days Celebrations

''దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా యాభై రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంద''న్నారు.
 కృష్ణ ప్రసంగిస్తూ ''అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు. దూకుడు చిత్రం తప్పకుండా ఓ అద్భుతమే. మహేష్‌ చిన్నతనం నుంచే ప్రతి షాట్‌లో డూప్‌లు లేకుండా నటించటానికి తాపత్రయపడేవాడ''న్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ 'నేను కృష్ణ అభిమానిని. మహేష్‌ను మొదటి నుంచి గమనించేవాడిని. ఆయన ఇమేజ్‌కు సరిపడే కథతోనే సినిమా తీశాను'' అన్నారు. ''నేను ఏ సినిమా అయినా ఒకసారే చూస్తాను. దూకుడు చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మహేష్‌ అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎన్టీఆర్‌ ప్రధానమంత్రి కావాలన్న అందరి ఆశని దర్శకుడు ఈ చిత్రంలో నిజం చేశార''న్నారు విజయనిర్మల. సినిమాలో మహేష్‌, చిత్ర కథానాయిక సమంత ధరించిన వస్త్రాలను 'మా' ఆధ్వర్యంలో వేలం వేయగా తిరుపతికి చెందిన మధుసూదనరెడ్డి, ప్రిన్స్‌మహేష్‌.కామ్‌ రవి వాటిని కొనుగోలు చేశారు. వారికి ఆ దుస్తులను వేదికపై మహేష్‌, సమంత అందజేశారు. చిత్ర బృందానికీ, పంపిణీదారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, సి.అశ్వనీదత్‌, సాగర్‌, సురేష్‌బాబు, డా||కేఎల్‌ నారాయణ, సమంత, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Bussiness Man First Look is Out

‘ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను’ ఇది మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’ ఫస్ట్ లుక్ ట్రైలర్స్‌లో ఓ డైలాగ్...ఈ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన తొలి స్టిల్‌ను విడుదల చేశారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం.



జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మహేష్‌బాబు హీరోయిజాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరిస్తున్నాం. మహేష్‌బాబు సూపర్ పర్‌ఫ్మాన్స్ కనబరుస్తున్నాడు. ‘పోకిరి’ తర్వాత మహేష్‌తో చేస్తోన్న ఈ చిత్రం కొత్త చరివూతను సృష్టిస్తుందని ఆశిస్తున్నాను’ అన్నారు. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, అలీ, బ్రహ్మాజీ, భరత్‌డ్డి, రాజా తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, ఫైట్స్: విజయ్, నిర్మాత: వెంకట్, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.



Krrish Directing Mahesh ?

కథల ఎంపికలో మహేష్‌బాబు వేగం పెంచారు. ప్రస్తుతం 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోనూ నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు మరో కొత్త కథకు పచ్చజెండా ఊపేశారు. ఈ కథను దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కథాంశం, మహేష్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటాయని తెలిసింది. ఇందులో ముగ్గురు నాయికలుంటారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. సుకుమార్‌ చిత్రం తరవాత క్రిష్‌ సినిమా మొదలవుతుంది. 
కృష్ణం వందే జగద్గురుమ్‌: మహేష్‌ చిత్రానికంటే ముందు క్రిష్‌ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' రూపొందిస్తారు. ఇందులో రానా దగ్గుబాటి కథానాయకుడు. ఈ సినిమాని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు. ఈ నెల 27 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదు. గురువారం క్రిష్‌ జన్మదినం

Dhookudu 50 days function on November 12

పోకిరి’ తర్వాత ‘దూకుడు’తో మళ్లీ తన సత్తాను చాటుకున్న అందాల నటుడు మహేష్‌బాబు ఇప్పుడు ఆనందసాగరంలో మునిగివున్నారు. బాక్సాఫీసు రికార్డులను తనదైన శైలిలో తిరగరాయడమే కాకుండా, అమెరికా వంటి విదేశాల్లో కూడా అత్యధిక వసూళ్లతో తెలుగు సినిమా ‘స్టామినా’ని ‘దూకుడు’తో తెలియజెప్పారు మహేష్. ఇలాంటి సక్సెస్ కోసమే సూపర్‌స్టార్ అభిమానులు ఇంతకాలం ఎదురుచూశారు. తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఇటువంటి విజయాలను ఆశిస్తూ వచ్చింది.



ఈ సినిమాకు లభించిన విజయాన్ని అంచనా వేసే పనిలో సినీ పండితులున్నారు. 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ‘మగధీర’ అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి ‘దూకుడు’ ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుస్తుంది.

ఈ చిత్రానికి ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాతలు రామ్, గోపీచంద్, అనీల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నెల 12న విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ‘అర్ధశతదినోత్సవ’ వేడుకను ఘనంగా నిర్వహించలిచినట్లు తెలిపారు. ‘ఒక్కడు’ తర్వాత మహేష్‌బాబు పబ్లిక్ ఫంక్షన్‌లో పాల్గొనడం ఇదే అని చెప్పుకోవచ్చు. కృష్ణ, మహేష్‌బాబు అభిమానులు ఈ ఉత్సవంలో భారీ ఎత్తున పాల్గొంటున్నట్లు తెలిసింది.

Bussiness man first look on 11 Nov

‘దూకుడు’ చిత్రంతో యమదూకుడు మీదున్న కథానాయకుడు మహేష్‌బాబు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో తక్కువరోజుల్లో పూర్తి కాబోతోంది. ఇటీవల విడుదలైన ‘దూకుడు’ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘బిజినెస్‌మెన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 11న ఫస్ట్‌లుక్ విడుదల చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఇందుమతి’ ఫేమ్ శ్వేతా భరద్వాజ్ ప్రత్యేక గీతంలో నర్తించనుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ దీపావళి కానుకగా విడుదల కానున్న ‘బిజినెస్‌మెన్’ ఇదే రోజు తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.

Bussiness Man Relasing on Sankranthi




 హేష్‌బాబు తన మార్కెట్‌ని ఇతర భాషలకీ విస్తరించబోతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది.
తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.



 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates