BusinessMan in Post Production

మహేష్ ,కాజల్ జంటగా ఆర్.ఆర్ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్8మేన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌వూపొడక్షన్ వర్క్‌లో భాగంగా రీ రికార్డింగ్ జరుగుతోంది. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళంలో ఆడియో విడుదల చేస్తున్నాం. జనవరి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ‘పోకిరి’ తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో సూర్యగా మహేష్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభిస్తోంది. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు’ అన్నారు....

Business Man Shooting Completed

ఆరు నెలల క్రితం ‘బిజినెస్‌మేన్’ ఓపెనింగ్ రోజున ‘‘2012 జనవరి 11న ‘బిజినెస్‌మేన్’ని విడుదల చేస్తాం’’ అని ప్రకటించారు పూరీజగన్నాథ్. అన్నమాటను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో... డిసెంబర్ 10 నాటికే షూటింగ్‌ని పూర్తి చేశారాయన. ఈ విషయాన్ని ఆదివారం ఓ ప్రకటన ద్వారా పూరీ తెలియజేశారు. ‘‘మహేష్‌బాబు ఈ సినిమా కోసం 65 రోజులు పనిచేశారు. కాజల్ 30 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. కేవలం 74 రోజుల్లో 84వేల అడుగుల ఎక్స్‌పోజర్‌తో అనుకున్న ప్రకారం పర్‌ఫెక్ట్‌గా షూటింగ్‌ని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద సినిమాను రికార్డ్ టైమ్‌లో పూర్తి చేయగలిగానంటే దానికి కారణం యూనిట్ సభ్యుల సపోర్టే. ‘పోకిరి’ తర్వాత నేను, మహేష్ కలిసి పనిచేస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందరి అంచనాలనూ అందుకునే విధంగా సినిమా ఉంటుంది. ఇందులో మహేష్ పాత్ర పేరు ‘సూర్య’. హీరోయిజాన్ని పీక్ లెవల్‌కి తీసుకెళ్లే విధంగా ఆయన...

Mahesh Sukumars Movie On sets from March 2012

మహేష్‌బాబుతో తాజాగా ‘దూకుడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతలు రామ్‌అచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తదుపరి చిత్రాన్ని కూడా మహేష్‌బాబు కథానాయకుడిగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభకానున్నట్లు సమాచారం. దిల్‌రాజ్ నిర్మిస్తున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో కూడా మహేష్‌బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. జనవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుం...

Bussiness Man Audion On 22nd December

మహేష్ కథానాయకుడిగా ఆర్. ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘బిజినెస్‌మెన్’. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం కోసం బ్యాంకాక్, పటాయ, క్రాబిలలో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ ఈ నెల 2 నుంచి 10 వరకు జరిగే ప్యాచ్‌వర్క్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి భాగం రీ-రికార్డింగ్ ప్రారంభమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరుకు తొలికాపీ సిద్ధం చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. ఈ నెల 22న తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్‌లకు సంబంధించిన ఆడియోని విడుదల చేయబోతున్నాం. జనవరి 11న అత్యధిక థియేటర్లలో ‘బిజినెస్‌మెన్’ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మహేష్, పూరి జగన్నాథ్ ఈ చిత్రంలోని థీమ్ సాంగ్‌ను పాడటం విశేషం. ‘పోకిరి’లో పూరి జగన్నాథ్ డైలాగ్స్ ఎలా ప్రాచుర్యం పొందాయో అంతకు రెట్టింపు...

Mahesh Singing in Businessman

సినీ పరిక్షిశమలో కథానాయకులు నటిస్తూనే కొత్త శాఖల్లోనూ తమ ప్రతిభని చూపించడానికి ప్రయత్నించిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ తరం క్రేజీ హీరోలైన పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌లు తెరపై జిమ్మిక్కులు చేస్తూనే సింగర్లుగానూ తమ గాన కౌశలాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. త్వరలోనే మహేష్ వీరి జాబితాలో చేరనున్నాడు. ప్రస్తుతం ఆయన పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి మహేష్ ఓ థీమ్‌సాంగ్‌ను ఆలపిస్తున్నాడట. ఇప్పటి వరకు ఏ చిత్రం కోసం గొంతు సవరించని మహేష్ తొలిసారి ‘బిజినెస్‌మెన్’ చిత్రం కోసం గాయకుడిగా మారుతుండటం విశేషం.మహేష్ గీతాలాపన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ‘బిజినెస్‌మెన్’ చిత్రం జనవరి 11న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రం ఆడియోని డిసెంబర్‌లో మూడు...

Bussiness Man audio on 23 Dec

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల్ని తెరకెక్కిస్తున్నారు. దినేష్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''మహేష్‌-పూరి కలయికలో 'పోకిరి' తర్వాత వస్తున్న చిత్రమిది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం రూపొందుతోంది. మహేష్‌ నటన, హావభావాలు ఇందులో ప్రత్యేకంగా ఉంటాయి. ముంబయిలో చిత్రీకరించిన యాక్షన్‌ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. 'ఇలా రౌండప్‌ చేసి నన్ను కనఫ్యూజ్‌ చేయొద్దు. ఎందుకంటే కన్‌ఫ్యూజ్‌లో ఎక్కువ కొట్టేస్తాను' అనే సంభాషణతో ఇటీవల విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి స్పందన లభించింది.   ఈ నెలాఖరు వరకు బ్యాంకాక్‌లో...

Mahesh Pairing with Tamanna

దటీజ్‌ మహాలక్ష్మీ... అంటూ '100% లవ్‌' సినిమాలో తమన్నా పాత్రని తీర్చిదిద్దారు సుకుమార్‌. అందం, తెలివితేటలు కలబోసిన మరదలి పిల్లగా ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకొంది. మరోసారి ఆ భామనే కథానాయికగా ఎంచుకొన్నట్లు తెలిసింది. మహేష్‌బాబు - సుకుమార్‌ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కథానాయిక పాత్ర తమన్నాకి దక్కింది.   ప్రస్తుతం మహేష్‌బాబు 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. ఇది పూర్తికాగానే సుకుమార్‌ చిత్రం సెట్స్‌ మీదకు వెళుతుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ...

Mahesh New Movie in Vijayanthi Movies Banner

భారీ చిత్రాలకు చిరునామా... ‘వైజయంతీ మూవీస్’ సంస్థ. ఈ బేనరు నుంచి సినిమా అంటే... సహజంగానే ప్రేక్షకుల్లో అంచనాలు అధికంగా ఉంటాయి. అటువంటిది మహేష్‌బాబుతో సినిమా అంటే ఇక చెప్పనవసరంలేదు. అందులోనూ ‘దూకుడు’ వంటి సంచలన విజయం తర్వాత సినిమా అంటే ఆ అంచనాలు రెట్టింపుగా ఉంటాయి.ఇక ఆ చిత్రానికి క్రియేటివ్ డెరైక్టర్ ‘క్రిష్’ అంటే ‘క్రేజియస్ట్ సినిమా’ అని చెప్పాల్సివస్తుంది. ఇప్పటివరకూ తెలుగుతెరపై రాని ఓ భిన్నమైన బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రం రూపొందనుంది అని తెలిసింది. కృష్ణ కెరీర్‌లో ఓ ‘అల్లూరి సీతారామరాజు’లా మహేష్ కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. మహేష్ ఇప్పటివరకూ చేయని కొత్తరకం ఫీట్ ఈ సినిమాలో చేస్తున్నారట.ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు చేయబోవడం మరో అదనపు ఆకర్షణ. ఈ సినిమా ద్వారా తొలిసారి మహేష్‌బాబు సినిమాకి కీరవాణి సంగీతం అందించబోవడం మరో విశేషం. ఈ చిత్రానికి...

Dookudu 50 days Celebrations

''దూకుడు చిత్రం ఇన్ని రికార్డులు సాధించటానికి అభిమానులే కారణం. నాన్నను అభిమానించినవాళ్లే నాకు అభిమానులుగా మారటం అదృష్టం'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ సినిమా యాభై రోజుల వేడుకను విజయవాడలో నిర్వహించారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ కార్యక్రమానికి కృష్ణ, మహేష్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ''విజయవాడలో నేను రెండోసారి విజయోత్సవాన్ని చేసుకొంటున్నాను. ఇంతమంది ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరచిపోలేను. దూకుడు చిత్రంలో నటించడం మంచి అనుభవం. అందరూ తదుపరి సినిమా గురించి అడుగుతున్నారు. అదీ త్వరలోనే మీ ముందుకు వస్తుంద''న్నారు.  కృష్ణ ప్రసంగిస్తూ ''అద్భుతాలను ఎవరూ ముందుగా గుర్తించలేరు. గుర్తించిన తరవాత ఒప్పుకోక తప్పదు. దూకుడు...

Bussiness Man First Look is Out

‘ఇలా రౌండప్ చేసి నన్ను కన్‌ఫ్యూజ్ చేయొద్దు...ఎందుకంటే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కు కొట్టేస్తాను’ ఇది మహేష్‌బాబు ‘బిజినెస్‌మేన్’ ఫస్ట్ లుక్ ట్రైలర్స్‌లో ఓ డైలాగ్...ఈ డైలాగ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శుక్రవారం ఈ సినిమాకి సంబంధించిన తొలి స్టిల్‌ను విడుదల చేశారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహ నిర్మాత వి.సురేష్‌డ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ముంబాయ్ నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ 8 లోగా చిత్రీకరణ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చేస్తాం. జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్‌లో ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమాని విడుదల చేస్తాం’ అన్నారు....

Krrish Directing Mahesh ?

కథల ఎంపికలో మహేష్‌బాబు వేగం పెంచారు. ప్రస్తుతం 'బిజినెస్‌మేన్‌' చిత్రీకరణలో ఉన్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లోనూ నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఇప్పుడు మరో కొత్త కథకు పచ్చజెండా ఊపేశారు. ఈ కథను దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. కథాంశం, మహేష్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటాయని తెలిసింది. ఇందులో ముగ్గురు నాయికలుంటారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. సుకుమార్‌ చిత్రం తరవాత క్రిష్‌ సినిమా మొదలవుతుంది.  కృష్ణం వందే జగద్గురుమ్‌: మహేష్‌ చిత్రానికంటే ముందు క్రిష్‌ 'కృష్ణం వందే జగద్గురుమ్‌' రూపొందిస్తారు. ఇందులో రానా దగ్గుబాటి కథానాయకుడు. ఈ సినిమాని ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తారు. ఈ నెల 27 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారు. కథానాయికను ఇంకా ఎంపిక...

Dhookudu 50 days function on November 12

పోకిరి’ తర్వాత ‘దూకుడు’తో మళ్లీ తన సత్తాను చాటుకున్న అందాల నటుడు మహేష్‌బాబు ఇప్పుడు ఆనందసాగరంలో మునిగివున్నారు. బాక్సాఫీసు రికార్డులను తనదైన శైలిలో తిరగరాయడమే కాకుండా, అమెరికా వంటి విదేశాల్లో కూడా అత్యధిక వసూళ్లతో తెలుగు సినిమా ‘స్టామినా’ని ‘దూకుడు’తో తెలియజెప్పారు మహేష్. ఇలాంటి సక్సెస్ కోసమే సూపర్‌స్టార్ అభిమానులు ఇంతకాలం ఎదురుచూశారు. తెలుగు చిత్రపరిశ్రమ కూడా ఇటువంటి విజయాలను ఆశిస్తూ వచ్చింది. ఈ సినిమాకు లభించిన విజయాన్ని అంచనా వేసే పనిలో సినీ పండితులున్నారు. 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల వరకూ ఈ చిత్రం వసూలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ ‘మగధీర’ అత్యధిక సొమ్ము వసూలు చేసిన చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు సాధించింది. మరి ‘దూకుడు’ ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుస్తుంది....

Bussiness man first look on 11 Nov

‘దూకుడు’ చిత్రంతో యమదూకుడు మీదున్న కథానాయకుడు మహేష్‌బాబు ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘బిజినెస్‌మెన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ముంబైలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో తక్కువరోజుల్లో పూర్తి కాబోతోంది. ఇటీవల విడుదలైన ‘దూకుడు’ చిత్రం సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘బిజినెస్‌మెన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 11న ఫస్ట్‌లుక్ విడుదల చేసి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఇందుమతి’ ఫేమ్ శ్వేతా భరద్వాజ్...

Bussiness Man Relasing on Sankranthi

 మహేష్‌బాబు తన మార్కెట్‌ని ఇతర భాషలకీ విస్తరించబోతున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొస్తుంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ...

Business Man in Goa

'కొడితే ఒక్కొక్కడికీ బల్బులు పగిలిపోవాలి...' - అంటూ 'దూకుడు'లో తనదైన శైలిలో యాక్షన్‌లో వినోదం మేళవించారు మహేష్‌బాబు. ఇప్పుడు అచ్చమైన వ్యాపారవేత్త ఎలా ఉంటాడో చూపించబోతున్నారు. మహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ''మహేష్‌- పూరి జగన్నాథ్‌ కలయికలో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మాకు తెలుసు. వాటికి ఏ మాత్రం తగ్గని విధంగా ఈ సినిమా ఉంటుంది. మహేష్‌ పాత్రని తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలో స్పెయిన్‌లో మూడు పాటలు చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నామ''ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన...

Mahesh Pairing with Tammanna ?

‘శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఢీ’ చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుందా..! ‘ఢీ’ చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్‌బాయ్‌లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్‌లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి..! అయితే తాజాగా ఈ మిల్క్‌బాయ్‌తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్‌బాయ్, మిల్కీవైట్‌భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల ‘100 పర్సెంట్ లవ్’తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు. ఇటీవలే మహేష్‌తో ‘దూకుడు’ వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని...

Business Man Guns Dont Need Agrement

 'దూకుడు' ఎలా ఉంటుందో ఈ మధ్యే చూపించారు మహేష్‌బాబు. ఆ విజయాన్ని ఆస్వాదిస్తూనే 'బిజినెస్‌మేన్‌'గా మారిపోయారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమది. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత.  ప్రస్తుతం ముంబైలో ఓ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈనెల 27 నుంచి గోవాలో పతాక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''తుపాకీలకు ఒప్పందాలతో పనిలేదు. మనుషుల కన్నా.. బుల్లెట్లే ఎక్కువగా మాట్లాడతాయి. ఆ తరహా నేపథ్యంలో జరిగే కథ ఇది. యాక్షన్‌ అంశాలతోపాటు వినోదం కూడా మేళవించాం. మహేష్‌తో సినిమా తీస్తున్నానంటే అందరికీ 'పోకిరి' సినిమానే గుర్తొస్తుంది. ఇకపై మహేష్‌తో మరో సినిమా చేస్తే 'బిజినెస్‌మేన్‌' గుర్తుకు వస్తుంద''ని చెప్పారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నా...

Krrish Directing Mahesh ?

‘దూకుడు’గా సినిమాలు చేస్తూ శిఖరాగ్రానికి దూసుకుపోతున్న మహేష్... మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి పచ్చజెండా ఊపారు. గమ్యం, వేదం, వానమ్ (తమిళం) చిత్రాలతో దక్షిణాదిన క్రేజీ దర్శకుడిగా భాసిల్లుతోన్న క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) దర్శకత్వంలో ఆయన ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలిసింది. అగ్రతారలతో అనేక విజయవంతమైన చిత్రాలు చేసిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం మహేష్ ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని సమాచారం. రానా కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది. పక్కా...

dookudu dresses for auction

‘‘వరుస పరాజయాలతో డీలా పడ్డ తెలుగు సినిమాకు ఊపిరులూదిన చిత్రం ‘దూకుడు’. మన రాష్ట్రంలోనే కాక అమెరికాలో కూడా ఒక ప్రభంజనంలా దూసుకుపోతోందీ సినిమా. వసూళ్ల విషయంలో ‘మగధీర’ను కూడా అధిగమించి ముందుకు పోతోంది. ఎనభై కోట్ల వసూళ్ల అంచనాలు దాటి వంద కోట్ల అంచనాలకు చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఈ సినిమా మహేష్ ఇమేజ్‌ని ఏ స్థాయికి తీసుకెళ్లిందంటే... ఓ వెబ్‌సైట్ నిర్వహించిన పోల్‌లో ప్రపంచవ్యాప్తంగా యాభై మంది సెలబ్రిటీల్లో 12వ స్థానంలో మహేష్ నిలిచాడు’’ అని తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు మురళీమోహన్ చెప్పారు. ‘దూకుడు’ చిత్రంలోని క్లయిమాక్స్ సాంగ్‌లో మహేష్, సమంత ధరించిన దుస్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) వేలానికి పెట్టింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళీమోహన్ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘‘గతంలో విజయం సాధించిన కొన్ని సినిమాల్లోని...

Puri Khaidi with Mahesh Babu

 ప్రముఖ కథానాయకుడు చిరంజీవి కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన చిత్రం ‘ఖైదీ’. ఈ చిత్రమే చిరంజీవిను స్టార్ హీరోని చేసింది. కోదండరామిడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి అందరికి తెలిసిందే. ఇక తాజాగా ఈ మైల్‌స్టోన్ చిత్రాన్ని యువ కథానాయకుడు మహేష్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ రీమేక్ చేయనున్నాడని తెలిసింది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరిచాడు. ‘ మహేష్, పూరీ కాంబినేషన్‌లో చిరంజీవి ‘ఖైదీ’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారనే గొప్ప న్యూస్‌ను నేను విన్నాను. జగన్ చెప్పిన మహేష్ పాత్రతో కంపేర్ చేస్తే కోదండరామిడ్డి డిజైన్ చేసిన చిరంజీవి పాత్ర నథింగ్’ అంటూ వర్మ తన ట్విట్టర్‌లో పొందుపరచడం విశేషం. ఇక ఈ వార్త తెలుగు సినీ పరిక్షిశమలో తప్పకుండా హాట్‌టాపిక్‌గా మారుతుందనే విషయాన్ని ప్రత్యేకంగా...

Dhookudu Success Meet With Mahesh

‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’ చిత్రంతో 75 సంవత్సరాల సినీ చరివూతను తిరగరాసిన ప్రముఖ యువ కథానాయకుడు మహేష్‌బాబు ఈ సారి ‘దూకుడు’గా వచ్చి 80 ఏళ్ళ తెలుగు సినీ చరివూతలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ‘దూకుడు’ సూపర్‌హిట్ అనే విషయాన్ని మైండ్‌లో ఫిక్స్ చేసుకొని దర్శకుడు శ్రీనువైట్ల ప్రతిభను బ్లెండ్‌గా నమ్మి వెళ్ళిన ఈ క్రేజీ కథానాయకుడి ‘దూకుడు’ సినిమాని ఇప్పుడు దునియా మొత్తం కనులపండువగా చూస్తుంటే దిల్‌ఖుష్‌గా వున్నాడు మహేష్. ఒకవైపు ‘బిజినెస్ మేన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా వుంటూనే మరోవైపు ‘దూకుడు’ విజయాన్ని ఆస్వాదిస్తున్న మహేష్ సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నాడు’ ఈ వేడుకకు సూపర్‌స్టార్ కృష్ణదంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేకార్షణగా నిలిచారు....

Mahesh is about his future projects

తెలుగు సినిమాకి వసూళ్ల పండగ తీసుకొచ్చిన కథానాయకుడు మహేష్‌బాబు. 'దూకుడు' సినిమాతో తెలుగు సినిమా సత్తా ఏమిటో చూపారు. ''చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు చాలా సంతృప్తినిస్తోంది. ప్రేక్షకుల ప్రతిస్పందనను ప్రత్యక్షంగా చూడాలనిపిస్తోంది. కానీ 'బిజినెస్‌ మేన్‌' చిత్రీకరణ కోసం ముంబై వెళ్లాల్సొచ్చింది. ఇకపై కూడా ఇలాగే అందరూ మెచ్చే సినిమాల్లో నటించాలని ఉంద''ని చెబుతున్న మహేష్‌బాబు ఇటీవల హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... ''ఒక సినిమాలో ఒకే రకమైన పాత్ర పోషిస్తే ఇమేజ్‌ సమస్యలు ఎదురవుతాయి. ఆ ప్రభావం తరువాతి సినిమాలపై కూడా పడుతుంటుంది. 'పోకిరి' విషయంలో నాకదే జరిగింది. 'దూకుడు' సినిమా ఇమేజ్‌కి దూరంగా నడిచింది. అందరికీ చేరే కథతో తెరకెక్కింది. ప్రారంభ సన్నివేశం నుంచి చివరి వరకూ వినోదమే ప్రధానంగా సాగుతుంది. ఇలాంటి కథల్లో నటించటం చాలా కష్టం....

Dookudu Success Interview With Mahesh

మహేష్‌బాబు మంచి దూకుడు మీద ఉన్నారు. ‘దూకుడు’ సంచలన విజయం ఆయనలో నూతనోత్తేజాన్ని రగిల్చింది. చాలా రోజుల తర్వాత ఆయన మీడియాతో మనసు విప్పి మాట్లాడారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘దూకుడు’ సక్సెస్‌మీట్‌లో మహేష్ సందడి చేశారు. ముంబయిలో ‘ద బిజినెస్‌మ్యాన్’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్న మహేష్, ఈ సక్సెస్ మీట్ కోసమే హైదరాబాద్ వచ్చారు. ‘దూకుడు’ విజయం గురించి సూపర్‌స్టార్ కృష్ణ భావోద్వేగంగా ప్రసంగిస్తుంటే మెరిసే కళ్లతో తండ్రి సంతోషాన్ని తనివితీరా ఆస్వాదించారు. ఈ సందర్భంగా మీడియాతో తన అనుభూతుల్ని పంచుకున్నారు మహేష్. ఈ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు? ఇంకా పూర్తిగా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాను కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఇది యూనివర్శల్ స్క్రిప్ట్. నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్. ఇందులో అన్ని అంశాలు ఉన్నాయి. నా కెరీర్‌లోనే ‘దూకుడు’ బెస్ట్...

Dookudu Becoming Industry Biggest Hit

''పోకిరి సినిమా చూశాక 'ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పా. నేను చెప్పినట్టుగానే ఆ సినిమా బాగా ఆడింది. 'దూకుడు' చూశాక రూ.80 కోట్లు రాబట్టుకొంటుందని చెప్పాను. ఆ సంఖ్య వంద కోట్ల మార్కుకి చేరుకొనేలా ఉంద''న్నారు కృష్ణ. ఆయన తనయుడు మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. ఈ చిత్ర విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ''ఈ సినిమా బాగా ఆడడానికి చాలా కారణాలున్నాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా తీర్చిదిద్దారు. దర్శకత్వం, సంభాషణలు, పాటలు అన్నీ బాగున్నాయి. థియేటర్‌కి వచ్చినవాళ్లు శుభం కార్డు వరకూ నవ్వుతూనే ఉన్నారు. మహేష్‌ చాలా అందంగా కనిపించాడ''ని చెప్పారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''దూకుడు సినిమా ఈ స్థాయిలో ఆడడానికి కారణం శ్రీను వైట్ల. ఈ కథ చెబుతున్నప్పుడు ఓ మాట అన్నారు.. 'సూపర్‌ హిట్‌ తీస్తా. లేదంటే బ్లాక్‌బస్టర్‌ సినిమా తీస్తా'....

Mahesh Bussiness Man Title Song Shooting at Delhi

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బిజినెస్‌మేన్‌'. కాజల్‌ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని తీర్చిదిద్దారు. అందులో కథానాయకుడిపై పరిచయ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''మహేష్‌బాబు శైలికి తగ్గ కథాంశమిది. వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగుతుంది. 'పోకిరి' బృందం నుంచి వస్తున్న చిత్రమిది. ప్రేక్షకుల్లో ఉండే అంచనాలను అందుకొనేలా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర, ఆయన పలికే హావభావాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయ''న్నారు. త్వరలోనే హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతారు. సంక్రాంతికి ఈ సినిమా తెర మీదికొస్తుంది. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు....

Seethamma Vakitlo Sirimalle Chettu

తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్‌ అనేది ఓ కల. ఇద్దరు కథానాయకులు కలిసి తెరమీద సందడి చేస్తే చూడాలని సగటు సినీ అభిమాని ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. ఈ నిరీక్షణ ఫలించింది. ఇద్దరు ప్రముఖ కథానాయకులు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ చిత్రమే... 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. వెంకటేష్‌, మహేష్‌బాబు కథానాయకులుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'కొత్తబంగారులోకం' చూపించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురువారం ఉదయం విజయదశమి పర్వదినాన లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. వి.వి.వినాయక్‌ స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి చేతుల మీదుగా శ్రీకాంత్‌ అడ్డాల స్క్రిప్టు అందుకొన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ''వసుధైక...

‘సీతమ్మ వాకిట్లో...’ సూపర్‌స్టార్స్

అందరి దృష్టినీ తమవేపు నిలుపుకునే అసలు సిసలైన మల్టీస్టారర్ చిత్రానికి రంగం సిద్ధమైంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సాక్షిగా ప్రేక్షకుల మనసుల్లో మరుమల్లెలు పూయించడానికి ఇద్దరు అగ్రహీరోలు- వెంకటేష్, మహేష్ రెడీ అయ్యారు. ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరినీ ఒకే స్క్రీన్ మీదకు తీసుకొచ్చిన క్రెడిట్ సంచనల చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజుకు దక్కుతుంది. సరిగ్గా మూడేళ్ల క్రితం ప్రేక్షకులను ‘కొత్తబంగారులోకం’లో విహరింపజేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. అపురూప కలయికలో వస్తున్న ఈ చిత్రానికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ అన్న పేరును పెట్టి, తొలి అడుగులోనే అభినందనలు అందుకుంటున్నారాయన. ఇద్దరు నాయికలు వుండే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంత నటించనున్నట్టు సమాచారం. ‘దూకుడు’లో మహేష్‌బాబు సరసన చేసిన సమంత ఇందులో రెండోసారి ఆయన...

రికార్డు కలెక్షన్ల ‘దుకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన ‘దూకుడు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాతలు సినిమాకి వస్తోన్న కలెక్షన్ల వివరాలు తెలియజేస్తూ ‘మొదటి వారం రోజుల్లోనే 50 కోట్ల 7లక్షలకుపైగా గ్రాస్, 35 కోట్ల 1లక్ష షేర్ సాధించి ఎనభై సంవత్సరాల తెలుగు చలన చిత్ర రికార్డును తిరగరాసింది. నైజాంలో మొదటివారం 12 కోట్ల 51లక్షలు, ఆంధ్రలో 13 కోట్ల 10లక్షలు, సీడెడ్‌లో 6కోట్ల 30 లక్షలు, కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు, ఉత్తర భారతదేశంలో 6 కోట్ల 50 లక్షలకు పైగా వసూళ్లను సాధించింది. విదేశాల్లో 11 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. ఇండియాతో పాటు విదేశాల్లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో ‘దూకుడు’ చిత్ర విజయంపై పత్రికల్లో ప్రత్యేక కథనాలు...

శ్రీను వైట్ల మాటల్లో మహేష్‌బాబు

సాధారణంగా ప్రతి సినిమాలో కథానాయకుడు ఒక్కడే ఉంటాడు. కథంతా అతని చుట్టే తిరుగుతుంది కాబట్టి... థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడి దృష్టి అతని మీదే ఉంటుంది. శ్రీను వైట్ల సినిమాలకు వెళ్లేటప్పుడు ఈ అభిప్రాయాన్ని చెరిపేసుకోవచ్చు. ఎందుకంటే... సన్నివేశం ఓ హీరోలా కనిపిస్తుంది. అందులో కనిపించే ప్రతీ పాత్రా వినోదం పండించడానికి పోటీపడుతుంది. ఓ వైపు కథానాయకుడు ఆటాడించేస్తూనే ఉంటాడు. ఎక్కడా మాస్‌, యాక్షన్‌ తగ్గనీయడు. మరో వైపు మెక్‌డొనాల్డ్‌ మూర్తో, చికాగో సుబ్బారావో, బొక్కా వెంకట్రావో... చక్కిలిగింతలు పెట్టేస్తుంటాడు. తాజాగా మహేష్‌బాబు 'దూకుడు'ని తన శైలిలో చూపించి వినోదం పంచారు శ్రీను వైట్ల. ఈ సందర్భంగా ఆయనతో ఈనాడు సినిమా ప్రత్యేకంగా సంభాషించింది. 'దూకుడు' ఫలితం ఎలాంటి అనుభూతినిచ్చింది? 'దూకుడు' విడుదలైన మరునాడే నా పుట్టిన రోజు. ఘన విజయంతో తెలుగు...

అభిమానుల మధ్య మహేష్‌బాబు 'దూకుడు'

మహేష్‌బాబు 'దూకుడు'గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విడుదలైన రోజునే ఆయన తన అభిమానులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. మహేష్‌, నమ్రత దంపతులు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సుదర్శన్‌ థియేటర్‌కి శుక్రవారం ఉదయం వచ్చారు. జి.ఆదిశేషగిరిరావు, శ్రీను వైట్ల, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట తదితరులు కథానాయకుడితో కలిసి చిత్రం చూశారు. మహేష్‌తమతో కలిసి చిత్రం చూడటంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఆయన అందరికీ అభివాదం చేశారు. అలాగే కృష్ణ, విజయనిర్మల సినీమాక్స్‌లో చిత్రం వీక్షించారు. ప్రదర్శన అనంతరం కృష్ణ మాట్లాడుతూ మహేష్‌ నటనను మెచ్చుకొన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపార...

దూకుడు

సంస్థ: 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నటీనటులు: మహేష్‌బాబు, సమంత, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్‌, సాయాజీషిండే, నాజర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర్‌ భరత్‌ తదితరులు సంగీతం: తమన్‌ నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర దర్శకత్వం: శ్రీను వైట్ల విషయం: అజయ్‌(మహేష్‌బాబు)కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవలసిందే. అలా తీసుకొన్న ఓ నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తరవాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి (సమంత) ప్రవేశిస్తుంది. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీద చూసి తెలుసుకోవలసిందే. విశేషాలు: నిర్మాతలు మాట్లాడుతూ ''మహేష్‌బాబు పాత్ర చిత్రీకరణ ప్రధాన ఆకర్షణ. వృత్తిగత జీవితంలో అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఛేదించిన విధానం ఉత్కంఠపరుస్తాయి. ఆయన నటన అందరికీ నచ్చుతుంది. కుటుంబం మొత్తం చూసి ఆనందించేలా...

23న ‘దూకుడు’

మహేష్‌బాబు కథానాయకుడిగా 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘దూకుడు’ చిత్రం ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా చిత్రానికి సెన్సార్ పూర్తికాలేదని, ఎప్పుడు విడుదలవుందో తెలియదనే ఊహాగానాలు వెలువడ్డాయి. వాటన్నింటిని మేము ఖండిస్తున్నాం. చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. ఒక్క నైజాంలోనే దాదాపు 200పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. తొలిసారిగా పైరసీని అరికట్టడానికి కోర్టు ద్వారా ‘జాన్ డో’ ఉత్తర్వులను పొందాము. దీని ప్రకారం మా చిత్ర విజువల్స్‌గానీ, ఆడియోగాని, ఏ రూపంలో అనగా డిజిటల్ ఫార్మెట్‌లోగాని ఆన్‌లైన్ అప్‌లోడింగ్, డౌన్‌లోడింగ్ చేయడం నేరం. ఎవరైనా కోర్టువారి ఉత్తర్వులు ఉల్లంఘించి కాపీరైట్ చౌర్యానికి పాల్పడితే...

ముంబయిలో 'బిజినెస్‌ మేన్‌'

మహేష్‌బాబు - పూరి జగన్నాథ్‌... వీరి పేర్లు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం 'పోకిరి'. ఆ తరవాత వీరి నుంచి వస్తున్న చిత్రం 'బిజినెస్‌ మేన్‌'. ఇందులో కాజల్‌ కథానాయికగా నటిస్తోంది. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''మళ్లీ పోకిరి బృందం నుంచి ఓ సినిమా రావడం ఆనందంగా ఉంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన కథతో బిజినెస్‌ మేన్‌ సిద్ధమవుతోంద''న్నారు. ''ఈ చిత్రంలో మహేష్‌ పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు అందర్నీ ఆకట్టుకుంటాయి. త్వరలో హైదరాబాద్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తామ''న్నారు నిర్మాత. వచ్చే యేడాది జనవరి 12న చిత్రాన్ని విడుదల చేయాలనుకొంటున్నారు. ప్రకాష్‌రాజ్‌, సాయాజీషిండే, నాజర్‌, ధర్మవరపు సుబ్రమణ్యం, బ్రహ్మాజీ, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, సంగీతం: తమన...

‘దూకుడు’లో స్టెప్స్ సూపర్బ్

‘‘టాలీవుడ్ బ్లాక్ బాస్టర్స్‌లో ఒకటిగా రేపు ‘దూకుడు’ నిలువబోతోంది. పెర్‌ఫార్మెన్స్ పరంగా ఇందులో ఓ కొత్త సమంతాను చూస్తారు’’ అని ధీమాగా చెబుతున్నారు అందాలభామ సమంత. త్వరలో విడుదల కానున్న ‘దూకుడు’ సినిమా గురించి మాట్లాడుతూ సమంత పై విధంగా స్పందించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ- ‘‘నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి నేర్చుకున్నాను. తొలి సినిమా ‘ఏం మాయ చేసావె’లో డాన్స్‌లో నా నైపుణ్యాన్ని చూపించే అవకాశం రాలేదు. ఇక రెండో సినిమా ‘బృందావనం’లో ఆ అవకాశం వచ్చినా... అది పూర్తి స్థాయిలో రాలేదు. కానీ ‘దూకుడు’లో మాత్రం నా ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే అవకాశం కలిగింది. ఇందులో స్టెప్స్ సూపర్బ్‌గా ఉంటాయి. మహేష్ మార్క్ స్టైలిష్ డాన్సులతో పాటు, ఎన్నో వైరైటీ డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో చేసే అవకాశం దొరికింది నాకు. డాన్సుల పరంగానే కాదు.. నటన పరంగా కూడా నాకు పూర్తిస్థాయి సంతృప్తినిచ్చిన సినిమా ‘దూకుడు’....

ఓ వైపు ఆటో సుబ్బారావు..

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్‌సిటీలో మహేష్‌బాబు, పార్వతీమెల్టన్‌పై 'ఓ వైపు హాయ్‌ అంటాడు ఆటో సుబ్బారావు..' అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో చిత్రీకరణ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్‌లో ఫిక్సయితే బ్త్లెండ్‌గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్‌రా నాది..' ఇలా మహేష్‌ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్‌ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాలేదు. తమన్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న...

మహేష్ మాస్ మసాలా ‘దూకుడు’

‘భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది’ అంటూ మహేష్ త్వరలో వెండితెర మీదికి ‘దూకుడు’గా రాబోతున్నాడు. ఆయన అభిమానులు ఆయన నుంచి ఎదురుచూస్తున్న మాస్ మసాలా వినోదాన్ని ఈ చిత్రం ద్వారా పంచబోతున్నాడు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించని రీతిలో దర్శకుడు శ్రీనువైట్ల మహేష్‌ను ‘దూకుడు’లో ఓ కొత్త కోణంలో చూపించబోతున్నాడని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సమంత నాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కాబోతుంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జి.రమేష్‌బాబు సమర్పణలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేష్, పార్వతీమెల్టన్‌పై ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాటలో పార్వతీ హాట్ హాట్‌గా కనిపించనుందని యూనిట్ వర్గాలు చెపుకుంటున్నాయి. ఇక ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానున్న...

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు దిల్‌రాజు బేనరులో వెంకటేష్, మహేష్ నటిస్తున్న

ఇది ఏప్రిల్ ఫూల్ వార్త కాదు. ఇది నిజంగా నిజం. అగ్ర కథానాయకులు వెంకటేష్, మహేష్‌బాబు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఎన్నాళ్లనుంచో ఊరిస్తున్న ఈ వార్త అతి త్వరలోనే నిజం కాబోతోంది. నిజమైన మల్టీస్టారర్‌కు నిర్వచనంగా నిలిచే ఈ చిత్రం టైటిల్ కూడా సరికొత్త పంథాలో ఉండబోతోంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసినట్టుగా సమాచారం. వరుస విజయాల పరుసవేదిగా పేరు తెచ్చుకున్న ‘దిల్’రాజు ఈ చిత్రానికి నిర్మాత. 2008లో ‘కొత్త బంగారులోకం’తో తన సృజనను చాటుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మూడేళ్లు శ్రమించి ఈ మల్టీస్టారర్ స్క్రిప్టును సిద్ధం చేశారు. కానీ, వెంకటేష్-పవన్‌కళ్యాణ్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారని మొదట్లో వార్తలు వచ్చాయి. వెంకటేష్, మహేష్‌లకు స్క్రిప్టు నచ్చడంతో వెంటనే పచ్చజెండా ఊపినట్టుగా...

రామోజీ ఫిలింసిటీలో 'దూకుడు' గీతం

దసరా బరిలో సందడి చేసేందుకు మహేష్‌బాబు సిద్ధమవుతున్నారు... 'దూకుడు' చిత్రంతో. ఆ సినిమాకి సంబంధించిన గీతాన్ని ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్‌ని సిద్ధం చేశారు. మహేష్‌, సమంతలపై చిత్రిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తవుతాయి. శ్రీను వైట్ల దర్శకత్వంలో 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 'దూకుడు' చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ నెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర తెలిపారు. తమన్‌ స్వరపరచిన గీతాలు ఇటీవలే శ్రోతల ముందుకొచ్చా...

మహేష్ బిజినెస్ మొదలైంది

మహేష్, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ‘బిజినెస్ మేన్’ షూటింగ్ సెప్టెంబర్ 2న శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ప్రారంభమైంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ‘ ‘పోకిరి’ తర్వాత మళ్ళీ పూరి జగన్నాథ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా వుంది. మా ఇద్దరి కలయికలో అద్భుతమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. మా ఇద్దరి కలయికలో నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం చాలా పెద్ద సినిమా కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న స్క్రిస్ట్ ఇది’అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ‘ మహేష్‌తో ‘పోకిరి’ తర్వాత చేస్తున్న చిత్రమిది. ఇందులో మహేష్ పాత్ర చిత్రణ, ఆయన చెప్పే డైలాగ్స్ అద్భుతంగా వుంటాయి.ఎక్కడా రాజీపడకుండా నిర్మాత వెంకట్ చిత్రాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నారు’అని తెలిపారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ‘టెక్నికల్‌గా అత్యున్నత స్థాయిలో ...

వచ్చేనెల 23న 'దూకుడు'

''ప్రేక్షకుల అంచనాలు అందుకొనేలా ఉంటుంది మా 'దూకుడు' చిత్రం. ఆ సినిమా విడుదలయ్యే రోజు కోసం అందరిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను'' అన్నారు మహేష్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సెప్టెంబరు 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రంలో సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ ''మహేష్‌ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. అందులో ఆయన పలికిన సంభాషణలు అందరికీ నచ్చుతాయి. 'కళ్లున్నోడు ముందు చూస్తాడు... దిమాక్‌ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు', 'భయానికి మీనింగే తెలియని బ్లడ్‌రా నాది...' లాంటి పదునైన మాటలున్నాయ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూ సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, సంజయ్‌ స్వరూప్‌, ఎమ్మెస్‌...

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ‘దూకుడు’

‘ఇటీవల విడుదలైన ‘దూకుడు’ ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. థమన్ అందించిన సంగీతం వైవిధ్యమైన బాణీలతో ఆకట్టుకుంటోంది. మహేష్‌బాబు చిత్రాల్లోనే ది బెస్ట్ ఆడియో అని అందరూ అంటున్నారు. కళ్లున్నోడు ముందు చూస్తాడు. దిమాక్ వున్నోడు దునియాను చూస్తాడు...లాంటి డైలాగ్స్ ఎన్నో ‘దూకుడు’ చిత్రంలో మహేష్‌బాబు అభిమానుల్ని ఉర్రూతలూగిస్తాయి’ అన్నారు చిత్ర నిర్మాతలు గోపిచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర. 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ ‘రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే వారిని అన్ని విధాలా సంతృప్తిపరిచే విధంగా ఈ చిత్రం వుంటుంది....

సెప్టెంబర్ ప్రథమార్ధంలో 'దూకుడు'

మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'దూకుడు'. సమంత కథానాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. వచ్చేనెల ప్రథమార్ధంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. నిర్మాతలు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ''తమన్‌ హుషారైన బాణీలను అందించారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటల్లో ఉన్న దూకుడు కథ, కథనాల్లోనూ కనిపిస్తుంది. మహేష్‌బాబు తరహా యాక్షన్‌ ఘట్టాలు, శ్రీను వైట్ల శైలి వినోదం కలగలిపిన చిత్రమిది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ''న్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోను సూద్‌, సాయాజీ షిండే, నాజర్‌, తనికెళ్ల భరణి, చంద్రమోహన్‌, మాస్టర్‌ భరత్‌, సురేఖావాణి, సుధ, వినయప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు....

మహేష్ సరసన హన్సిక ?

ముద్దుగుమ్మ హన్సిక మహేష్‌బాబు సరసన ‘ది బిజినెస్‌మేన్’లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్షికమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. కాజల్ అగర్వాల్ లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో హన్సిక కీలక పాత్రకు ఎంపికయినట్లు తెలిసింది. అయితే సెకండ్ హీరోయిన్ పాత్రలో అస్సలు నటించనని గతంలో ఈ భామ ప్రకటించడం విశేషం. గత కొంతకాలంగా తెలుగులో సరైన సక్సెస్‌లు లేని హన్సిక ఇటీవల ‘కందిరీగ’ విజయంతో ఉత్సాహంగా వుంది. అంతేకాదు తమిళంలో విజయ్ సరసన ఈ సుందరి నటించిన ‘వేలాయుధం’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్‌బాబు సరసన నటించే అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకున్న...

దూకుడు రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నా : మహేష్

‘శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దూకుడు షూటింగ్ ఒక పిక్నిక్‌లా సాగింది. షూటింగ్ జరిగిన 9నెలలు చాలా ఆనందంగా గడిపాను. శ్రీను వైట్ల నాన్న గారికి పెద్ద అభిమాని. ఆ అభిమానంతో ‘దూకుడు’ లాంటి మంచి సినిమా నాకు అందించినందుకు శ్రీను వైట్లకు జీవితాంతం రుణపడి వుంటాను’ అన్నారు మహేష్.మహేష్ మాట్లాడుతూ‘ ఈ ఆడియో ఫంక్షన్ చూస్తుంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌లా వుంది. మణిశర్మ దగ్గర థమన్ కీబోర్డ్ ప్లేయర్‌గా వున్నప్పటి నుంచి తెలుసు. థమన్ ‘దూకుడు’ సాంగ్స్ అదరగొట్టాడు. ఇంత వరకు ఇలాంటి నిర్మాతలతో వర్క్ చేయలేదు. ఎక్కడా రాజీపడకుండా చాలా చక్కగా చిత్రాన్ని నిర్మించారు. ‘దూకుడు’ విడుదల కోసం అందరి లాగే నేనూ ఎదురు చూస్తున్నా. వచ్చేనెల సినిమా విడుదల కాబోతోంది. ఆరోజు అభిమానులందరికీ పండగే’అన్నారు. దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ‘...

'దూకుడు' గీతాలు

 ''భయానికి మీనింగంటే తెలియని బ్లడ్‌రా నాది " - అని దూకుడులో ఓ డైలాగ్‌ ఉంది. దీనికి స్ఫూర్తి కృష్ణ వ్యక్తిత్వమే. అన్ని వర్గాల ప్రేక్షకులకీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామ''న్నారు శ్రీను వైట్ల. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'దూకుడు'. మహేష్‌బాబు, సమంత జంటగా నటించారు. ఈ చిత్రంలోని గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరించారు. సుకుమార్‌ స్వీకరించారు. మహేష్‌బాబు మాట్లాడుతూ ''ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే వంద రోజుల వేడుకలా ఉంది. తమన్‌ చక్కటి బాణీలు అందించాడు. శ్రీను వైట్ల నాన్నగారికి పెద్ద అభిమాని. చిత్రీకరణ జరిగిన తొమ్మిది నెలలు ఓ విహార యాత్రలా గడిచింది. దూకుడు విడుదల నా అభిమానులకు పండగే'' అని చెప్పారు. ''ప్రేక్షకులు దూకుడు పై పెట్టుకున్న అంచనాలను కచ్చితంగా చేరుకుంటామ''న్నారు చిత్ర దర్శకుడు. సమంత మాట్లాడుతూ...

'దూకుడు' ఆడియో విడుదల

ప్రిన్స్‌ మహేష్‌బాబు, సమంత జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'దూకుడు'. ఈ చిత్రంలోని పాటలను శిల్పాకళావేదికగా జరిగిన ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, మహేష్‌బాబు, నమ్రత, హీరోయిన్‌ సమంత, దర్శకులు శ్రీనువైట్ల, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, నిర్మాత అనిల్‌, సంగీత దర్శకుడు థమన్‌ తదితరులు పాల్గొన్నారు. For Songs Download : http://songszonal.blogspot.com/2011/08/dookudu-telugu-songs.h...

మహేష్‌బాబు, పూరీలబిజినెస్‌మేన్ మొదలైంది

అంతకు ముందున్న బాక్సాఫీస్ రికార్డులకు ‘దిమ్మతిరిగి మైండ్ బ్లాక్’ అయ్యేలా చేసిన సినిమా మహేష్-పూరి జగన్నాథ్‌ల ‘పోకిరి’. ఆ సినిమా సృష్టించిన సంచలనం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మళ్లీ ఆ కాంబినేషన్‌ని రిపీట్ చేస్తూ రూపొందుతోన్న చిత్రమే ‘బిజినెస్ మేన్’. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సంస్థ కార్యాలయంలో యూనిట్ సభ్యుల మధ్య సోమవారం మొదలైంది. దేవుని పటాలపై ముహూర్తపు దృశ్యాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పట్నుంచీ ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళుతుందా అని ఆతృతతో ఎదురుచూశాను. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌ని అంతగొప్పగా తీర్చిదిద్దారు పూరి. మళ్లీ ‘పోకిరి’ లాంటి సెన్సేషన్ హిట్ తర్వాత ఆయనతో పనిచేయడం ఆనందంగా ఉంది. మా కాంబినేషన్ అంటే.. ఎక్స్‌పెక్టేషన్లు ఎక్కువగా ఉంటాయి. వాటిని...

'ది బిజినెస్‌ మేన్‌' ప్రారంభం

మహేష్‌బాబుని 'పోకిరి'గా మార్చిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన చిత్రమది. మహేష్‌-పూరి కలయికలోమరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే... 'ది బిజినెస్‌ మేన్‌'. ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైంది. మహేష్‌బాబు మాట్లాడుతూ ''జగన్‌ నాకు ఈ కథ చెప్పగానే బాగా నచ్చింది. అందరి అంచనాలను అందుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతారనే నమ్మకం ఉంద''న్నారు. ''పోకిరి తరవాత మళ్లీ మహేష్‌తో చేయడం ఆనందంగా ఉంది. నా సినిమాలో కథానాయకుడి పాత్ర చిత్రీకరణ బాగుంటుందని అందరూ చెబుతారు. నాకు నచ్చిన హీరో 'ది బిజినెస్‌ మేన్‌'లో కనిపిస్తాడ''ని చెప్పారు. ''మహేష్‌ని ఎలా చూడాలని అభిమానులు ఆశిస్తారో... అలానే తీర్చిదిద్దుతున్న చిత్రమిది. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా చిత్రాన్ని...

18న 'దూకుడు' పాటలు

మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. సమంత నాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. 'దూకుడు' పాటల్ని ఆగస్టు 18న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని మహేష్‌బాబు తన ట్విట్టర్‌లో తెలిపారు. ''దూకుడు పాటలు బాగా వచ్చాయి. తమన్‌ మంచి సంగీతాన్ని అందించారు. 18న పాటలు విడుదల చేస్తాం. మీలాగే నేను కూడా ఆరోజు కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని రాసుకొన్నారు. ఇటీవల 'దూకుడు' ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. దేనికీ తలవంచని ఓ యువకుని కథ ఇది. అతని లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా అందుకొన్నాడు? అనే విషయాల్ని ఆసక్తిగా చూపిస్తున్నాం అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు....

మహేష్‌తో పార్వతీ మెల్టన్ ఐటెమ్‌సాంగ్

పవన్‌కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన చిత్రం ‘మహేష్ ఖలేజా’. ఈచివూతంలో మహేష్‌కు జోడీగా పార్వతీమెల్టన్ నటించాల్సింది... కానీ ఆ అవకాశాన్ని అనుష్క ఎగరేసుకుపోవడంతో ‘ఖలేజా’ చిత్రంలో నటించే ఛాన్స్ కోల్పోయిన పార్వతీమెల్టన్ మరోసారి రెట్టించిన ఉత్సాహంతో తెలుగులో తన సత్తాను చాటుకోవడానికి రెడీ అవుతోంది. ఈ ముద్దుగుమ్మ మహేష్ ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి చిందులేయబోతోంది. దర్శకుడు శ్రీనువైట్ల ప్రత్యేకంగా కోరడంతో ఆ పాటలో నటించడానికి పార్వతీ మెల్టన్ అంగీకరించిందట.‘ఖలేజా’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న ఆమె మళ్ళీ మహేష్ నటిస్తున్న ‘దూకుడు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆయనతో చిందులేసే అవకాశం పొందడం విశే...

ఒక్కసారి ఫిక్స్ అయితే అంతే

‘అతడు’ ఓ అంతర్ముఖుడు... నిండు గాంభీర్యంగా కనిపించే నెమ్మదస్తుడు’ ఇది మహేష్‌పై చాలామంది అభిప్రాయం. కానీ ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే అంతే... బ్లయిండ్‌గా వెళ్లిపోయే మొండితనం, ఆయన సొంతం అని చాలా తక్కువ మందికి తెలుసు. ‘దూకుడు’గా సినిమాలు చేయాలని మహేష్ నిశ్చయించుకున్న తర్వాత రోజుకు 12 గంటల పాటు షూటింగ్ స్పాట్‌లోనే ఉంటున్నారాయన. ఈ నెల చివరిలో కానీ, వచ్చేనెల ప్రథమార్ధంలో కానీ ‘దూకుడు’ విడుదల కానుంది. ‘పోకిరి’గా బాక్సాఫీస్ వసూళ్లకు కొత్త అర్థం చెప్పిన మహేష్... రాబోతున్న ‘దూకుడు’తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అని ఆయన అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను మరింత పెంచడానికి ఈ నెల 13న ‘దూకుడు’ పాటలు విడుదలవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఆ...

అడుగుజాడల్లో...

'మీ నాన్నగారిలా వేగంగా సినిమాలు తీయరెందుకు..?' - మహేష్‌బాబు ఎప్పుడు ఎదురైనా చాలామంది సంధించే ప్రశ్న ఇదే. అందుకు ఆయన చిరునవ్వే సమాధానం. ఏడాదికి పద్దెనిమిది సినిమాల్లో నటించిన ఘనత ఘట్టమనేని కృష్ణది. మహేష్‌ పదకొండు సంవత్సరాల్లో చేసిన సినిమాల సంఖ్య... 16. నాణ్యత కూడా కావాలనేది మహేష్‌ వాదన. అందులోనూ నిజం కనిపిస్తుంది. 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి'... ఇలాంటి సినిమాలకు రెండేళ్లు తీసుకొన్నా తప్పేం లేదనిపిస్తుంది. కథతోపాటు సాంకేతికాంశాల మీద కూడా శ్రద్ధ పెట్టే కథానాయకుడు మహేష్‌. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది..? అని అడిగితే మళ్లీ కృష్ణ కనిపిస్తారు. స్కోప్‌, కలర్‌, 70ఎమ్‌.ఎమ్‌... ఇలా తెలుగు సినిమా సాంకేతిక హంగులు అద్దుకొన్న ప్రతి దశలోనూ కృష్ణ అడుగులు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే.. మహేష్‌ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. ఇక దూకుడే! 'అతిథి', 'ఖలేజా'...

రామోజీ ఫిల్‌సిటీలో దూకుడు

ఈ రోజు ఖాళీగా కూర్చుని... పదేళ్ల తరవాత నా పరిస్థితి ఏమిటో..? అని గాల్లో మేడలు కట్టే మనస్తత్వం కాదతనిది. ఇప్పుడు చేసిన పని వందేళ్లు గడిచినా గర్వంగా చెప్పుకోవాలి అనుకొంటాడు. ప్రతి అడుగూ చరిత్రగా మారాలని భావిస్తాడు. సాహసమే సోపానంగా చేసుకొని ముందడుగు వేసిన ఆ యువకుడి లక్ష్యం ఏమిటి? దాన్ని ఎలా సాధించాడు? ఈ విషయాలు తెలియాలంటే 'దూకుడు' సినిమా చూడాల్సిందే. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. సమంత నాయిక. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో పాటల్ని విడుదల చేయబోతున్నారు. యాక్షన్‌, వినోదం, సంగీతం.... ఈమూడూ సమపాళ్లలో మేళవించిన సినిమా ఇది. కథ, కథనాలు ఎవరూ ఊహహంచని విధంగా ఉంటాయి. మహేష్‌బాబు పాత్ర చిత్రణ ప్రధాన ఆకర్షణ అని చిత్రబృందం చెబుతోంది....

Pages 311234 »

 
Design by Free Wordpress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Templates