'ది బిజినెస్‌మేన్‌' జులై చివరి వారంలో

హేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ - వీరిద్దరి పేర్లు చెప్పగానే 'పోకిరి' చిత్రమే గుర్తుకొస్తుంది. త్వరలో వీరిద్దరి నుంచీ 'ది బిజినెస్‌మేన్‌' చిత్రం రాబోతోంది. కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం మహేష్‌బాబు 'దూకుడు' చిత్రీకరణలో పాల్గొంటున్నారు. జులై వరకూ 'దూకుడు' పనుల్లోనే ఉంటారు. ఆ తరవాత 'ది బిజినెస్‌మేన్‌'కి శ్రీకారం చుడతారు. ఆ నెల చివరి వారంలో ముంబైలో చిత్రీకరణ మొదలుపెడతారు. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ''మాఫియా నేపథ్యంలో నడిచే కథ ఇది. తుపాకులకు ఒప్పందాలతో పనిలేదు. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన మనుషుల కథ ఇది. అందుకే 'గన్స్‌ డోన్ట్‌ నీడ్‌ ఎగ్రిమెంట్‌' అనే శీర్షికపెట్టాం. మహేష్‌ని కొత్త కోణంలో చూపించే చిత్రం అవుతుంద''ని పూరి జగన్నాథ్‌ చెబుతున్నారు. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates