మహేష్ మాస్ మసాలా ‘దూకుడు’

‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’ అంటూ మహేష్ త్వరలో వెండితెర మీదికి ‘దూకుడు’గా రాబోతున్నాడు. ఆయన అభిమానులు ఆయన నుంచి ఎదురుచూస్తున్న మాస్ మసాలా వినోదాన్ని ఈ చిత్రం ద్వారా పంచబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రీతిలో దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ను ‘దూకుడు’లో ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్, పార్వతీమెల్టన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటలో పార్వతీ హాట్ హాట్‌గా కనిపించనుందని యూనిట్ వర్గాలు చెపుకుంటున్నాయి. ఇక ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న దూకుడు గురించి నిర్మాతలు మాట్లాడుతూ ‘మహేష్ కెరీర్‌లో అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆయన నుంచి అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా వుంటాయి. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అతి పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది’ అని తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనుసూద్, సయాజీ షిండే, నాజర్, సంజయ్ తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్నారు.

0 comments:

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates