Business Man in Goa

'కొడితే ఒక్కొక్కడికీ బల్బులు పగిలిపోవాలి...' - అంటూ 'దూకుడు'లో తనదైన శైలిలో యాక్షన్‌లో వినోదం మేళవించారు మహేష్‌బాబు. ఇప్పుడు అచ్చమైన వ్యాపారవేత్త ఎలా ఉంటాడో చూపించబోతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌- పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. వాటికి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుంది. మహేష్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలో స్పెయిన్‌లో మూడు పాటలు చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన...

Mahesh Pairing with Tammanna ?

‘శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ‘ఢీ’ చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్‌బాయ్‌లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్‌లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి..! అయితే తాజాగా ఈ మిల్క్‌బాయ్‌తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్‌బాయ్, మిల్కీవైట్‌భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల ‘100 పర్సెంట్ లవ్’తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు. ఇటీవలే మహేష్‌తో ‘దూకుడు’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని...

Business Man Guns Dont Need Agrement

 'దూకుడు' ఎలా ఉంటుందో ఈ మధ్యే చూపించారు మహేష్‌బాబు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే 'బిజినెస్‌మేన్‌'గా మారిపోయారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమది. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత.  ప్రస్తుతం ముంబైలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 నుంచి గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు. మనుషుల కన్నా.. బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ తరహా నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్‌ అంశాలతోపాటు వినోదం కూడా మేళవించాం. మహేష్‌తో సినిమా తీస్తున్నానంటే అందరికీ 'పోకిరి' సినిమానే గుర్తొస్తుంది. ఇకపై మహేష్‌తో మరో సినిమా చేస్తే 'బిజినెస్‌మేన్‌' గుర్తుకు వస్తుంద''ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నా...

Krrish Directing Mahesh ?

‘దూకుడు’గా సినిమాలు చేస్తూ శిఖరాగ్రానికి దూసుకుపోతున్న మహేష్... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గమ్యం, వేదం, వానమ్ (తమిళం) చిత్రాలతో దక్షిణాదిన క్రేజీ దర్శకుడిగా భాసిల్లుతోన్న క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలిసింది. అగ్రతారలతో అనేక విజయవంతమైన చిత్రాలు చేసిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం మహేష్ ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని సమాచారం. రానా కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది. పక్కా...

dookudu dresses for auction

‘‘వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగు సినిమాకు ఊపిరులూదిన చిత్రం ‘దూకుడు’. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోందీ సినిమా. వసూళ్ల విషయంలో ‘మగధీర’ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. ఎనభై కోట్ల వసూళ్ల అంచనాలు దాటి వంద కోట్ల అంచనాలకు చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా మహేష్ ఇమేజ్‌ని ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే... ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేష్ నిలిచాడు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు. ‘దూకుడు’ చిత్రంలోని క్లయిమాక్స్ సాంగ్‌లో మహేష్, సమంత ధరించిన దుస్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) వేలానికి పెట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘గతంలో విజయం సాధించిన కొన్ని సినిమాల్లోని...

Puri Khaidi with Mahesh Babu

 ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రమే చిరంజీవిను స్టార్ హీరోని చేసింది. కోదండరామిడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ రీమేక్ చేయనున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ‘ మహేష్, పూరీ కాంబినేషన్‌లో చిరంజీవి ‘ఖైదీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే గొప్ప న్యూస్‌ను నేను విన్నాను. జగన్ చెప్పిన మహేష్ పాత్రతో కంపేర్ చేస్తే కోదండరామిడ్డి డిజైన్ చేసిన చిరంజీవి పాత్ర నథింగ్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరచడం విశేషం. ఇక ఈ వార్త తెలుగు సినీ పరిక్షిశమలో తప్పకుండా హాట్‌టాపిక్‌గా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా...

Dhookudu Success Meet With Mahesh

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ చిత్రంతో 75 సంవత్సరాల సినీ చరివూతను తిరగరాసిన ప్రముఖ యువ కథానాయకుడు మహేష్‌బాబు ఈ సారి ‘దూకుడు’గా వచ్చి 80 ఏళ్ళ తెలుగు సినీ చరివూతలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ‘దూకుడు’ సూపర్‌హిట్ అనే విషయాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని దర్శకుడు శ్రీనువైట్ల ప్రతిభను బ్లెండ్‌గా నమ్మి వెళ్ళిన ఈ క్రేజీ కథానాయకుడి ‘దూకుడు’ సినిమాని ఇప్పుడు దునియా మొత్తం కనులపండువగా చూస్తుంటే దిల్‌ఖుష్‌గా వున్నాడు మహేష్. ఒకవైపు ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా వుంటూనే మరోవైపు ‘దూకుడు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు’ ఈ వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణదంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేకార్షణగా నిలిచారు....

Mahesh is about his future projects

తెలుగు సినిమాకి వసూళ్ల పండగ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. 'దూకుడు' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపారు. ''చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోంది. ప్రేక్షకుల ప్రతిస్పందనను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. కానీ 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాల్సొచ్చింది. ఇకపై కూడా ఇలాగే అందరూ మెచ్చే సినిమాల్లో నటించాలని ఉంద''ని చెబుతున్న మహేష్‌బాబు ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... ''ఒక సినిమాలో ఒకే రకమైన పాత్ర పోషిస్తే ఇమేజ్‌ సమస్యలు ఎదురవుతాయి. ఆ ప్రభావం తరువాతి సినిమాలపై కూడా పడుతుంటుంది. 'పోకిరి' విషయంలో నాకదే జరిగింది. 'దూకుడు' సినిమా ఇమేజ్‌కి దూరంగా నడిచింది. అందరికీ చేరే కథతో తెరకెక్కింది. ప్రారంభ సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదమే ప్రధానంగా సాగుతుంది. ఇలాంటి కథల్లో నటించటం చాలా కష్టం....

Dookudu Success Interview With Mahesh

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్. ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్...

Dookudu Becoming Industry Biggest Hit

''పోకిరి సినిమా చూశాక 'ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. నేను చెప్పినట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. 'దూకుడు' చూశాక రూ.80 కోట్లు రాబట్టుకొంటుందని చెప్పాను. ఆ సంఖ్య వంద కోట్ల మార్కుకి చేరుకొనేలా ఉంద''న్నారు కృష్ణ. ఆయన తనయుడు మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా బాగా ఆడడానికి చాలా కారణాలున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా తీర్చిదిద్దారు. దర్శకత్వం, సంభాషణలు, పాటలు అన్నీ బాగున్నాయి. థియేటర్‌కి వచ్చినవాళ్లు శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉన్నారు. మహేష్‌ చాలా అందంగా కనిపించాడ''ని చెప్పారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''దూకుడు సినిమా ఈ స్థాయిలో ఆడడానికి కారణం శ్రీను వైట్ల. ఈ కథ చెబుతున్నప్పుడు ఓ మాట అన్నారు.. 'సూపర్‌ హిట్‌ తీస్తా. లేదంటే బ్లాక్‌బస్టర్‌ సినిమా తీస్తా'....

Mahesh Bussiness Man Title Song Shooting at Delhi

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మహేష్‌బాబు శైలికి తగ్గ కథాంశమిది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతుంది. 'పోకిరి' బృందం నుంచి వస్తున్న చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను అందుకొనేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర, ఆయన పలికే హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికొస్తుంది. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు....

Seethamma Vakitlo Sirimalle Chettu

తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్‌ అనేది ఓ కల. ఇద్దరు కథానాయకులు కలిసి తెరమీద సందడి చేస్తే చూడాలని సగటు సినీ అభిమాని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఫలించింది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రమే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌, మహేష్‌బాబు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కొత్తబంగారులోకం' చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ఉదయం విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్టు అందుకొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''వసుధైక...

‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్‌స్టార్స్

అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- వెంకటేష్, మహేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన. ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం. ‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన...

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates