
మహేష్ ,కాజల్ జంటగా ఆర్.ఆర్ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్
నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం
షూటింగ్ పూర్తయింది. జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి
జగన్నాథ్ మాట్లాడుతూ ‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్వూపొడక్షన్
వర్క్లో భాగంగా రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ,
మలయాళంలో ఆడియో విడుదల చేస్తున్నాం. జనవరి 11న చిత్రాన్ని
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం.
‘పోకిరి’ తర్వాత మా ఇద్దరి
కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
వాటికి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో సూర్యగా మహేష్
అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష
స్పందన లభిస్తోంది. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు’ అన్నారు....