Aagadu Mahesh Role: Encounter Specialist

Mahesh Babu, Encounter Specialist, Aagadu, Sreenu Vaitla, శ్రీనువైట్ల, ఆగడు, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌, మహేష్ బాబు
మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆగడు’. తమన్నా కథానాయిక. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజాకార్యక్షికమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా శంకర్ అనే పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. దూకుడు’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి తెలంగాణ యాసలో డైలాగ్‌లు చెప్పిన మహేష్ ఈ సినిమాలో రాయలసీమ స్లాంగ్‌ని అనుకరిస్తాడని చిత్ర వర్గాల సమాచారం.

మాస్ అంశాలుంటూనే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 2 నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. అత్యుత్తమ నిర్మాణ విలువలతో తెరకెక్కనున్న చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో ఏప్రిల్‌లోగా పూర్తి చేసి వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు ముందు శ్రీహరిని అనుకున్నారు. ఆయన హఠాన్మరణం కారణంగా ఇప్పుడు ఆ పాత్రకు సాయికుమార్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ శంకర్‌గా కనిపిస్తారని ఫిలిమ్‌నగర్ సమాచారం.

ముఖ్యతారాగణం: రాజేంవూదవూపసాద్, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, సాయికుమార్‌, నెపోలియన్‌లతో పాటు ఇతర ముఖ్యతారాగణం 
రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్
రచనా సహకారం: ప్రవీణ్‌వర్మ
ఛాయా గ్రహణం: కె.వి.గుహన్
ఆర్ట్: ఎ.ఎస్‌పకాష్
ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ
సంగీతం: తమన్ 
కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

Mahesh 1 Climax Shooting In Goa

2013, 2014, Mahesh Babu, Shooting, Sukumar, Prince, Prince Mahesh, Super star Mahesh

'దూకుడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మహేష్‌బాబు. రెండు చిత్రాలు చిత్రీకరణ దశలో, మరో రెండు కథాచర్చల్లో ఉన్నాయి. అందులో '1' (నేనొక్కడినే) ప్రస్తుతం గోవా తీరంలో చిత్రీకరణ జరుపుకొంటోంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ కథానాయిక. సుకుమార్‌ దర్శకుడు. గోవా షెడ్యూల్‌తో చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

Mahesh new movie Vijyanthi Banner

Mahesh babu, bollywood, Raj Nidimoru, Krishna D.K, Aswini Dutt, అశ్వనీదత్, మహేష్ బాబు, రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కె, బాలీవుడ్, Prince, Prince Mahesh, Superstar, Superstar Mahesh

మహేష్‌బాబు కథానాయకుడిగా వైజయంతి మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణ నిడిమోరు, రాజ్‌ డి.కె. దర్శకత్వం వహిస్తారు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ''మహేష్‌తో ఇది మా మూడో చిత్రం. 2014 ప్రధమార్ధంలో సినిమాని ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం. మహేష్‌బాబు శైలి, ఇమేజ్‌కి తగిన కథ సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతామ''న్నారు అశ్వనీదత్‌. ప్రస్తుతం '1' (నేనొక్కడినే) చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్‌. ఇటీవలే 'ఆగడు' కూడా మొదలైంది. డిసెంబరులో '1' చిత్రీకరణ పూర్తవుతుంది. ఆ తరవాత వైజయంతి మూవీస్‌ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Who Is Tollywood No1 Hero

మెగాస్టార్ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశానంతరం తెలుగు సినీరంగంలో నెంబర్‌వన్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఆయనకు ప్రత్యామ్నాయంగా ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అగ్ర హీరోల అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నా తెలుగు సినిమా ‘అగ్ర కథానాయకుడు’ ఎవరనే విషయంలో ఎవరూ నిశ్చితాభివూపాయానికి రాలేకపోతున్నారు. నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడానికి ఖచ్చితమైన ప్రామాణికాలు ఏమిటి? అనే అంశంలో కూడా ఎవరికీ స్పష్టత లేదు.

తారలు తీసుకునే పారితోషికాల ప్రాతిపదికనే నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా విజయాలతో పాటు తారల పారితోషికాలు పెరగడం సహజం. దాంతో నెంబర్‌వన్ స్థానాన్ని నిర్ణయించడానికి పారితోషికాన్నే ప్రామాణికంగా భావించాల్సి వస్తోంది. ఆ ప్రకారం తెలుగు సినిమా నెంబర్‌వన్ రేసులో పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు పోటీపడుతున్నారు. వీరిద్దరూ కమర్షియల్‌గా భారీ విజయాల్ని సొంతం చేసుకున్న కథానాయకులే.

ఒక్కో సినిమాకు వీరు దాదాపు 14 నుంచి 15కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. తెలుగు ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఒక సినిమాలో నటించడానికి మహేష్‌బాబుకు ఓ కార్పొరేట్ కంపెనీ 17 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వజూపిందని తెలిసింది. ఇదిలావుండగా ‘అత్తారింటికి దారేది’ విజయంతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించారు పవన్‌కల్యాణ్. ఈ సినిమాతో ఆయన ఇమేజ్ శిఖరాక్షిగానికి చేరుకుంది. దాంతో ఆయనకు కూడా ఓ కార్పొరేట్ సంస్థ 1 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిందని సమాచారం. ‘దూకుడు’ ‘బిజినెస్‌మేన్’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలతో మహేష్‌బాబు, ‘గబ్బర్‌సింగ్’ ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో పవన్‌కల్యాణ్ విజయపథంలో దూసుకెళ్తున్నారు. దీంతో నెంబర్‌వన్ రేసులో ఇద్దరి మధ్యే పోటీవుందని తెలుగు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Romantic Thriller 1 Nenokkadine

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వన్’. ‘నేనొక్కడినే’ అనేది ఉపశీర్షిక. సుకుమార్ దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. కృతిసనన్ కథానాయిక.

రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్‌స్టార్‌గా వినూత్న పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మహేష్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, తొలిసారిగా ఆయన ఆరుపలకల దేహంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ఇటీవలే బ్యాంకాక్‌లో కీలక ఘట్టాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

త్వరలో సముద్రతీర పట్టణం మంగుళూరులో సినిమాకు సంబంధించిన ప్రధాన పోరాట ఘట్టాల చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నౌకాక్షిశయం, బీచ్‌లలో ఈ పోరాటాలను తెరకెక్కించాలనే ఆలోచనలో చిత్ర దర్శకుడు సుకుమార్ ఉన్నారు. ఈ నెల 25 నుంచి మంగుళూరు షెడ్యూల్ ప్రారంభమవుతుందని చిత్ర వర్గాల సమాచారం. నవంబర్‌లోగా చిత్రీకరణను పూర్తిచేసి డిసెంబర్ రెండవవారంలో ఆడియోను ప్రేక్షకుల ముందుకుతీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. షాయాజీషిండే, కెల్లిడోర్జ్, విక్రమ్ సింగ్, శ్రీనివాసడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫి: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీవూపసాద్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.

రాజమౌళి దర్శకత్వంలో నటిస్తా

''విశ్వరూపం' వివాదాల్లో చిక్కుకోవడం దురదృష్టకరం. కమల్‌హాసన్‌కి నేను వీరాభిమానిని. అంత పెద్ద నటుడు కంటతడి పెట్టడం చాలా బాధనిపించింద''న్నారు ప్రముఖ కథానాయకుడు మహేష్‌బాబు. ఆయన నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌ విలేకరులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ''కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రాన్ని నేను ఇంకా చూడలేదు. ఆ సినిమాకి ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకొంటున్నాన''న్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గురించి చెబుతూ ''సహజత్వంతో కూడిన కథ ఇది. యాక్షన్‌ నేపథ్యంలో సాగుతుంది. సుకుమార్‌ ఇదివరకు చేసిన చిత్రాలకి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకి ఇంకా పేరు నిర్ణయించలేదు. జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు. తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ ''శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత క్రిష్‌, వంశీ పైడిపల్లి, పూరి జగన్నాథ్‌ల దర్శకత్వంలో సినిమాలు చేస్తా. అవి పూర్తయ్యాక రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. కథ గురించి ఇదివరకే మాట్లాడుకొన్నామ''ని తెలిపారు. మీ అమ్మాయి సితార ఎలా ఉంది? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ''పాప వయసు ఆరు నెలలు. అందరినీ చూసి ముద్దుముద్దుగా నవ్వుతోంద''ని చెప్పారు.

నెంబర్‌వన్ ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయించాలి!

‘సీతమ్మ వాకిట్లో...’ చిత్రాన్ని మల్టీస్టారర్ అంటే ఒప్పుకోను. మంచి సినిమా అది. వాణిజ్య సూత్రాల ప్రకారం మల్టీస్టారర్ అంటే ఇద్దరు హీరోలకు రెండేసి ఫైట్స్, రెండు ఐటమ్‌సాంగ్‌లు వుంటాయి. అవేవీ ఈ సినిమాలో లేవు. కథలోని కుటుంబ విలువలు, హృదయానికి హత్తుకునే సున్నితమైన భావోద్వేగాలు నచ్చి ‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా చేయడానికి అంగీకరించాను’ అన్నారు మహేష్‌బాబు. ‘దూకుడు’ ‘బిజినెస్‌మెన్’ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల ద్వారా వరుస విజయాలతో దూసుకుపోతున్నారాయన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణలో వున్నారు మహేష్‌బాబు. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లో మహేష్‌బాబు పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి... 

మీ చిత్రాల శైలికి భిన్నంగా ‘సీతమ్మ వాకిట్లో...’ చేశారు. సినిమా విజయం ఎలాంటి అనుభూతినిస్తోంది?
నా దృష్టిలో ‘సీతమ్మ వాకిట్లో...’ సున్నితమైన భావోద్వేగాలు మేళవించిన ఓ అర్థవంతమైన కుటుంబ కథా చిత్రం. వాణిజ్య విలువల్ని పక్కనబెట్టి కథను నమ్మి ఈ సినిమా చేశాను. చిత్రీకరణ మొదలుపెట్టిన దగ్గరినుంచి అందరూ ఆశావహ దృక్పథంతో సినిమా కోసం శ్రమించారు. ప్రేక్షకుల నుంచి అద్వితీయమైన ఆదరణ రావడం గొప్ప అనుభూతినిస్తోంది. ‘సీతమ్మ వాకిట్లో...’తెలుగు చిత్రసీమలో మల్టీస్టారర్ చిత్రాలకు మరల బీజం వేసింది. చక్కటి కథాబలంతో మల్టీస్టారర్ చిత్రాల రూపకల్పనకు నాంది పలికింది.

‘దూకుడు’ ‘బిజినెస్‌మెన్’ ‘సీతమ్మవాకిట్లో...’ వరుస విజయాలతో సాగిపోతున్నారు? కథల ఎంపికలో మీ ధోరణిలో మార్పు వచ్చిందనుకోవచ్చా?
‘దూకుడు’ టైం నుంచి మంచి కథలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు పరిక్షిశమలో కథల కొరత వుంది. గత మూడు చిత్రాల విజయానికి కథాబలమే ప్రధానంగా పనిచేసింది.

సీనియర్ హీరోలతో కాకుండా మీ సమకాలీన స్టార్‌హీరోలతో కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించే ఆలోచన వుందా?
నా సమకాలీనులతో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే అందుకు మంచి కథ అవసరం. సమర్థవంతంగా తెరకెక్కించే దర్శకుడు కావాలి. అలా అన్ని అంశాలు కుదిరితే యంగ్‌హీరోలతో కూడా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తాను.

మీరింత వరకు రీమేక్ సినిమాల్లో నటించకపోవడానికి కారణమేమిటి?
రీమేక్ సినిమాల్లో నటించడం నాకిష్టముండదు. ఒరిజినల్ సినిమా చేసిన ఫీల్‌తో రీమేక్‌లో నటించలేం. అందరికీ తెలిసిన కథలో నటించాలంటే బోర్‌గా అనిపిస్తుంది. రీమేక్ చేయడంలో సృజనాత్మకత వుండదని నా అభిప్రాయం. చేసే కథ మనలో ఉత్సాహాన్ని నింపాలి. అప్పుడే దానికి న్యాయం చేయగలం.

‘సీతమ్మ వాకిట్లో...’ సినిమా చూసి మీ తనయుడు గౌతమ్ ఏమన్నాడు? బాలనటుడిగా అతన్ని సినిమా రంగానికి పరిచయం చేసే ఆలోచన వుందా?
గౌతమ్ చూసిన మొదటి సినిమా ఇది. నాతో కలసి చూశాడు. వాడికి ఫైట్స్ అంటే నచ్చవు. సినిమా చూసి చాలా బాగుందన్నాడు. ఆ సినిమాతో వాడు బాగా కనెక్ట్ అయ్యాడు. సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావడం కూడా వాడిలో తెలియని ఉత్సాహాన్ని నింపింది. ఇక గౌతమ్ వాడి అభిరుచిని బట్టి సినిమాల్లో నటించాలా? వద్దా? అని నిర్ణయించుకుంటాడు. బాలనటుడిగా నేనూ సినిమాలు చేశాను. అందులో నాన్న ప్రోద్భలం ఏమీ లేదు. నా ఆసక్తి మేరకే నటించాను. 

తమిళ హీరోలు తెలుగులో మార్కెట్‌ను పెంచుకుంటున్నారు? అదేస్థాయిలో తెలుగు హీరోలు తమిళంలో రాణించలేకపోవటానికి కారణమేమిటి?
కథాంశాల ఎంపికలో ప్రయోగాలు చేయాలి. భాషలకు అతీతంగా యూనివర్సల్ ఫీల్ వున్న కథాంశాల్ని ఎంచుకొని సినిమాలు చేయాలి. అప్పుడు మన సినిమాల్ని ఏ భాషలోకైనా డబ్బింగ్ చేసుకోవచ్చు. తెలుగు సినిమా కథలు మన పరిధిని దాటి వెళ్లవు. ‘సీతమ్మ వాకిట్లో...’ యూనివర్సల్ ఫీల్ వున్న కథాంశం. ఇలాంటి సినిమాను ఏ భాషలోనైనా విడుదల చేసుకోవచ్చు.

వివిధ వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా తెలుగు నటుల్లో మీరే అగ్రస్థానంలో వున్నారు. ఆ సంస్థలు మీవైపే ఎక్కువగా మొగ్గుచూపడానికి కారణమేమిటని భావిస్తున్నారు?
‘ఖలేజా’ తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ వచ్చింది. అదే సమయంలో సినిమాలు చేయకుండా ఖాళీగా వున్నా బ్రాండ్ అంబాసిడర్‌గా అవకాశాలు మాత్రం పెరిగిపోయాయి. బ్రాండ్ అంబాసిడర్‌నుఎంపికచేసుకునే ముందు ఆయా సంస్థలు చక్కటి ప్రమాణాలతో సర్వేలు చేస్తాయి.వాటి ఆధారంగానే ఎక్కువ ప్రజాదరణ వున్న సెలవూబిటీస్ ఎవరో తెలుసుకుంటారు. ఆ గణాంకాల్ని నేను తెలుసున్నాను. సినిమాలు చేయకున్నా ప్రేక్షకుల్లో నాకున్న ఆదరణ చూసి ఆశ్చర్యమేసింది. అప్పటి నుంచి నటుడిగా ప్రేక్షకులకు చేరువయ్యేందుకు మరింత కష్టపడటం మొదలుపెట్టాను.

ఓ మద్యం కంపెనీ ప్రకటనలో నటించారు. మీ స్థాయి నటులు అలాంటి వ్యాపార ప్రకటనల్లో నటించడం వల్ల అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు వుంటాయి కదా?
ఆ ప్రకటన కాన్సెప్ట్ నచ్చి చేశాను. యాడ్స్‌లో సృజనాత్మకత వుంటేనే నేను అంగీకరిస్తాను. అదీగాక నా వ్యక్తిగత అభిరుచుల్ని ప్రకటన సంతృప్తిపరచాలి. డబ్బులొస్తున్నాయి కదా అని అన్ని కంపెనీలకు పనిచేయను. ఆ మద్యం కంపెనీ ప్రకటనలో వున్న థీమ్ నచ్చింది. ఓ వ్యక్తి ఎదిగే క్రమాన్ని ఆ ప్రకటనలో అద్భుతంగా చూపించారు. వీటన్నంటితో పాటు ఆ ప్రకటనలో వున్న లైఫ్ ఆఫ్ మ్యూజిక్ నచ్చి అందులో నటించాను.

తెలుగు పరిక్షిశమలో మీరే నెం.1 కథానాయకుడు అంటున్నారు?
ఆ విషయాన్ని నేను అంగీకరించను. ఎవరు నెం.1? అన్న అంశాన్ని ప్రేక్షకులు నిర్ణయించాలి. ఒకవేళ ప్రేక్షకులు ‘నువ్వే నెం.1’ అని అంటే ఒప్పుకుంటాను.

‘విశ్వరూపం’ విడుదలలో ఎదురైన అవాంతరాలపై మీ స్పందన?
కమల్‌హాసన్ వీరాభిమానిని నేను. సినిమా విడుదలకు ఆయన ఎదుర్కొన్న కష్టాల్ని చూసి చలించిపోయాను. ఆయన ఆవేదన నాకు కన్నీళ్లు తెప్పించింది.

మీ నాన్నగారితో కలిసి సినిమా ఎప్పుడు చేస్తారు?
మంచి కథ వస్తే నాన్నగారితో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాను. ఆయన ఇక రాజకీయాల్లోకి వెళ్లనని చెప్పారు కానీ సినిమాల్లో మాత్రం నటిస్తానన్నారు.

ఆయన సినిమాల్లో మీకు బాగా నచ్చింది?
‘అల్లూరి సీతారామరాజు’. లెక్కలేనన్నిసార్లు ఆ సినిమా చూశాను. చిన్నతనంలో మొదటిసారి ఆ సినిమా చూడగానే నాకు బాగా నచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ ‘పాతాలభైరవి’ని ఇష్టపడతాను. నాన్న చేసిన మల్టీస్టారర్ చిత్రాల్లో ‘దేవుడు చేసిన మనుషులు’ నా ఫేవరేట్.

మణిరత్నంతో సినిమా చేస్తానన్నారు? ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది?
మణిరత్నం నా అభిమాన దర్శకుడు. ఆయన సినిమాలో నటించాలన్నది నా జీవితకాల స్వప్నం. ఆయనతో సినిమా చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు.

సుకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది? ఆ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్ పెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి?
సుకుమార్ శైలిలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అది. నా పాత్ర చిత్రణ, స్క్రీన్‌ప్లే ఆసక్తికరంగా వుంటాయి. టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. మీరన్న ‘ఆచార్య’ అన్న టైటిల్ వినగానే నా కాళ్లలో వణుకుమొదలైంది(నవ్వుతూ).

తదుపరి చిత్రాలు?
సుకుమార్ దర్శకత్వంలో చేస్తోన్న చిత్రం పూర్తవగానే శ్రీనువైట్ల ‘ఆగడు’లో నటించబోతున్నాను. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘శివం’, ఆపై వంశీపైడిపల్లి, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలు చేయాల్సివుంది.

Tamanna Out From Mahesh Sukumar Movie

దూకుడు, బిజినెస్‌మేన్ చిత్రాల వేడి పూర్తిగా చల్లారనేలేదు. అప్పుడే మరో సంచలనానికి తెరతీశారు మహేష్‌బాబు. ఓ వైపు వెంకటేష్‌తో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’లో నటిస్తూ... మరో వైపు సుకుమార్ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు. మహేష్‌తో ‘దూకుడు’ లాంటి బ్లాక్‌బాస్టర్ చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట త్రయం నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో మొదలైంది.

దిల్‌రాజు, ఎస్.ఎస్.రాజమౌళి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో మహేష్ సరసన ఓ కొత్త అమ్మాయిని నటింపజేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు తెలిసింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం రత్నవేలు. సుకుమార్‌తో ఆర్య, ఆర్య2 చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన రత్నవేలు... రజనీకాంత్ ‘రోబో’తో సంచలన ఛాయాగ్రహకునిగా మారారు.

సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు... ఈ ముగ్గురూ మహేష్‌తో పనిచేయడం ఇదే ప్రధమం. మహేష్ ఇమేజ్‌ని రెట్టింపు చేసే విధంగా అద్భుతమైన కథతో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. మార్చి లేదా ఏప్రిల్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.

Thamanna With Mahesh

హేష్‌బాబు కథానాయకుడిగా నటించే కొత్త చిత్రానికి రంగం సిద్ధమైంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రాన్ని 14రీల్స్‌ సంస్థ నిర్మించబోతోంది. ఈ నెల 12న లాంఛనంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. ఇందులో మహేష్‌ సరసన తమన్నా కథానాయికగా నటించే అవకాశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం సమకూరుస్తారు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్‌' విజయాలతో ఖుషీగా ఉన్న మహేష్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఇటీవలే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా సెట్స్‌ మీదకు వెళ్లింది. అలాగే క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని అంగీకరించారు.

Mahesh About Business Man Success

ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో లేదు:మహేష్ బాబు
 
‘నెంబర్‌గేమ్స్‌ను నేను పట్టించుకోను. నా పని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాకు లేదు’ అంటున్నాడు యువ కథానాయకుడు మహేష్‌బాబు. సీనియర్ నటుడు కృష్ణ నట వారసుడిగా రంగవూపవేశం చేసిన మహేష్ అనతి కాలంలోనే తెలుగు సినీ పరిక్షిశమలో క్రేజీ కథానాయకుడిగా ఎదిగాడు. ‘పోకిరి’తో 75 ఏళ్ళ సినీ చరివూతను తిరగరాసిన ఈ ప్రిన్స్.. ‘దూకుడు’తో ఆ రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు తాజాగా ‘బిజినెస్8మేన్’ చిత్రంతో మరో సంచలనాత్మక విజయాన్ని తన ఖాతాలో జమచేసుకొని హీరోగా తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ‘బిజినెస్8మేన్’ చిత్రం గురించి మహేష్‌బాబు చెప్పిన విశేషాలు..
‘బిజినెస్ మేన్’కు వస్తున్న స్పందన ఎలా వుంది?
నా కెరీర్‌లో మరో అతిపెద్ద విజయంగా ‘బిజినెస్8మేన్’ నమోదు అయినందుకు ఆనందంగా వుంది. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా వుంది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వారిలో కనిపిస్తుంది.

‘బిజినెస్8మేన్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చెయ్యబోతుందని అనుకుంటున్నారు?
రికార్డుల గురించి, సంచలనాల గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం సరికాదు. కానీ ఇప్పటి వరకు తెలుగు సినిమా చరివూతలో ఏ సినిమా ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పటికీ టిక్కెట్లు దొరకడం లేదని, టిక్కెట్లు ఆబ్లిగేషన్స్‌తో మాత్రమే దొరుకుతున్నాయని అందరూ అంటూంటే ఆనందంగా వుంది.
‘దూకుడు’లాంటి ఘనవిజయం తర్వాత వెంటనే ‘బిజినెస్8మేన్’ రూపంలో మరో విజయాన్ని అందుకోవడం ఎలా వుంది?

‘దూకుడు’ విడుదలైన రోజు నుంచి అంటే సెప్టెంబర్ 23 నుంచి ఈ రోజు వరకు అంతా కలగానే వుంది.
‘దూకుడు’లో యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ పాత్రను చేసిన మీరు ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్8 పాత్రలో టిపికల్‌గా కనిపించారు?
ఖచ్చితంగా ‘సూర్య’ భాయ్ చాలా టిపికల్ క్యారెక్టర్. ఛాలెంజింగ్‌గా అనిపించే పాత్ర అది. అయితే ఇలాంటి పాత్రలో నటించి ఆడియన్స్‌ను ఒప్పించడం చాలా కష్టం. ఒక వేళ ఆ పాత్ర ప్రేక్షకులను కన్వీన్స్ చేయకపోతే రిజల్ట్‌లో తేడా వచ్చేది. సాధారణంగా పూరిజగన్నాథ్ చిత్రాల్లో కథానాయకుల పాత్రలు చాలా టిపికల్‌గా వుంటాయి. బిజినెస్ మేన్‌లో ఆయన నా పాత్ర గురించి చెప్పగానే ఎంతో నచ్చింది. నాకు తెలిసి పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో సూర్య భాయ్ ది బెస్ట్ క్యారెక్టర్. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లో అన్నింటి కంటే కష్టమైన పాత్ర కూడా ఇదే.

‘బిజినెస్8మేన్’లో కొన్ని సంభాషణల్లో బూతులు జత చేశారు? దీని పట్ల మీ స్పందన?
మొదట్నుంచీ కూడా ‘బిజినెస్8మేన్’ చిత్రం ఓ గ్యాంగ్‌స్టర్ సినిమా అని చెబుతూ వచ్చాం. ఏ రోజు కూడా మేము ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీస్తున్నామని చెప్పలేదు. ఓ మాఫియా పాత్ర ఎలా వుండాలో, ఎలా మాట్లాడాలో దానికి తగ్గట్టుగా పూరి జగన్నాథ్ ఆ పాత్రను తీర్చిదిద్దాడు. చిన్న చిన్న విషయాల గురించి స్క్రిప్ట్ చెడిపోకూడదనే ఉద్దేశంతోనే అటువంటి సంభాషణలు పెట్టాల్సి వచ్చింది.
‘పోకిరి’ నుంచి ‘దూకుడు’ మధ్యలో మిమ్మల్ని కొన్ని అపజయాలు పలకరించాయి కదా..ఆ సమయంలో మీ ఆలోచనా విధానం ఎలా వుండేది?

ఇప్పటి వరకు నేను ఏదీ అనుకోని ప్లాన్ చేయలేదు. ఇక ‘పోకిరి’ లాంటి సంచలనాత్మకమైన విజయం తర్వాత నాలో కొంత కన్‌ఫ్యూజన్ మొదలైంది. ‘పోకిరి’ లాంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలో అర్థం కాలేదు. ఇక ఈ సమయంలోనే నన్ను ఎంతో అనురాగంతో చూసుకునే మా అమ్మమ్మ చనిపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చాను. ఈ సమయంలో సినీ పరిక్షిశమకు దూరంగా వున్నాను. ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఆ తర్వాత అతిథి, ఖలేజా చిత్రాలను చేశాను. అందులో ఖలేజా కమర్షియల్‌గా వర్కవుట్ కాకపోయినా ఆ చిత్రం నటుడిగా నాకెంతో సంతృప్తినిచ్చింది.
సినిమాలో సింహభాగం మీరే కనిపించారు? మీ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది? ఎందుకని?
జగన్ కథ చెప్పినప్పుడే నాకు ఈ విషయం తెలుసు. సినిమాలో సూర్య భాయ్ పాత్రే ఎక్కువగా మాట్లాడుతుంది. అయితే దానికి నా మీద జగన్‌గారికి వున్న నమ్మకమే ప్రధాన కారణం.
చిరంజీవి తర్వాత తెలుగు సినీ పరిక్షిశమలో నెంబర్‌వన్ స్థానం మీదేనని అందరూ అంటున్నారు? ఆయన స్థానాన్ని మీరు భర్తీ చేయాలనే ఆలోచన ఏమైనా వుందా?

నెంబర్‌గేమ్స్‌పై నాకు నమ్మకం లేదు. ఇక ఒకరి స్థానాన్ని భర్తీ చేయాలనే ఆసక్తి నాలో అంతకన్నా లేదు. నా పని నేను చేసుకుంటూ నటుడిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడమే నాకు తెలుసు.
మీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు మీ మానసిక స్థితి ఎలా వుంటుంది?
నా సినిమా ఆడకపోతే చాలా అప్‌సెట్ అవుతాను. ఇంట్లోనే వుంటాను.. బయటికి కూడా రాను. ఎవరితోనూ మాట్లాడను. సాధారణంగా అందరూ సక్సెస్, ఫెయిల్యూర్స్ ఒకేలా స్వీకరిస్తాం అంటుంటారు కాని అది తప్పు. సినిమా ఆడకపోతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు. అప్పుడు మనమేలా సంతోషంగా వుంటాం!
‘బిజినెస్ మేన్’లో మీరు హీరో కాకపోయింటే సూర్య భాయ్ పాత్ర ఏ హీరోకు సరిపోయేదని మీ నమ్మకం?
బిజినెస్8మేన్ నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఎందుకంటే నేను నమ్మినంతగా జగన్‌ను వేరెవ్వరూ నమ్మరు. ఎందుకంటే నేను జగన్‌ను నమ్మి, స్క్రిప్ట్‌ను నమ్మి ఆయన చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్ళాను.
మీ సక్సెస్8 వెనుక మీ శ్రీమతి నమ్రతా ప్రోత్సాహం ఎంతవరకు వుంటుంది?
ఇంట్లో వాతావరణం కూల్‌గా వుంటేనే మనసు ప్రశాంతంగా వుంటుంది. అప్పుడే మనకు సక్సెస్8లు కూడా వస్తుంటాయి. సో.. నేను ప్రశాంతంగా వున్నాను.
‘బిజినెస్ మేన్-2’ చేస్తున్నామని పూరి అనౌన్స్ చేశారు?
తప్పకుండా పూరి, నా కలయికలో ఆ చిత్రం వుంటుంది. ‘బిజినెస్8 మేన్ 2’ చేద్దాం అని పూరి చెప్పగానే ఎంతో ఎక్జ్సయిటింగ్‌గా అనిపించింది.
మీ తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నాను. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది.

Puri about BusinessMan

నా వ్యక్తిత్వమే మహేష్ పాత్రలో ప్రతిబింబించింది:పూరి
 
‘గుర్తుపెట్టుకో, నీకు నువ్వే తోపు...నీకు నచ్చింది చేసెయ్...ఎవరి మాటా వినకు...మనిషి మాట అసలే వినకు...నీ టార్గెట్ పది మైళ్లయితే పదకొండో మైలును లక్ష్యంగా చేసుకో...కొడ్తే దిమ్మతిరగాలి’...బిజినెస్8మేన్ సినిమాలో మహేష్‌బాబు క్లైమాక్స్‌లో చెప్పే డైలాగ్‌లివి. ఈ సంభాషణలన్నీ జీవితంలో ఎదురైన స్వీయ అనుభవాల నుంచి పుట్టినవే అంటున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. మంగళవారం ‘బిజినెస్ మేన్’ సక్సెస్8మీట్‌లో ఆయన పాత్రికేయులతో మచ్చటించారు. ‘మనిషి మాట అసలే వినకు’ అని చెప్పారు... ఇంతకీ మనం ఎవరి మాట వినాలని మీ ఉద్దేశ్యం అని ప్రశ్నిస్తే...‘అవును గౌతమబుద్దుడు, జీసన్ ఏ మనిషి మాట విని కొత్త తత్వాన్ని ప్రజలకు పరిచయం చేశారు. ఉన్న సిద్దాంతాలను పక్కన పెట్టి కొత్త సిద్ధాంతాలను వెలుగులోకి తెస్తేనే మనం ప్రత్యేకతను చాటుకోగలం. పోటీ అనేది మన అభివృద్ధికి దోహదపడుతుంది’ అని నిర్మొహమాటంగా సమాధానమిచ్చారాయన. ఆయన పాత్రికేయులతో చెప్పిన మరిన్ని సంగతులివి...

బిజినెస్ అంతా మాదే...
‘పోకిరి’ తర్వాత మహేష్‌బాబు, నా కాంబినేషన్‌లో ‘బిజినెస్8మేన్’ సినిమా రావడం వల్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ ఈ సినిమా ఫుల్ బిజినెస్8 చేస్తోంది. రాజమంవూడిలో ఎంతటి రెస్పాన్స్ వస్తుందో చికాగోలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్‌బాబు అభిమానులందరూ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల వైజాగ్‌లో సినిమా చూస్తే కృష్ణగారి అభిమానులు మా అబ్బాయికి మంచి హిట్ ఇచ్చావని ప్రశంసించారు.

అందుకే డైలాగ్స్ నచ్చాయి...
సినిమాలో హీరో సమాజానికి వ్యతిరేకంగా వుంటాడు. అందుకే అతను చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ చెప్పిన సంభాషణల్లో నా వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ముక్కుసూటి సంభాషణలు ఎలా రాశారని చాలా మంది అడుగుతున్నారు...దానికి సమాధానం ఒకటే...నేనే కాదు జీవితంలో మోసపోయిన వాడు ఎవడైనా సరే ఇలాంటి సంభాషణలు రాస్తాడు. సినిమాలో మహేష్ ముంబయ్‌ని ‘?చ్ఛ’ పోయించడానికి వచ్చానంటాడు. ఆ డైలాగ్‌లో ఆలోచిస్తే ఎంతో లోతు వుంది. ఏ రంగంలోనైనా సరే ఒకర్ని ‘?చ్ఛ’ పోయించాలనే కసి వున్నప్పుడు పోటీ తత్వం వస్తుంది. అప్పుడు అందరూ వ్యక్తిగతంగా డెవలప్ అవుతారు. అందరికీ స్వార్థం వుండాలి. ఈగో వుండాలి.నేను నమ్మే ఫిలాసఫీ అదే. ఆ కోణంలో నుంచే సంభాషణలు రాశాను..ఇవే అంశాల్ని మహేష్‌బాబు పాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేశాను.

అది మహేష్‌బాబుకే సాధ్యం...
ఇలాంటి స్క్రిప్ట్, డైలాగ్స్ వున్న సినిమాలో కొత్త హీరోలు ఎవరైనా నటిస్తే సినిమా ఇలా వుండేది కాదు. మహేష్‌బాబు స్టార్‌డమ్ ఈ కథకు బాగా ఉపయోగపడింది. ఇరవై రోజులు షూటింగ్ జరిగిన తర్వాత మహేష్‌బాబుకు కథ చెప్పాను. అయినా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా పాత్రలో జీవించాడు. నేను అనుకున్న దానికి పదింతలు మహేష్ పాత్రకు న్యాయం చేశాడు. సీన్ పేపర్ చూడకుండానే భారీ డైలాగ్స్‌ని కూడా సింగిల్ చెప్పాడు. రెండున్నర గంటలు ఓ మనిషి డైలాగ్‌లు చెబుతుంటే ప్రేక్షకులు ఓపిగ్గా వింటున్నారంటే ఆ క్రెడిట్ మహేష్‌బాబుదే. సినిమాలో 99 శాతం సన్నివేశాల్ని మహేష్ సింగిల్ చేశాడు. అందుకే 72 రోజుల్లో సినిమాను పూర్తిచేయగలిగాం.

రికార్డ్స్ బ్రేక్ అవుతూనే వుండాలి...
పరిక్షిశమలో ఒకరి రికార్డులు ఒకరు బ్రేక్ చేసుకుం పరిక్షిశమకు మంచిది. అందరూ ఒకర్ని మించి ఒకరు మంచి హిట్ ఇవ్వాలనే తపనతో సినిమాలు తీయాలి. అలాంటి దృక్పథం పరిక్షిశమకు మేలు చేస్తుంది. వ్యక్తిగతంగా మనకు కూడా సంతృప్తి లభిస్తుంది.

మహేష్‌బాబుతో బిజినెస్ మేన్ 2
బిజినెస్ మేన్ సీక్వెల్‌గా మహేష్‌బాబుతో ‘బిజినెస్8మేన్ 2’ సీక్వెల్ వుంటుంది. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుంది. అలాగే హిందీలో బిజినెస్8మేన్ చిత్రాన్ని రీమేక్ చేసే సన్నాహాల్లో వున్నాం. హీరో ఎవరనేది త్వరలో చెబుతాను. అలాగే ‘బిజినెస్8మేన్’ సినిమా స్క్రిప్ట్, డైలాగ్స్‌తో ఓ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాం. త్వరలో ఆ పుస్తకాన్ని విడుదల చేస్తాం. 1960లో ‘తోడి కోడళ్లు’ సినిమా స్క్రిప్ట్‌తో ఓ పుస్తకం వచ్చింది. అదే స్ఫూర్తితో బిజినెస్8మేన్ స్క్రిప్ట్ బుక్‌ను తయారుచేశాను. రవితేజతో ‘ఇడియట్ 2’ సినిమా త్వరలో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌తో ఓ సినిమా వుంటుంది. ఈ రెండు సినిమాల తర్వాతో, లేదా మధ్యలో హిందీ బిజినెస్ మేన్ సినిమా వుంటుంది.

మీడియాలో నేను కూడా...
నా సినిమాల్లో మీడియా మీద కామెంట్స్ ఎక్కువగా వుంటాయంటారు..అయితే అవి ఉద్దేశ్యపూర్వకంగా చేసేవి కావు. నేను కూడా మీడియాలో ఒక భాగంగానే ఫీలవుతాను.

BusinessMan in Post Production



మహేష్ ,కాజల్ జంటగా ఆర్.ఆర్ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌వూపొడక్షన్ వర్క్‌లో భాగంగా రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళంలో ఆడియో విడుదల చేస్తున్నాం. జనవరి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం.

‘పోకిరి’ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో సూర్యగా మహేష్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభిస్తోంది. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు’ అన్నారు. ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్8, ఛాయాక్షిగహణం: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్, ఎస్8.ఆర్.శేఖర్.

Business Man Shooting Completed

ఆరు నెలల క్రితం ‘బిజినెస్‌మేన్’ ఓపెనింగ్ రోజున ‘‘2012 జనవరి 11న ‘బిజినెస్‌మేన్’ని విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు పూరీజగన్నాథ్. అన్నమాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో... డిసెంబర్ 10 నాటికే షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా పూరీ తెలియజేశారు. ‘‘మహేష్‌బాబు ఈ సినిమా కోసం 65 రోజులు పనిచేశారు. కాజల్ 30 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం 74 రోజుల్లో 84వేల అడుగుల ఎక్స్‌పోజర్‌తో అనుకున్న ప్రకారం పర్‌ఫెక్ట్‌గా షూటింగ్‌ని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయగలిగానంటే దానికి కారణం యూనిట్ సభ్యుల సపోర్టే.

‘పోకిరి’ తర్వాత నేను, మహేష్ కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరి అంచనాలనూ అందుకునే విధంగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ పాత్ర పేరు ‘సూర్య’. హీరోయిజాన్ని పీక్ లెవల్‌కి తీసుకెళ్లే విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే మహేష్, కాజల్‌పై చిత్రీకరించిన పాటలు కూడా కలర్‌ఫుల్‌గా వచ్చాయి. ఇప్పటివరకూ విడుదల చేసిన రెండు టీజర్స్‌కీ అద్భుతమైన స్పందన వస్తోంది. తమన్ ఈ సినిమాకు వినసొంపైన బాణీలను అందించారు.

డిసెంబర్ 22న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ‘బిజినెస్‌మేన్’ పాటలను విడుదల చేయనున్నాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జనవరి 11న సినిమా విడుదల చేస్తాం’’ అని పూరీజగన్నాథ్ చెప్పారు. ప్రకాష్‌రాజ్, సయాజీషిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: వెంకట్, నిర్మాణం: ఆర్.ఆర్.మూవీ మేకర్స్.

Mahesh Sukumars Movie On sets from March 2012

మహేష్‌బాబుతో తాజాగా ‘దూకుడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు రామ్‌అచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తదుపరి చిత్రాన్ని కూడా మహేష్‌బాబు కథానాయకుడిగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభకానున్నట్లు సమాచారం. దిల్‌రాజ్ నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Bussiness Man Audion On 22nd December

మహేష్ కథానాయకుడిగా ఆర్. ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్‌మెన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం కోసం బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ నెల 2 నుంచి 10 వరకు జరిగే ప్యాచ్‌వర్క్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి భాగం రీ-రికార్డింగ్ ప్రారంభమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్‌లకు సంబంధించిన ఆడియోని విడుదల చేయబోతున్నాం. జనవరి 11న అత్యధిక థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మహేష్, పూరి జగన్నాథ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను పాడటం విశేషం. ‘పోకిరి’లో పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు స్థాయిలో ‘బిజినెస్‌మెన్’లోని డైలాగ్స్ పాపులర్ అవుతాయి. మహేష్ కెరీర్‌లో ‘బిజినెస్‌మెన్’ మరో పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది’ అన్నారు. కాజల్ పకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్.ఎస్, సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్

Mahesh Singing in Businessman

సినీ పరిక్షిశమలో కథానాయకులు నటిస్తూనే కొత్త శాఖల్లోనూ తమ ప్రతిభని చూపించడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ తరం క్రేజీ హీరోలైన పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌లు తెరపై జిమ్మిక్కులు చేస్తూనే సింగర్లుగానూ తమ గాన కౌశలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. త్వరలోనే మహేష్ వీరి జాబితాలో చేరనున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి మహేష్ ఓ థీమ్‌సాంగ్‌ను ఆలపిస్తున్నాడట. ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం గొంతు సవరించని మహేష్ తొలిసారి ‘బిజినెస్‌మెన్’ చిత్రం కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం.మహేష్ గీతాలాపన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌లో మూడు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారని సమాచారం.

Bussiness Man audio on 23 Dec

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నారు. దినేష్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్‌ చేసి నన్ను కనఫ్యూజ్‌ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.
 


ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తాం. వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌లో మహేష్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ తదితరులు పాల్గొనే సన్నివేశాల్ని చిత్రీకరిస్తాం. డిసెంబరు 23న పాటల్ని విడుదల చేస్తామ''ని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె నాయుడు, సంగీతం: తమన్‌.

Mahesh Pairing with Tamanna

దటీజ్‌ మహాలక్ష్మీ... అంటూ '100% లవ్‌' సినిమాలో తమన్నా పాత్రని తీర్చిదిద్దారు సుకుమార్‌. అందం, తెలివితేటలు కలబోసిన మరదలి పిల్లగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. మరోసారి ఆ భామనే కథానాయికగా ఎంచుకొన్నట్లు తెలిసింది. మహేష్‌బాబు - సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయిక పాత్ర తమన్నాకి దక్కింది.

 
ప్రస్తుతం మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తికాగానే సుకుమార్‌ చిత్రం సెట్స్‌ మీదకు వెళుతుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Mahesh New Movie in Vijayanthi Movies Banner

భారీ చిత్రాలకు చిరునామా... ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ బేనరు నుంచి సినిమా అంటే... సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు అధికంగా ఉంటాయి. అటువంటిది మహేష్‌బాబుతో సినిమా అంటే ఇక చెప్పనవసరంలేదు. అందులోనూ ‘దూకుడు’ వంటి సంచలన విజయం తర్వాత సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపుగా ఉంటాయి.

ఇక ఆ చిత్రానికి క్రియేటివ్ డెరైక్టర్ ‘క్రిష్’ అంటే ‘క్రేజియస్ట్ సినిమా’ అని చెప్పాల్సివస్తుంది. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ఓ భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందనుంది అని తెలిసింది. కృష్ణ కెరీర్‌లో ఓ ‘అల్లూరి సీతారామరాజు’లా మహేష్ కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. మహేష్ ఇప్పటివరకూ చేయని కొత్తరకం ఫీట్ ఈ సినిమాలో చేస్తున్నారట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు చేయబోవడం మరో అదనపు ఆకర్షణ. ఈ సినిమా ద్వారా తొలిసారి మహేష్‌బాబు సినిమాకి కీరవాణి సంగీతం అందించబోవడం మరో విశేషం. ఈ చిత్రానికి ‘తిరు’ ఛాయాగ్రాహణం అందిస్తారు. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఇది మొదలవుతుంది.

Dookudu 50 days Celebrations

''దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా యాభై రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంద''న్నారు.
 కృష్ణ ప్రసంగిస్తూ ''అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు. దూకుడు చిత్రం తప్పకుండా ఓ అద్భుతమే. మహేష్‌ చిన్నతనం నుంచే ప్రతి షాట్‌లో డూప్‌లు లేకుండా నటించటానికి తాపత్రయపడేవాడ''న్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ 'నేను కృష్ణ అభిమానిని. మహేష్‌ను మొదటి నుంచి గమనించేవాడిని. ఆయన ఇమేజ్‌కు సరిపడే కథతోనే సినిమా తీశాను'' అన్నారు. ''నేను ఏ సినిమా అయినా ఒకసారే చూస్తాను. దూకుడు చిత్రాన్ని మూడుసార్లు చూశాను. మహేష్‌ అందం, నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఎన్టీఆర్‌ ప్రధానమంత్రి కావాలన్న అందరి ఆశని దర్శకుడు ఈ చిత్రంలో నిజం చేశార''న్నారు విజయనిర్మల. సినిమాలో మహేష్‌, చిత్ర కథానాయిక సమంత ధరించిన వస్త్రాలను 'మా' ఆధ్వర్యంలో వేలం వేయగా తిరుపతికి చెందిన మధుసూదనరెడ్డి, ప్రిన్స్‌మహేష్‌.కామ్‌ రవి వాటిని కొనుగోలు చేశారు. వారికి ఆ దుస్తులను వేదికపై మహేష్‌, సమంత అందజేశారు. చిత్ర బృందానికీ, పంపిణీదారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, జి.ఆదిశేషగిరిరావు, సి.అశ్వనీదత్‌, సాగర్‌, సురేష్‌బాబు, డా||కేఎల్‌ నారాయణ, సమంత, సుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates