Krrish Directing Mahesh ?

కథల ఎంపికలో మహేష్‌బాబు వేగం పెంచారు. ప్రస్తుతం 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోనూ నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు మరో కొత్త కథకు పచ్చజెండా ఊపేశారు. ఈ కథను దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కథాంశం, మహేష్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటాయని తెలిసింది. ఇందులో ముగ్గురు నాయికలుంటారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. సుకుమార్‌ చిత్రం తరవాత క్రిష్‌ సినిమా మొదలవుతుంది. 
కృష్ణం వందే జగద్గురుమ్‌: మహేష్‌ చిత్రానికంటే ముందు క్రిష్‌ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' రూపొందిస్తారు. ఇందులో రానా దగ్గుబాటి కథానాయకుడు. ఈ సినిమాని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు. ఈ నెల 27 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదు. గురువారం క్రిష్‌ జన్మదినం

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates