ఆగస్టులో మహేష్‌ చిత్రం


నకరత్న మూవీస్‌ సంస్థ మహేష్‌బాబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుష్క నాయిక. త్రివిక్రమ్‌ దర్శకుడు. శింగనమల రమేష్‌బాబు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. గతంలో రాజస్థాన్‌, కేరళల్లో కొంత భాగాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రిస్తున్నారు. ఈ నెల 29 వరకు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ ఉంటుంది. జూన్‌ వరకు నిర్విరామంగా చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

ట్విట్టర్‌లో ప్రిన్స్‌

మహేష్‌బాబు తన అభిమానులకు అందుబాటులో ఉండేందుకు ట్విట్టర్‌ని వేదికగా చేసుకున్నారు. ఈ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ద్వారా తన భావాలను వెల్లడిస్తూ ప్రస్తుతం చేస్తున్న సినిమా కబుర్లని పంచుకొంటున్నారు. బ్లాగ్‌లు, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్ల సాయంతో అందరికీ అందుబాటులో ఉండే సంస్కృతి టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌లో అగ్ర తారలు ట్విట్టర్‌, ఆర్కుట్‌, ఫేస్‌బుక్‌ల్లో చాట్‌ చేస్తున్నారు. సొంత బ్లాగులు కూడా నిర్వహిస్తున్నారు.ఇటీవలే తనని కలిసిన అభిమానులతో మహేష్‌ ట్విట్టర్‌ విశేషాల్ని వెల్లడించారు. అందులో మహేష్‌ తన కుమారుడు గౌతమ్‌తో ఉన్న ఫొటోల్ని కూడా ఉంచారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates