Krrish Directing Mahesh ?

‘దూకుడు’గా సినిమాలు చేస్తూ శిఖరాగ్రానికి దూసుకుపోతున్న మహేష్... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గమ్యం, వేదం, వానమ్ (తమిళం) చిత్రాలతో దక్షిణాదిన క్రేజీ దర్శకుడిగా భాసిల్లుతోన్న క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలిసింది. అగ్రతారలతో అనేక విజయవంతమైన చిత్రాలు చేసిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.



ప్రస్తుతం మహేష్ ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని సమాచారం. రానా కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో మహేష్‌ని కొత్త యాంగిల్‌లో క్రిష్ ప్రెజెంట్ చేయనున్నారని వినికిడి. మహేష్ కెరీర్‌లోనే కాక క్రిష్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఓ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందని ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఇంకా సుకుమార్ దర్శకత్వంలో కూడా మహేశ్ నటించనున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates