Business Man in Goa

'కొడితే ఒక్కొక్కడికీ బల్బులు పగిలిపోవాలి...' - అంటూ 'దూకుడు'లో తనదైన శైలిలో యాక్షన్‌లో వినోదం మేళవించారు మహేష్‌బాబు. ఇప్పుడు అచ్చమైన వ్యాపారవేత్త ఎలా ఉంటాడో చూపించబోతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత.


ప్రస్తుతం గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌- పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. వాటికి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుంది. మహేష్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలో స్పెయిన్‌లో మూడు పాటలు చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌.

Mahesh Pairing with Tammanna ?

‘శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ‘ఢీ’ చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్‌బాయ్‌లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్‌లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి..! అయితే తాజాగా ఈ మిల్క్‌బాయ్‌తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్‌బాయ్, మిల్కీవైట్‌భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల ‘100 పర్సెంట్ లవ్’తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు.

ఇటీవలే మహేష్‌తో ‘దూకుడు’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ ఓ వైవిధ్యమైన గెటప్‌లో కనిపించబోతున్నాడని ఫిల్మ్‌నగర్ వార్త. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రంలో మహేష్‌తో జోడి కట్టే అవకాశం రావడం పట్ల తమన్నా ఎంతో హ్యాపీగా వుందట. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న తొలిచిత్రమిది కావడమే ఇందుకు కారణం.

Business Man Guns Dont Need Agrement

 'దూకుడు' ఎలా ఉంటుందో ఈ మధ్యే చూపించారు మహేష్‌బాబు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే 'బిజినెస్‌మేన్‌'గా మారిపోయారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమది. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. 

ప్రస్తుతం ముంబైలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 నుంచి గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు. మనుషుల కన్నా.. బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ తరహా నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్‌ అంశాలతోపాటు వినోదం కూడా మేళవించాం. మహేష్‌తో సినిమా తీస్తున్నానంటే అందరికీ 'పోకిరి' సినిమానే గుర్తొస్తుంది. ఇకపై మహేష్‌తో మరో సినిమా చేస్తే 'బిజినెస్‌మేన్‌' గుర్తుకు వస్తుంద''ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Krrish Directing Mahesh ?

‘దూకుడు’గా సినిమాలు చేస్తూ శిఖరాగ్రానికి దూసుకుపోతున్న మహేష్... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గమ్యం, వేదం, వానమ్ (తమిళం) చిత్రాలతో దక్షిణాదిన క్రేజీ దర్శకుడిగా భాసిల్లుతోన్న క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలిసింది. అగ్రతారలతో అనేక విజయవంతమైన చిత్రాలు చేసిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.



ప్రస్తుతం మహేష్ ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని సమాచారం. రానా కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది.

పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో మహేష్‌ని కొత్త యాంగిల్‌లో క్రిష్ ప్రెజెంట్ చేయనున్నారని వినికిడి. మహేష్ కెరీర్‌లోనే కాక క్రిష్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఓ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందని ఫిలింనగర్ వర్గాల భోగట్టా. ఇంకా సుకుమార్ దర్శకత్వంలో కూడా మహేశ్ నటించనున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

dookudu dresses for auction

‘‘వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగు సినిమాకు ఊపిరులూదిన చిత్రం ‘దూకుడు’. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోందీ సినిమా. వసూళ్ల విషయంలో ‘మగధీర’ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. ఎనభై కోట్ల వసూళ్ల అంచనాలు దాటి వంద కోట్ల అంచనాలకు చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా మహేష్ ఇమేజ్‌ని ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే... ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేష్ నిలిచాడు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు.

‘దూకుడు’ చిత్రంలోని క్లయిమాక్స్ సాంగ్‌లో మహేష్, సమంత ధరించిన దుస్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) వేలానికి పెట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘గతంలో విజయం సాధించిన కొన్ని సినిమాల్లోని వస్తువులను పేద కళాకారుల సహాయార్థం వేలం వేయడం జరిగింది.

ఇప్పుడు ‘దూకుడు’లో మహేష్, సమంత ధరించిన దుస్తులను వేలం వేస్తున్నాం. ఈ నెల 25 లోగా ఎవరైతే ఎక్కువ ధరకి ఈ దుస్తులను వేలం పాడతారో వారికి మహేష్ చేతులమీదుగా వాటిని అందజేస్తాం’’ అని తెలిపారు. ఇంకా శ్రీనువైట్ల, ‘మా’ సంయుక్త కార్యదర్శి మహర్షి, ‘మా’స్టార్స్ డాట్ కామ్ శేఖర్, మా సభ్యులు జయలక్ష్మి, మాణిక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Puri Khaidi with Mahesh Babu

 ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రమే చిరంజీవిను స్టార్ హీరోని చేసింది. కోదండరామిడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ రీమేక్ చేయనున్నాడని తెలిసింది.

ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ‘ మహేష్, పూరీ కాంబినేషన్‌లో చిరంజీవి ‘ఖైదీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే గొప్ప న్యూస్‌ను నేను విన్నాను. జగన్ చెప్పిన మహేష్ పాత్రతో కంపేర్ చేస్తే కోదండరామిడ్డి డిజైన్ చేసిన చిరంజీవి పాత్ర నథింగ్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరచడం విశేషం. ఇక ఈ వార్త తెలుగు సినీ పరిక్షిశమలో తప్పకుండా హాట్‌టాపిక్‌గా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Dhookudu Success Meet With Mahesh


‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ చిత్రంతో 75 సంవత్సరాల సినీ చరివూతను తిరగరాసిన ప్రముఖ యువ కథానాయకుడు మహేష్‌బాబు ఈ సారి ‘దూకుడు’గా వచ్చి 80 ఏళ్ళ తెలుగు సినీ చరివూతలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ‘దూకుడు’ సూపర్‌హిట్ అనే విషయాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని దర్శకుడు శ్రీనువైట్ల ప్రతిభను బ్లెండ్‌గా నమ్మి వెళ్ళిన ఈ క్రేజీ కథానాయకుడి ‘దూకుడు’ సినిమాని ఇప్పుడు దునియా మొత్తం కనులపండువగా చూస్తుంటే దిల్‌ఖుష్‌గా వున్నాడు మహేష్. ఒకవైపు ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా వుంటూనే మరోవైపు ‘దూకుడు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు’ ఈ వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణదంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేకార్షణగా నిలిచారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు పాత్రికేయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు... ఆ విశేషాలు మీకోసం.

‘దూకుడు’ ఈ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతుందని ముందుగా ఊహించారా?
‘దూకుడు’ షూటింగ్ మొదటి రోజు నుంచే ఓ సూపర్‌హిట్ సినిమా చేస్తున్నాననే ఫీల్ కలిగింది. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని అందరికీ నమ్మకముండేది. కానీ ఈ స్థాయిలో సక్సెస్‌ను ఎవ్వరూ ఊహించలేదు. నేను ఈ సినిమా ఆడియో వేడుకలో చెప్పినట్లుగా నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోనుంది. ట్రేడ్ వర్గాలు కూడా ఈ చిత్రానికి వంద కోట్లు వసూళ్లు చేయగల సత్తా వుందని విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదలైన దగ్గరినుంచి ‘ది బిజినెస్‌మేన్’ షూటింగ్‌లో వుండటం వల్ల సినిమా సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించలేకపోయాను.

ఇందులో నాలుగు వేరియేషన్స్ వున్న పాత్రల్ని చేశారు. షూటింగ్ సమయంలో ఎలా ఫీలయ్యారు?
నా కెరీర్‌లో ఇప్పటి వరకూ ఇన్ని షేడ్స్ వున్న పాత్రను చేయలేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రతీకార నేపథ్యమున్న కథాంశానికి వినోదాన్ని మేళవించి శ్రీనువైట్ల అద్భుతంగా తీర్చిదిద్దాడు. అందులో ఏ పాత్ర కష్టమనిపించలేదు. కొంచెం సర్దుబాటు కావడానికి రెండు మూడు రోజులు పట్టిందంతే!. ఎందుకంటే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో శ్రీనువైట్ల చాలా క్లారిటీతో వున్నాడు. సో..సినిమా మొత్తం ఆయన చెప్పినట్లు ఫాలో అయిపోయాను. నిజం చెప్పాలంటే షూటింగ్ ఆద్యంతం చాలా ఎంజాయ్ చేశాను. ఒక్క సినిమాలో ఇన్ని వేరియేషన్స్ వున్న పాత్రలు చేశాను కాబట్టి మున్ముందు ఎలాంటి పాత్రనైనా పెద్దగా కష్టపడకుండా చేయగలనన్న కాన్ఫిడెన్స్ వచ్చింది.

ముఖ్యంగా ఎమ్.ఎల్.ఎ పాత్రలో కొత్తగా కన్పించారంటున్నారు?
స్క్రిప్ట్ విన్నప్పుడే ఈ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని ఊహించాను. ఎందుకంటే గతంలో నేనెప్పుడు అలాంటి పాత్ర చేయలేదు. అందులో నా ఆహార్యం, మేనరిజమ్స్ అన్ని ప్రత్యేకంగా ఫక్తు రాజకీయ నాయకుడిలా వున్నాయంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘దూకుడు’లో నాది బెస్ట్ లుక్ అంటున్నారందరూ.

ఈ సినిమా సక్సెస్‌పై నాన్నగారి స్పందన ఎలా వుంది?
సినిమా విడుదలైన రోజు నేను, శ్రీనువైట్ల కారు ప్రయాణంలో వున్నప్పుడు నాన్నగారు ఫోన్ చేశారు. సినిమా 80 కోట్లు వసూళ్లు చేస్తుందని ధీమాగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ‘దూకుడు’ భారీ వసూళ్లు చేస్తోంది. ఆయన ఫోన్ చేసి అభినందించడమే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్‌గా భావిస్తున్నాను.

‘దూకుడు’ చిత్రాన్ని మీ కెరీర్‌లో ఏ విధంగా ప్రత్యేకమైనదిగా భావిస్తారు?
‘పోకిరి’ తర్వాత నేను ఏ సినిమా చేసినా అందరూ దానితో పోల్చేవారు. ‘దూకుడు’ ఆ ఇమేజ్ నుంచి నన్ను బయట పడేసింది. అంతేకాదు రికార్డుల పరంగా కూడా ‘దూకుడు’ పోకిరిని అధిగమించింది.

భవిష్యత్తులో ప్రయోగాలకు ఆస్కారమున్న సబ్జెక్ట్‌లు చేస్తారా?
చేయను. కమర్షియల్ వాల్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ వున్న సినిమాలే చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఉద్దేశ్యం లేదు.

ఈ సినిమా గురించి ఇండస్ట్రీ స్పందన ఎలా వుంది?
పూరి జగన్నాథ్ ఫోన్ చేసి నీ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా మొత్తం చాలా ఎంజాయ్ చేశానని ప్రశంసించారు. రాజమౌళి కూడా సూపర్‌హిట్ మూవీ చేశావన్నారు.

‘ది బిజినెస్‌మేన్’ ఎంతవరకు వచ్చింది?
ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్ జరుగుతోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తయారువుతున్న సై్టలిష్ మూవీ అది. దాదాపు యాభైశాతం పూర్తయింది. జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

ఈ సినిమాకి ఓవర్సీస్‌లో వస్తోన్న స్పందన పట్ల ఎలా ఫీలవుతున్నారు?
‘తీ ఇడియట్స్’ తర్వాత ఓవర్సీస్‌లో ఆ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తున్న చిత్రమిదని విశ్లేషకులు అభివూపాయపడుతున్నారు. అమెరికాలో ప్రముఖ పత్రిక లాస్ ఏంజిల్స్ టైమ్స్ ‘దూకుడు’ చిత్రంపై ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఇంతవరకూ ఏ భారతీయ సినిమా గురించి ఆ పత్రిక రాయలేదు. నిజంగా ఇది తెలుగువారందరూ గర్వించాల్సివ విషయం. ఓవర్సీస్‌లో ఒక్క వీకెండ్‌లోనే రెండు మిలియన్‌లు వసూళ్లు చేసింది. నైజాం కలెక్షన్లకు సమానంగా విదేశాల్లో వసూళ్లు చేసింది.

వెంక చేస్తోన్న ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఎలా వుంటుంది?
ఆ సినిమాలో పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. వెంక నాకు ఎప్పటినుంచే ఆత్మీయ అనుబంధం వుంది. ఈ చిత్రంలో ఇద్దరం అన్నాదమ్ముల్లుగా నటిస్తున్నాం. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన సబ్జెక్ట్ బాగా నచ్చి ఈ సినిమాలో నటిస్తున్నాను.

మీ తదుపరి చిత్రాలు?
‘ది బిజినెస్‌మేన్’ జనవరిలో విడుదలవుతుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ త్వరలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో దూకుడు చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించే మరో చిత్రంలో నటించాల్సివుంది.

Mahesh is about his future projects


తెలుగు సినిమాకి వసూళ్ల పండగ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. 'దూకుడు' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపారు. ''చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోంది. ప్రేక్షకుల ప్రతిస్పందనను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. కానీ 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాల్సొచ్చింది. ఇకపై కూడా ఇలాగే అందరూ మెచ్చే సినిమాల్లో నటించాలని ఉంద''ని చెబుతున్న మహేష్‌బాబు ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
''ఒక సినిమాలో ఒకే రకమైన పాత్ర పోషిస్తే ఇమేజ్‌ సమస్యలు ఎదురవుతాయి. ఆ ప్రభావం తరువాతి సినిమాలపై కూడా పడుతుంటుంది. 'పోకిరి' విషయంలో నాకదే జరిగింది. 'దూకుడు' సినిమా ఇమేజ్‌కి దూరంగా నడిచింది. అందరికీ చేరే కథతో తెరకెక్కింది. ప్రారంభ సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదమే ప్రధానంగా సాగుతుంది. ఇలాంటి కథల్లో నటించటం చాలా కష్టం. పైగా ఈ తరహా స్క్రిప్ట్‌లు అరుదుగా వస్తుంటాయి''.నాన్నతో...: ''ఎమ్మెల్యే పాత్ర అందరినీ ఆకట్టుకుంటోంది. అందులోని హావభావాలు, ఆ వేషం కొత్తగా అనిపించింది. రాజకీయాలకీ దీనికి సంబంధం లేదు కానీ.. ఆ పాత్ర తండ్రీకొడుకుల మధ్య భావోద్వేగాలను పండించేందుకు చక్కగా ఉపయోగపడింది. నిజ జీవితంలో అందరిలాగే నాకూ నాన్నతో అనుబంధమెక్కువ.నాన్నతో ఎప్పుడూ క్లోజ్‌గా ఉంటాన్నేను. నాన్నతో నటించాలని ఉంది. అందుకు తగ్గ కథ దొరకాలి. శ్రీను వైట్లతో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఉంది. నా సినిమాలకి మణిశర్మ సంగీతం అందిస్తుంటారు. ఈసారి తమన్‌ని ఎంచుకొన్నాం. తను చక్కటి పని తీరు కనబరిచాడు. సమష్టి కృషితో కూడిన చిత్రమిది. అందుకు తగ్గట్టుగానే ఫలితాలొచ్చాయి''.
ఇంత డబ్బుందా?: ''ఒక నటుడిగా ఎన్నో విషయాలను నేర్పించిందీ చిత్రం. ఏ సినిమాలోనూ ఇంత అందంగా కనిపించలేదని చెబుతుండటం సంతోషాన్నిస్తోంది. నా సినిమాతో పరిశ్రమకు ఇంత పెద్ద విజయం దక్కటం చాలా ఆనందంగా ఉంది. విదేశాల్లో తొలి రెండు రోజుల వసూళ్లు చూసి నాకే ఆశ్చర్యమేసింది. వసూళ్లను చూస్తుంటే మాకే నమ్మశక్యంగా అనిపించలేదు. ఇంత డబ్బు ఎక్కడుందని ఆశ్చర్యమేసింది''.
్రపయోగాలు వద్దు: ''ప్రయోగాలు చేయడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. అందరికీ వినోదాన్ని పంచే మంచి సినిమాలకే నా ప్రాధాన్యం. కౌబాయ్‌ సినిమాలు చేసే ఆలోచన ఇప్పట్లో ఏ మాత్రం లేదు. ప్రస్తుతం 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణలో బిజీగా ఉన్నాను. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అందులోని పాత్ర గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడను. ముందుగా అనుకొన్నట్టే జనవరి 12న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది''.
అన్నదమ్ములుగా: ''సంతోష్‌శివన్‌తో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. హిందీకి వెళ్లే ఆలోచన లేదు. తెలుగులో చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. జనవరి నుంచి 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు' సెట్స్‌పైకి వెళుతుంది. అందులో వెంకటేష్‌గారితో కలిసి నటిస్తుండటం ఆనందాన్నిస్తోంది. ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. మల్టీస్టారర్‌ సినిమా అని కాదు కానీ కథ నచ్చింది. అందులో అన్నదమ్ములుగా నటిస్తున్నాం. ప్రతి ప్రేక్షకుడికీ నచ్చేలా ఉంటుందీ చిత్రం''.

Dookudu Success Interview With Mahesh

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్.

ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్ స్క్రిప్ట్‌గా చెప్పగలుగుతాను. అన్ని ఎమోషన్లు పలికించడానికి ఈ కేరక్టర్ నాకు అవకాశం కల్పించింది.

ఒక్క పాత్రలో అన్ని ఎమోషన్లు పలికించడం కష్టం అనిపించలేదా?
అనిపించలేదు. నాకిది నచ్చిన కథ. దాంతో ఇష్టంగా చేశాను. మొదటి మూడురోజులు మీరన్నట్లు కాస్త కష్టం అనిపించినా తర్వాత ఎంజాయ్ చేస్తూ ఈ కేరక్టర్ చేశాను. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధం ఒకపక్క, పోలీసుగా ఒకపక్క, ఎంటర్‌టైన్‌మెంట్ వేలో మరో పక్క... ఇలా విభిన్నమైన యాంగిల్స్ ఉన్నాయి ఆ పాత్రలో. ఒక విషయంలో మాత్రం ‘దూకుడు’ నాకు చాలా హెల్ప్ చేసింది. మొన్నటిదాకా ‘పోకిరి’ చట్రంలో ఇరుక్కుపోయాన్నేను. ఆ ఇమేజ్ నుంచి బయటపడేసిన చిత్రం ‘దూకుడు’. ‘పోకిరి’ రికార్డుని బ్రేక్ చేయడానికి నాకు చాలా రోజులు పట్టింది. అలాంటి పరిస్థితి మళ్లీ రాదని అనుకుంటున్నాను. ఎందుకంటే, ఒక్క పాత్రలో ఇన్ని షేడ్స్ పోషించాను కాబట్టి.. ఇక ఎలాంటి పాత్ర అయినా పోషించగలనన్న నమ్మకం నాకు ‘దూకుడు’ కలిగించింది.

మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
నాన్నగారు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పడమే బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన 80 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు. పూరి జగన్నాథ్ అయితే బ్రహ్మానందంకి ధీటుగా కామెడీ చేశావన్నాడు. అలాగే రాజమౌళి కూడా. ఇంతమంది కాంప్లిమెంట్లు పొందడం చాలా ఆనందంగా ఉంది.

సినిమాలో మీ పాత్ర కాకుండా మీకు నచ్చిన మరో పాత్ర ఏమిటి?
ప్రకాష్‌రాజ్ కేరక్టర్. శ్రీను వైట్ల దాన్ని చాలా కొత్తగా డిజైన్ చేశాడు.

ఫస్ట్ టైమ్‌లో ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?
కొత్తగా ఉంది. సినిమాకి హైలైట్ అవుతుందని అందరం అనుకున్నాం. నా మెడలో పులిగోరు, వైట్ అండ్ వైట్ డ్రస్ అందరికీ నచ్చింది. నాక్కూడా బాగా నచ్చింది.

విదేశాల్లో కూడా ఈ సినిమా సక్సెస్ అవ్వడంపట్ల మీ ఫీలింగ్?
‘3 ఇడియట్స్’ ఓవర్‌సీస్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ఉంటే.. నంబర్ 2 ప్లేస్‌లో ‘దూకుడు’ ఉంది. పది కోట్లకు పైనే అక్కడ వసూలు చేసింది ఈ సినిమా. మన దగ్గర నైజాం కలెక్షన్లతో సమానంగా ఓవర్‌సీస్‌లో వసూలు చేసింది. మన తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయం.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కేరక్టరైజేషన్ ఎలా ఉంటుంది?
కేరక్టరైజేషన్ గురించి ఇప్పుడే చెప్పకూడదు. అయితే వెంకటేష్‌గారితో చేయడం మాత్రం ఆనందంగా ఉంది. ఆయనది ఫ్రెండ్లీ నేచర్. ఇందులో మేమిద్దరం అన్నదమ్ములుగా నటిస్తున్నాం. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను.

Dookudu Becoming Industry Biggest Hit

''పోకిరి సినిమా చూశాక 'ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. నేను చెప్పినట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. 'దూకుడు' చూశాక రూ.80 కోట్లు రాబట్టుకొంటుందని చెప్పాను. ఆ సంఖ్య వంద కోట్ల మార్కుకి చేరుకొనేలా ఉంద''న్నారు కృష్ణ. ఆయన తనయుడు మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా బాగా ఆడడానికి చాలా కారణాలున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా తీర్చిదిద్దారు. దర్శకత్వం, సంభాషణలు, పాటలు అన్నీ బాగున్నాయి. థియేటర్‌కి వచ్చినవాళ్లు శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉన్నారు. మహేష్‌ చాలా అందంగా కనిపించాడ''ని చెప్పారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''దూకుడు సినిమా ఈ స్థాయిలో ఆడడానికి కారణం శ్రీను వైట్ల. ఈ కథ చెబుతున్నప్పుడు ఓ మాట అన్నారు.. 'సూపర్‌ హిట్‌ తీస్తా. లేదంటే బ్లాక్‌బస్టర్‌ సినిమా తీస్తా'. అవి రెండూ కాదు.. పరిశ్రమ రికార్డులు తిరగరాసే సినిమా తీశాడు. అతనికి మంచి నిర్మాతలు దొరికారు. సమంతలాంటి కథానాయికని నేనింత వరకూ చూళ్లేదు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలాంటి వేడుకలు మరిన్ని జరుపుకొంటామనే నమ్మకం ఉంద''న్నారు. ''నిర్మాతలు నాకు మంచి స్నేహితులు. మహేష్‌ అంటే నాకు చాలా ఇష్టం. వీరిద్దరుకలిసి ఇంత మంచి చిత్రం తీయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం విజయానికి మహేష్‌బాబు నటనే కారణం'' అన్నారు దర్శకుడు. ''దమ్మున్న కథానాయకుడు, సత్తా ఉన్న దర్శకుడు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ సినిమానే సాక్ష్యం'' అన్నారు నిర్మాతలు రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర, గోపీచంద్‌ ఆచంట. కథానాయిక సమంత మాట్లాడుతూ ''దూకుడు ద్వారా గొప్ప విజయాన్ని పొందడం నా అదృష్టం. ఈ చిత్రంతో నటిగా కొత్త విషయాలెన్నో తెలుసుకోగలిగాను'' అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనిర్మల, జి.ఆదిశేషగిరిరావు, డి.సురేష్‌బాబు, శ్యాంప్రసాద్‌రెడ్డి, బూరుగుపల్లి శివరామకృష్ఱ, కె.ఎస్‌.రామారావు, రూప వైట్ల, కోట శ్రీనివాసరావు, తమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Mahesh Bussiness Man Title Song Shooting at Delhi

హేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మహేష్‌బాబు శైలికి తగ్గ కథాంశమిది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతుంది. 'పోకిరి' బృందం నుంచి వస్తున్న చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను అందుకొనేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర, ఆయన పలికే హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికొస్తుంది. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె.నాయుడు, సంగీతం: తమన్‌.

Seethamma Vakitlo Sirimalle Chettu

తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్‌ అనేది ఓ కల. ఇద్దరు కథానాయకులు కలిసి తెరమీద సందడి చేస్తే చూడాలని సగటు సినీ అభిమాని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఫలించింది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రమే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌, మహేష్‌బాబు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కొత్తబంగారులోకం' చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ఉదయం విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్టు అందుకొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''వసుధైక కుటుంబం మన భారతదేశం. ఈ దేశాన్ని సీతమ్మ వాకిలి అనుకొంటే.. అందులో అందమైన సిరిమల్లె చెట్టు మన కుటుంబ వ్యవస్థ. ఈ బంధానికి సంబంధించిన కథ ఇది. అందుకే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే పేరు పెట్టాం. అందరికీ నచ్చిన పేరిది. శ్రీకాంత్‌ ముందునుంచీ 'ఈ సినిమాలో ఇద్దరు ప్రముఖ కథానాయకులు ఉండాల్సిందే' అని అంటున్నాడు. అది ఎంత కష్టమో మనకు తెలుసు. ఈ కథకు వెంకటేష్‌ ఎప్పుడో తన అంగీకారం తెలిపారు. మరో కథానాయకుడు కావాలి. ఓ రోజు 'దూకుడు' సెట్లో మహేష్‌బాబుకి ఈ కథ వినిపించాం. వెంటనే ఆయన కూడా ఒప్పుకొన్నారు. అలా మా సినిమా మొదలైంది. ఇది ప్రత్యేకించి ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తీస్తున్న సినిమా కాదు. ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీర్చిదిద్దుతాం. మిగతా నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు ట్వరలోనే చెబుతాం. నవంబరులో చిత్రీకరణ మొదలుపెడతాం. వేసవికి విడుదల చేస్తామ''న్నారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, శ్యాంప్రసాద్‌రెడ్డి, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.

‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్‌స్టార్స్

అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- వెంకటేష్, మహేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది.

సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన. ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం.

‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన సరసన జతకడుతున్నట్టు వినికిడి. ‘దిల్’రాజు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం దసరారోజు అయిన ఈ నెల 6న నిర్వహించనున్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులకు నిజంగా ‘డబుల్ ధమాకా’నే అని చెప్పొచ్చు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates